Friday, December 31, 2010

శ్రీకృష్ణ కమిటీ నివేదిక

6 దాకా ఆగాలి
తెలంగాణ, సమక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఏర్పడిన శ్రీకృష్ణ కమిటీ గురువారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి చిదరంబరానికి తన నివేదికను సమర్పిం చింది. నిర్దేశించిన గడువుకు ఒకరోజు ముందే భారీ నివేదికను అందించింది. రెండు సంపుటాలుగా ఉన్న ఈ నివేదికలో తొలి భాగంలోనే కీలకాంశాలు చేర్చినట్లు శ్రీకృష్ణ తెలిపారు. జనవరి 6న రాష్ట్రానికి చెందిన 8 పార్టీలకు నివేదికను అందించి ఆయా పార్టీలతో చర్చించిన అనంతరమే నివేదికను మీడియాకు వెల్లడిస్తామని చిదంబరం ఒక ప్రకటనలో తెలిపారు.

SKC-Report 
రాష్ట్రంలో 2009 డిసెంబర్‌ 9 అనంతరం జరిగిన పరిణామాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటి గురువారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరంతో ఆయన కార్యాలయం నార్త్‌ బ్లాక్‌లో భేటీ అయి నివేదిక సమర్పించింది. నివేదిక సమర్పించేందుకు ముందు కమిటీ తమ కార్యాలయం విజ్ఞాన్‌ భవన్‌లో సుమారు రెండు గంటలపాటు సమావేశమయింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలు దేరి నార్త్‌ బ్లాక్‌ చేరుకుని సుమారు 2.30 నిమిషాల ప్రాంతంలో హోంశాఖ మంత్రి చిదం బరంకు నివేదిక సమర్పించింది.కూలంకుశంగా రాష్ట్రంలోని అన్నిశ్రేణుల ప్రజల, రాజకీయ పార్టీల, పారిశ్రామికవేత్తల నుంచి సేకరించిన సమాచారాన్ని, సూచనలను పొందు పరుస్తూ కమిటీ రెండు సంపుటాలుగా విభజించి నిర్ధేసించుకున్న గడువులోగానే నివేదిక సమర్పించింది.

krishaa 
నివేదిక సమర్పించిన పిదప జస్టిస్‌ శ్రీకృష్ణ హోంమంత్రి కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల, మేథావుల, రాజకీయ పార్టీల నుంచి సేక రించిన వినతి పత్రాలను, అభిప్రాయాలను క్రోడీక రించామని, అందుబాటులో ఉన్నమేరకు సేకరించిన సమాచారాన్ని విపులంగా ప్రభుత్వానికి సమర్పించా మన్నారు. నివేదికలోని మొదటి సంపుటిలో నీటి పారుదల, హైదరాబాదు అంశం, ఉపాది, ఉద్యోగం, వనరుల పంపిణీలపై సూచనలను పొందుపరిచి నట్లు అన్నారు. రెండవ అనుబంధ సంపుటిలో సమాచార సేకరణకు వినియోగించిన గ్రంథాలు, దత్తాంశం తదితర వివరాలను నిక్షిప్తం చేసినట్లు జస్టిస్‌ శ్రీకృష్ణ పేర్కొన్నారు. నివేదిక సమర్పిం చేందుకు ఆ కమిటి ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ, సభ్య కార్యదర్శి దుగ్గల్‌, సభ్యులు రవీందర్‌కౌర్‌, అబుసలీ షరీఫ్‌ హాజరయ్యారు.

రాజకీయ పార్టీలకు హోంశాఖ ఆహ్వానం

శ్రీకృష్ణ కమిటి సమర్పించిన నివేదికపై అభిప్రా య సేకరణకు రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన రాజ కీయ పార్టీలను 2011 జనవరి 6 ఢిల్లీకి ఆహ్వాని స్తున్నట్లు హోంశాఖ మంత్రి చిదంబరం పేర్కొ న్నారు. నివేదిక స్వీకరించిన అనంతరం హోంశాఖ పత్రికలకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2010 ప్రశాంత వాతా వరణంలో గడిచిందని రాష్ట్రంలోని ప్రజలు ఎంతో సంయమనం పాటించారని హోంశాఖ ప్రజలకు కితాబిచ్చింది. ఇప్పటికే అన్నిరాజకీయ పార్టీలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే ఎలాంటి భాషణలు చేయమని హామీ ఇచ్చాయని, నాయకులందరూ ఇచ్చిన హామీ నిలుపుకుంటారని ఆశిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో మొహరించిన పోలీ సు అదనపు బలగాలు కేవలం ముందుజాగ్రత్త చర్య గా అభివర్ణించింది. దీనిపై ప్రజలు ఆందోళన చెందే అవసరం లేదని స్పష్టం చేసింది. ఇకపై కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు తమ మద్దతును ప్రభు త్వానికి అందించాలని విజ్ఞప్తి చేసింది. రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం నివేదికపై ప్రభు త్వం ఓ నిర్ణయానికొస్తుందని హోంశాఖ వెల్లడిం చింది. జనవరి 6 సాయంత్రం శ్రీకృష్ణ కమిటి నివేది కను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఇంటర్‌నెట్‌ ద్వారా ప్రజ లకు అందుబాటులో వుంటుందని ప్రకటించారు.

రాజకీయ పార్టీల పెదవివిరుపు....
శ్రీకృష్ణ కమిటీ గురువారం నివేదిక సమర్పించిన అనంతరం హోంశాఖ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో జనవరి 6 న సమావేశమై పార్టీ ప్రతినిధుల అభిప్రాయ సేకరణ చేస్తామని ప్రకటిం చింది. హడావుడిగా రెండు సంపుటాలకు సంబం ధించిన నివేదికలోని ముఖ్యాంశాలను రాజకీయ పార్టీల ముందుంచి వారి నుంచి అభిప్రాయ సేకరణ చేయడం ఏమాత్రం సమంజసంగా వుంటుందని కొందరు రాజకీయ నాయకులు పెదవి విరుస్తు న్నారు. నివేదికలోని కీలకాంశాలు మాత్రమే తమ దృష్టికి తీసుకుని వచ్చి అభిప్రాయ సేకరణ జరిపితే ఒనగూరే ప్రయోజనమేమిటని తమ అసంతృప్తిని వెల్లడించే అవకాశాలు వున్నాయి.

ఈ సమావేశం సుమారు నాలుగు గంటల వ్యవధి వుండే అవకాశం వున్నట్లు ఇప్పటికే రాజకీయ పార్టీలకు పంపిన ఆహ్వానంలో హోంశాఖ వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని రాజకీయ పార్టీలు ఈ సమావేశం కేవలం నామమాత్రంగా వుండబోతోందని, నివేదిక ప్రతులను తమకు అందించకుండా కేవలం క్లుప్తంగా వివరించి అభిప్రాయ సేకరణ చేయడంలో హోంశాఖ ఆంతర్యం ఏమిటని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.నీసం నాలుగురోజులు ముందయినా నివేదిక ప్రతులను రాజకీయ పార్టీలకు అందించి అభి ప్రాయ సేకరణ కోరడం తమకు అనుకూలంగా వుంటుందని రాజకీయ పార్టీలనుంచి అభిప్రా యాలు వినవస్తున్నాయి.