"ధనాని భూమై పశువష్టి గోష్టే...భార్యాగృహ ర్వారే సుతా స్మశానే జనాని భూమే. ధర్మాను గోగచ్ఛతి జీవేక అనే శ్లోకానికి అర్థం ఏమిటంటే ..ధనము భూమిలో ఉండిపోతుంది. పశువులు కొట్టంలో ఉండిపోతాయి. భార్య గుమ్మందాక వస్తుంది. కొడుకు స్మశానం దాకా వస్తాడు.. జనం కూడా స్మశానం వరకే వస్తారు. ధర్మం ఒక్కటే జీవుడితో వచ్చేది'' ఈ తాత్పర్యమే నేను ఆచరిస్తాను అంటారు రిటైర్ట్ న్యాయమూర్తి చేకూరి వెంకట సూర్యనారాయణరాజు..
ఈ పేరు ఎక్కువమందికి తెలీకపోవచ్చు కాని దేవుడు జడ్జి అంటే మాత్రం ఓ ఆయనా అంటారు. న్యాయశాఖలో 33 ఏళ్ల అనుభవం ఆయనది. అందులో జడ్జిగా 17 ఏళ్లు. అప్పటి తీర్పులకే దేవుడు జడ్జిగా పేరు పొందారు. దీని వెనుక ఎంతటి త్యాగం, నైతిక విలువలు, పోరాటాలు ఉన్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 15 ఏళ్ళ క్రితమే పదవీ విరమణ చేసినప్పటికీ, అనంతర జీవనం కూడా సమాజ సేవకే అంకితమవ్వడం ఆయన గొప్పతనం.
ఓ న్యాయమూర్తి పనిచేసే కోర్టుకు ధర్మరాజు కోర్టుగా పేరు రావడమంటే మాటలు కాదు. శిక్షలు, జరిమానాలు విధించే ముందు ఆయన కక్షిదారుల పట్ల కనికరం చూపించడమే అందుకు కారణం. కక్షిదారుల పరిస్థితులను సమగ్రంగా పరిశీలించేవారు. విశాఖపట్టణం పోర్టులో మున్సిఫ్ మేజిస్ట్రేట్గా పనిచేసినపుడు అవసరమైతే కక్షిదారుల నివాసాలకు వెళ్ళి కుటుంబ సభ్యులతో ఇంటి పరిస్థితుల గురించి చర్చించేవారు. ఆ తర్వాతే వారికి శిక్ష ఖరారు చేసేవారు. ఆ శిక్ష ఎంతో ఎంతో న్యాయంగా ఉండేది. అలా చేస్తాడనే ఆయన పనిచేసిన కోర్టు ధర్మరాజు కోర్టుగా పేరు పొందింది. ఈ శైలి లాయర్లలో, తోటి న్యాయమూర్తులలో చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ కక్షిదారులు మాత్రం చాలా ఆనందించేవారు.
దేవుడు జడ్జి ఎలా అయ్యారంటే.....
శిక్షకు గురైనవారు జరిమానా చెల్లించలేకపోతే తనే ఒక్కొక్కసారి ఆ డబ్బును ప్రభుత్వ ఖాతాలో జమచేసేవారు. ఒక్కొక్కసారి డబ్బు సాయం కూడా అందించి కక్షలు పెంచుకోవద్దంటూ సలహాలు ఇచ్చేవారు. శిక్షలు కూడా నెల నుంచి 15 రోజులలోపు మాత్రమే విధించేవారు. ఈ విషయంలో తన ధోరణిని ఏమాత్రం మార్చుకునేవారు కాదు. ఆయన విశాఖపట్టణంలో పనిచేసినపుడు ఎక్కువగా రైల్వే కేసులు చూసే వారు. అక్కడ బొగ్గు చోరీ కేసులు, టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసిన కేసులు ఎక్కువగా వచ్చేవి.
మామూలుగా రైల్వే బొగ్గు దొంగతనం కేసుల్లో దొంగతనం చిన్నదైనా, పెద్దదైనా శిక్ష మాత్రం ఒకటే ఉండేది. ఆరు నెలల నుంచి ఏడాది వరకూ జైలు శిక్ష వేసేవాళ్లు. ఒకసారి తట్ట బొగ్గు దొంగతనం చేస్తూ ఒక వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. అదే సమయంలో ఒక లారీ బొగ్గు పట్టుకుపోతూ మరో దొంగ కూడా దొరికాడు. చట్టప్రకారం అయితే వీరిద్దరికీ ఒకే శిక్ష వేయాలి. కాని రాజుగారు తట్ట బొగ్గు దొంగతనం చేసిన వ్యక్తికి నెల రోజులు జైలు శిక్ష వేసి, లారీలోడు బొగ్గుల దొంగకు ఆరెనెలలు వేశారు.
మొదటి దొంగ కట్టాల్సిన జరిమానా తనే కట్టారు. తీర్పు హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి వెళ్లినపుడు 'చట్టాన్ని అతిక్రమించి సొంత తీర్పులు ఇవ్వడం కుదరద'ని ఆయన హెచ్చరించారు. చిన్నదొంగను, పెద్ద దొంగను ఒకే గాటన కట్టకూడదు కదా అంటూ ఆయన దానికి వివరణ ఇచ్చుకున్నారు. రైల్వే టిక్కెట్టు కొనకుండా ప్రయాణం చేసిన వారికి, ఆటోలు, రిక్షాలు రాంగ్ పార్కింగ్ చేసేవారితో ఆరు వందల నుంచి రెండు వేల వరకూ జరిమానా కట్టించుకుంటారు. ఇలాంటి కేసుల్లో పేదవారంటే వారితో రెండు రూపాయలే కట్టించేవారు. దీంతో పేదవాళ్లపాలిట దేవుడిగా మారారాయన.
ఇంటికెళ్లిన న్యాయం...
ఒకసారి వైజాగ్లో ఇద్దరన్నదమ్ములు ఇంటి ప్రహరీగోడ విషయంలో గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసు కేసులు పెట్టుకున్నారు. కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడి నీది తప్పంటే నీది తప్పంటూ వాదించుకున్నారు. రాజుగారు కేసు వాయిదా వేసి మర్నాడు ఆ ఇద్దరన్నదమ్ముల ఇళ్లకు వెళ్లారు. రెండు కుటుంబాలను కూర్చోబెట్టి మాట్లాడారు. జడ్జీగారే స్వయంగా ఇంటికి వచ్చి సమస్య గురించి మాట్లాడడం చూసి వారంతా షాకయ్యారు.
అన్ని విషయాలను తెలుసుకున్నాక ఎవరు గోడ ఎక్కడ కట్టుకోవాలో ఆయనే స్వయంగా చెప్పి వచ్చారు. ఈ పెద్దాయన సలహాలు, ఆయన చెప్పిన న్యాయం ఆ ఇద్దరన్నదమ్ములకి నచ్చి ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసుల్ని వెనక్కి తీసుకున్నారు. ఇలాంటి కేసులు ఒకటీ రెండూ కాదు వందల సంఖ్యలో పరిష్కరించారాయన. రాజమండ్రిలో న్యాయమూర్తిగా పనిచేసేటప్పుడు దశాబ్ద్దాలుగా పెండింగ్లో ఉన్న 2200 కేసుల్ని రెండేళ్లలో పరిష్కరించి న్యాయశాఖ ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా పొందారు. ఏ కోర్టులో ఉన్నా ఆయన ఇదే ధోరణి అవలంబించేవారు.
సేవా జీవితం...
దేవుడు జడ్జికి కబడ్డి అంటే ఎంతో ఇష్టం. కాలేజి చదువు నుంచే ఎన్నో పోటీల్లో పాల్గొనే వాడినని చెప్పారు. న్యాయశాఖలో ఉద్యోగిగా ఉండి కూడా కబడ్డీ ఆడి రాష్ట్రస్థాయి క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. రిటైర్ అయినా ఆటపై మక్కువ పోలేదు అంటారు. పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆయన తన సేవా కార్యక్రమాలు ఆపలేదు. తనకు వచ్చే రూ.30 వేల పింఛను సొమ్ములో కొంత భాగాన్ని పేదలు కోసం కేటాయిస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికంగా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఓ న్యాయమూర్తి పనిచేసే కోర్టుకు ధర్మరాజు కోర్టుగా పేరు రావడమంటే మాటలు కాదు. శిక్షలు, జరిమానాలు విధించే ముందు ఆయన కక్షిదారుల పట్ల కనికరం చూపించడమే అందుకు కారణం. కక్షిదారుల పరిస్థితులను సమగ్రంగా పరిశీలించేవారు. విశాఖపట్టణం పోర్టులో మున్సిఫ్ మేజిస్ట్రేట్గా పనిచేసినపుడు అవసరమైతే కక్షిదారుల నివాసాలకు వెళ్ళి కుటుంబ సభ్యులతో ఇంటి పరిస్థితుల గురించి చర్చించేవారు. ఆ తర్వాతే వారికి శిక్ష ఖరారు చేసేవారు. ఆ శిక్ష ఎంతో ఎంతో న్యాయంగా ఉండేది. అలా చేస్తాడనే ఆయన పనిచేసిన కోర్టు ధర్మరాజు కోర్టుగా పేరు పొందింది. ఈ శైలి లాయర్లలో, తోటి న్యాయమూర్తులలో చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ కక్షిదారులు మాత్రం చాలా ఆనందించేవారు.
దేవుడు జడ్జి ఎలా అయ్యారంటే.....
శిక్షకు గురైనవారు జరిమానా చెల్లించలేకపోతే తనే ఒక్కొక్కసారి ఆ డబ్బును ప్రభుత్వ ఖాతాలో జమచేసేవారు. ఒక్కొక్కసారి డబ్బు సాయం కూడా అందించి కక్షలు పెంచుకోవద్దంటూ సలహాలు ఇచ్చేవారు. శిక్షలు కూడా నెల నుంచి 15 రోజులలోపు మాత్రమే విధించేవారు. ఈ విషయంలో తన ధోరణిని ఏమాత్రం మార్చుకునేవారు కాదు. ఆయన విశాఖపట్టణంలో పనిచేసినపుడు ఎక్కువగా రైల్వే కేసులు చూసే వారు. అక్కడ బొగ్గు చోరీ కేసులు, టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసిన కేసులు ఎక్కువగా వచ్చేవి.
మామూలుగా రైల్వే బొగ్గు దొంగతనం కేసుల్లో దొంగతనం చిన్నదైనా, పెద్దదైనా శిక్ష మాత్రం ఒకటే ఉండేది. ఆరు నెలల నుంచి ఏడాది వరకూ జైలు శిక్ష వేసేవాళ్లు. ఒకసారి తట్ట బొగ్గు దొంగతనం చేస్తూ ఒక వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. అదే సమయంలో ఒక లారీ బొగ్గు పట్టుకుపోతూ మరో దొంగ కూడా దొరికాడు. చట్టప్రకారం అయితే వీరిద్దరికీ ఒకే శిక్ష వేయాలి. కాని రాజుగారు తట్ట బొగ్గు దొంగతనం చేసిన వ్యక్తికి నెల రోజులు జైలు శిక్ష వేసి, లారీలోడు బొగ్గుల దొంగకు ఆరెనెలలు వేశారు.
మొదటి దొంగ కట్టాల్సిన జరిమానా తనే కట్టారు. తీర్పు హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి వెళ్లినపుడు 'చట్టాన్ని అతిక్రమించి సొంత తీర్పులు ఇవ్వడం కుదరద'ని ఆయన హెచ్చరించారు. చిన్నదొంగను, పెద్ద దొంగను ఒకే గాటన కట్టకూడదు కదా అంటూ ఆయన దానికి వివరణ ఇచ్చుకున్నారు. రైల్వే టిక్కెట్టు కొనకుండా ప్రయాణం చేసిన వారికి, ఆటోలు, రిక్షాలు రాంగ్ పార్కింగ్ చేసేవారితో ఆరు వందల నుంచి రెండు వేల వరకూ జరిమానా కట్టించుకుంటారు. ఇలాంటి కేసుల్లో పేదవారంటే వారితో రెండు రూపాయలే కట్టించేవారు. దీంతో పేదవాళ్లపాలిట దేవుడిగా మారారాయన.
ఇంటికెళ్లిన న్యాయం...ఒకసారి వైజాగ్లో ఇద్దరన్నదమ్ములు ఇంటి ప్రహరీగోడ విషయంలో గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసు కేసులు పెట్టుకున్నారు. కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడి నీది తప్పంటే నీది తప్పంటూ వాదించుకున్నారు. రాజుగారు కేసు వాయిదా వేసి మర్నాడు ఆ ఇద్దరన్నదమ్ముల ఇళ్లకు వెళ్లారు. రెండు కుటుంబాలను కూర్చోబెట్టి మాట్లాడారు. జడ్జీగారే స్వయంగా ఇంటికి వచ్చి సమస్య గురించి మాట్లాడడం చూసి వారంతా షాకయ్యారు.
అన్ని విషయాలను తెలుసుకున్నాక ఎవరు గోడ ఎక్కడ కట్టుకోవాలో ఆయనే స్వయంగా చెప్పి వచ్చారు. ఈ పెద్దాయన సలహాలు, ఆయన చెప్పిన న్యాయం ఆ ఇద్దరన్నదమ్ములకి నచ్చి ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసుల్ని వెనక్కి తీసుకున్నారు. ఇలాంటి కేసులు ఒకటీ రెండూ కాదు వందల సంఖ్యలో పరిష్కరించారాయన. రాజమండ్రిలో న్యాయమూర్తిగా పనిచేసేటప్పుడు దశాబ్ద్దాలుగా పెండింగ్లో ఉన్న 2200 కేసుల్ని రెండేళ్లలో పరిష్కరించి న్యాయశాఖ ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా పొందారు. ఏ కోర్టులో ఉన్నా ఆయన ఇదే ధోరణి అవలంబించేవారు.
సేవా జీవితం...
దేవుడు జడ్జికి కబడ్డి అంటే ఎంతో ఇష్టం. కాలేజి చదువు నుంచే ఎన్నో పోటీల్లో పాల్గొనే వాడినని చెప్పారు. న్యాయశాఖలో ఉద్యోగిగా ఉండి కూడా కబడ్డీ ఆడి రాష్ట్రస్థాయి క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. రిటైర్ అయినా ఆటపై మక్కువ పోలేదు అంటారు. పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆయన తన సేవా కార్యక్రమాలు ఆపలేదు. తనకు వచ్చే రూ.30 వేల పింఛను సొమ్ములో కొంత భాగాన్ని పేదలు కోసం కేటాయిస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికంగా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
- వరప్రసాద్, ఆన్లైన్,భీమవరం
అమెరికాలో అత్యున్నత ఉద్యోగాలు చేస్తున్న మన తెలుగింటి ఆడపడుచులు చాలా మందే ఉన్నారు. వారిలో నెలకో ఇద్దర్ని 'మన పరదేశీ' శీర్షిక కింద పరిచయం చేసే కాలమ్ ఇవాళ్టి నుంచి ప్రారంభించాం. నాసాకు చెందిన లాంగ్లీ రీసెర్చి సెంటర్ (లార్క్)లో సీనియర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్గా పని చేస్తున్న ఏకైక భారతీయ మహిళ మంజులా అంబూర్. నెల్లూరులో పుట్టి కర్నూలులో చదివి అమెరికా వెళ్లి నాసా ఇచ్చే అసాధారణ ప్రతిభా మోడల్, వారి టీమ్ లీడర్షిప్ అవార్డులు పొందిన ఆమే మొదటి 'మన పరదేశీ'
జెండర్తో కాకుండా మెరిట్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ. అందుకని నన్నెవరూ వేరుగా చూడరు. నా పనిని గౌరవిస్తారు. మొదటి నుండీ నాసాలో చాలెంజింగ్ పనులే ఇచ్చేవారు. ఇష్టమైన పనిచేస్తుంటే కష్టంగా అనిపించదు అనేది నాకు బాగా వర్తిస్తుంది. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలతో ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోగలిగానంటే ఈ పని పట్ల నాకున్న ఇష్టమే కారణం. మా ఆయన సహకారం కూడా ఎంతో ఉంది నా విజయంలో. అంతేకాకుండా నాకవసరం అయినప్పుడల్లా అమ్మావాళ్లు వచ్చి సాయం చేయడంతో కెరీర్లో పైకెదగగలిగాను. అదే సహకారం ఇప్పటికీ లభిస్తోంది.
నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు మా పెద్దబాబు పసివాడు. ఇప్పుడు వాడు డాక్టర్, అమెరికన్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. తనకి ఇద్దరు పాపలు. చిన్నబ్బాయి ముందు ఇంజనీరింగ్ చదివినా సర్జన్ కావాలని ఉండేది వాడికి. అందుకని మళ్లీ మెడిసిన్ చదివాడు. మే నెలలో గ్రాడ్యుయేట్ అయ్యాడు. రెసిడెన్సీ చేస్తూ క్యాన్సర్ సర్జరీలో స్పెషలైజేషన్ చేస్తాడు. చిన్న బాబుకి తెలుగమ్మాయితో నిశ్చితార్థం అయ్యింది. వ చ్చే ఏడాది పెళ్లి చేస్తాం. కెరీర్ ముఖ్యమే అయినప్పటికీ కుటుంబం అంతకంటే ముఖ్యం నాకు. పిల్లలతో చాలా సన్నిహితంగా ఉంటాను. మన సంస్కృతి, సంప్రదాయాలంటే మాకు చాలా ఇష్టం. ఆ పద్ధతుల్లోనే పిల్లల్ని పెంచాం. మా పెద్దబ్బాయి పెళ్లి భారతీయ సంప్రదాయం ప్రకారం, చర్చిలో వారి పద్ధతి ప్రకారం కూడా చేశాం. మా పిల్లలిద్దరూ ఇప్పటికీ నాకు రెగ్యులర్గా ఫోన్ చేసి అన్ని విషయాలూ చెప్తారు.



శ్రీశ్రీ ఎప్పుడో చెప్పారు "పత్రికలు..పెట్టుబడిదారుల విష పుత్రికలని''. అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా విశ్వరూపం చూసే అవకాశం ఆయనకు లేకపోయింది. చూసి ఉంటే ఇంకేమి అనేవారో. మీడియా కూడా వ్యవస్థలో భాగమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ఏమిస్తే ...రేపు అదే మనకు అంటే సమాజానికి అందుతుంది. అందుకే మనందరం సమాజంలో భాగమని గుర్తించాలి. నిజాలు చెప్పడం ఒక పద్ధతి. అబద్దాన్ని నిజం చేయడానికి ఒకరి వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం ప్రమాదకరం. చంద్రబాల -జెడీ లక్ష్మీనారాయణల పరిచయాన్ని తప్పుగా ప్రచారం చేయాలనుకోవడం ఈ కోవకిందకే వస్తుంది.
ఇలాంటి విషయాల్లో సాధారణంగా ఏమవుతుందంటే ఆడవాళ్లు బయటికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారంటే రకరకాల ఊహాగానాలు జరుగుతాయి. ఆమె ప్రవర్తనని, శీలాన్ని శంకించే అవకాశం ఉంది.












తెలంగాణపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ ప్రకటించినా, ఆరో తేదీన జరిగే చర్చలకు ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది రాజకీయ పార్టీలూ హాజరవుతాయన్న విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. ‘అఖిలపక్ష సమావేశానికి ఎనిమిది పార్టీల్నీ ఆహ్వా నించాం. మొత్తం ఎనిమిది పార్టీలూ సమావేశానికి హాజరవుతాయన్న నమ్మకం నాకుంది’ అని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మంగళవారం విలేకరులకు తెలి పారు. తెలంగాణపై అభిప్రాయ సేకరణ జరిపి శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత చిదంబరం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 
మరో ఎంపి విహెచ్ ఎంపీల దీక్షలో పాల్గొనక పోయినా సంఘీభావం తెలియజేశారు. పది మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వారి బాటను అనుసరిస్తే పార్టీకి లేని పోని సమస్యలు రావడంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుందనే ఆందోళనతో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. పది మంది ఎంపీలు ఒక్క తాటిపై ఉండి తెలంగాణ విషయంలో ఇక వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పడం, విద్యార్ధులపై కేసుల ఎత్తివేత విషయంలో దీక్షకు దిగన సమయంలో , హైకమాండ్ పలు మార్లు సంప్రదించి, దీక్ష విరమించుకోవాలని విజ్ఞప్తి చేసినా వినిపించుకోకుండా అలాగే కొనసాగించారు.
తాను కూడా వారికి ఇటీవలి కాలంలో నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ మాటవినడం లేదన్నారు. దానికితోడు.. వెంకట స్వామి, కేశవరావు, హన్మంతరావు, మధుయాష్కీ, సర్యే సత్యనారా యణ, వివేక్ వంటి నాయకులంతా సీనియర్లయినందున తన స్థాయి కూడా సరిపోవడం లేదని, వారికి తాను చెప్పినా వినే పరిస్థితి లేదని కిరణ్ తన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఆయన ప్రధానంగా కేశవరావు మీదే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేకేనే దీనిని తెర వెనుక ఉండి నడిపిస్తున్నారంటూ ప్రభుత్వానికి అందిన నివేదికలను కిరణ్ తన వాదనలకు మద్దతుగా పంపించారు. అయితే నిజానికి.. రాష్ట్రంలో నెలకొన్న తెలంగాణ వేర్పాటువాద ఉద్యమం, జగన్ తిరుగు బాటు వ్యవహారాన్ని తాను సమర్థవంతంగా అణచివేస్తానన్న భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న కిరణ్, తీరా అధిష్ఠానానికి తానిచ్చిన హామీలలోనే వైఫల్యం చెందడ ం ప్రస్తావనార్హం. 
