Tuesday, December 28, 2010

దీక్ష ఆగదు ! రాజకీయ కాంగిరేస్! * హస్తాగ్రహం * కేసుల ఎత్తివేతకు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల సత్యాగ్రహ దీక్ష

sabitareddy

హస్తాగ్రహం
కేసుల ఎత్తివేతకు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల సత్యాగ్రహ దీక్ష
మరో 135 కేసులు రద్దు చేసిన సర్కార్ 

రాజకీయ కాంగిరేస్!
టీఆర్ఎస్‌ను వెనక్కి నెట్టడం..
టీడీపీని ఇరుకున పెట్టడం..

జగన్ నుంచి దృష్టి మళ్లించడం!
అనేక లక్ష్యాలతోనే ఎంపీల దీక్ష?
లాభ నష్టాలపై భిన్నాభిప్రాయాలు
అధికార పార్టీ నేతలే రోడ్ల మీదికి వచ్చారు. సొంత పార్టీ ప్రభుత్వం మీదికే సమరానికి దిగారు. అధిష్ఠానాన్ని కూడా ధిక్కరిస్తామంటున్నారు. ఏమిటిది? ఇది దేనికి సంకేతం?

కేసుల ఎత్తివేతపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు చేపట్టిన దీక్షపై పలు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంటూ .. డిమాండ్ల సాధనకు దీక్షకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ దీక్ష ద్వారా అనేక ఫలితాలు సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో పార్టీకి నష్టం జరుగుతుందని కొందరు వాదిస్తుండగా... మరికొందరు దీనిని తోసిపుచ్చుతున్నారు.

తెలంగాణ ప్రాంతంలో కొంత స్తబ్దతతో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ దీక్ష కదలిక తెచ్చిందని... ఇక్కడ టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలను కట్టడి చేయడంతో పాటు.. తమ మాటకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాధాన్యం ఇచ్చేందుకు ఉపయోగపడుతోందని అంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న టీఆర్ఎస్‌ను వెనక్కి నెట్టేందుకు, రైతు సమస్యల అజెండాతో ముందుకు దూసుకెళ్తున్న టీడీపీని పట్టి లాగేందుకు వ్యూహాత్మకంగానే పోరుబాట పట్టినట్లు పార్టీలోని ఒక కీలక నేత ఒకరు చెప్పారు.

"ఇటీవల తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంది. ఎక్కడా ఇబ్బంది లేకుండా, రైతుల అజెండాతో వెళ్తోంది. కాంగ్రెస్ ఎంపీల దీక్షతో ఆ పార్టీకీ సెగ తగులుతుంది. మరోవైపు... మొన్నటిదాకా టీడీపీని మాత్రమే విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్‌పైనా ధ్వజమెత్తుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వస్తున్న నేపథ్యంలో... ఇప్పటికిప్పుడు తెలంగాణలో గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి మారాలంటే పోరాడక తప్పదు'' అని విశ్లేషిస్తున్నారు. అలాగే... ఒకపక్క టీఆర్ఎస్, మరో పక్క జగన్ అంశాలతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం, అయోమయం నెలకొన్నాయి.


ఈ రెండు అంశాలను అధిగమించి కార్యకర్తల్లో ఆత్మ స్థైర్యం పెంచాలంటే ఇలాంటి దూకుడుతో కూడిన పోరాటం అవసరమని కొందరు ఎంపీలు ఈ నిరాహారదీక్షను సమర్థిస్తున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో కొందరు నేతలు జగన్‌వైపు అడుగులు వేయడాన్ని గుర్తు చేస్తున్నారు. "తెలంగాణవాదం ఇంత బలంగా ఉన్నప్పటికీ షాద్‌నగర్‌లో ద్వితీయ శ్రేణి నేతలు జగన్ వైపు చూడటాన్ని తేలిగ్గా తీసుకోలేం. అధికార పార్టీలో ఉంటూ దీక్షలు చేయడంతో ప్రజల దృష్టి ఇటుగా మళ్లింది'' అని చెబుతున్నారు.

తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ దీక్షలు చేపడుతున్నాయని... వారిలో ఆత్మ స్థైర్యం పెరిగిందనేందుకు ఇదే నిదర్శనమని చెబుతున్నారు. కేసుల ఎత్తివేతపై అంతగా స్పందించని ప్రభుత్వం... ఎంపీలు దీక్ష చేపట్టిన మొదటి రోజే 135 కేసులను ఎత్తివేసిందని నేతలు గుర్తు చేస్తున్నారు. మున్ముందు మొత్తం కేసుల ఎత్తివేతకు అంగీకరిస్తే... ఆ క్రెడిట్ తమ ఖాతాలో పడుతుందని చెబుతున్నారు.

భవిష్యత్తులో కష్టమే

పార్టీ అజెండాకు, ఆదేశాలకు కట్టుబడాల్సిన ప్రజా ప్రతినిధులు అందుకు భిన్నంగా వ్యవహరించడంవల్ల భవిష్యత్తులో నష్టం తప్పదనే వారూ ఉన్నారు. పదే పదే రాజీనామాలు చేస్తామనడం, అవసరమైతే పార్టీనీ వీడతామనడం తగదంటున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు 0.01 శాతం వ్యతిరేకంగా ఉన్నా రాజీనామాలు చేస్తామని సర్వే సత్యనారాయణ వంటి నేతలు పదే పదే చెప్పడం వల్ల సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు.

అదే విధంగా రోశయ్య తర్వాత సీఎంగా జైపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పగించి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదంటూ సర్వే పేర్కొనడం పార్టీలో చర్చనీయాంశమైంది. నిజానికి... 25వ తేదీలోపు కేసులు ఎత్తివేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఈనెల 20నే ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.

సీడబ్ల్యుసీ సభ్యుని స్థాయిలో... కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, మమతా బెనర్జీలు ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న కేశవరావుకు ఏ క్షణంలోనైనా అధిష్ఠానంతో మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆయన చెబితే ప్రణబ్ ముఖర్జీ స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి కేసులు ఎత్తివేయించలేరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు సోనియాగాంధీ, చిదంబరంలతో చర్చించినందున అక్కడి నుంచే ఒత్తిడి తెచ్చి ఉంటే బాగుండేదని కూడా అంటున్నారు.
click here
రోజంతా హైడ్రామా.. రాయబారాలు
మంత్రులతో సీఎం కిరణ్ సమీక్ష
దశలవారీగా ఎత్తివేతకు ప్రతిపాదన
జానా, సబిత, దుద్దిళ్ల రాయబారం
అన్నీ ఎత్తేయాల్సిందేనని ఎంపీల డిమాండ్
మంగళవారం నాడు కోర్టులు, విద్యాసంస్థల బంద్: దామోదర్
రంగంలోని డీఎస్.. అధిష్ఠానంతో చర్చలు
మంగళవారం కీలక ప్రకటన.. అన్ని కేసులపై సమీక్ష!
 'డిసెంబర్ 31'.. డెడ్‌లైన్ సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ కాక అధికార కాంగ్రెస్‌కూ తగిలింది. సాక్షాత్తూ కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎంపీలే నేరుగా రంగంలోకి దిగారు. సొంత సర్కారుపైనే యుద్ధం ప్రకటించారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులన్నిటినీ ఎత్తివేయాలంటూ సత్యాగ్రహ దీక్షకు దిగారు. ముందుగా విజ్ఞప్తి చేశామని.. ఈనెల 26 వరకు గడువు ఇచ్చి కేసులను ఎత్తివేయాలని కోరామని.. అయినా, సర్కారు స్పందించకపోవడంతో దీక్షకు దిగక తప్పలేదని స్పష్టం చేశారు. దీంతో, అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ సమీక్షించారు.

ఆ తర్వాత, 135 కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 900 మందికి విముక్తి కలగనున్నట్లు వివరించింది. మిగిలిన కేసులను కూడా దశలవారీగా ఎత్తివేస్తామని ప్రభుత్వం తరఫున మంత్రి జానారెడ్డి ప్రకటించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులతో కలిసి ఆయన ఎంపీలతో చర్చలు జరిపారు. ఇప్పటికే 2341 మందిపై ఉన్న 565 కేసులను ఎత్తేశామని, 900 మందిపై ఉన్న 135 కేసులు ఎత్తివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నామని ..మరిన్ని కేసులను తొలగిస్తూ దశలవారీగా ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

అయితే.. మంత్రుల రాయబారం విఫలమైంది. వారి హామీని ఎంపీలు తిరస్కరించారు. విద్యార్థులపై పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేసే వరకూ దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు. కేసులన్నిటినీ ఎత్తివేస్తున్నట్లు రేపే వస్తారో.. ఐదు రోజుల తర్వాత వస్తారో.. తెలంగాణ వచ్చాకే వస్తారో.. అప్పటి వరకూ దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేసులన్నిటినీ ఎత్తివేస్తామని కేంద్ర హోం మంత్రి చిదంబరం హామీ ఇచ్చి ఏడాదైనా కేసులు ఎందుకు ఎత్తివేయలేదంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఎంపీల దీక్షకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యార్థి, న్యాయవాద, వైద్య, ఉద్యోగ వర్గాలతోపాటు పలు ప్రజా సంఘాల నేతలు సంఘీభావం ప్రకటించారు. వారికి మద్దతుగా మంగళవారం నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా దీక్ష చేసేందుకు సన్నద్ధమయ్యారు. అదే సమయంలో, మంగళవారం న్యాయస్థానాలు, విద్యా సంస్థలను బహిష్కరించాలని మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఎట్టకేలకు, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ సోమవారం రాత్రి రంగంలోకి దిగారు. అటు అధిష్ఠానంతోనూ ఇటు ముఖ్యమంత్రి, ఎంపీలతోనూ చర్చలు జరిపారు. తక్షణమే ఒక నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత పెరిగే అవకాశం ఉందని, ప్రజా ప్రతినిధులకూ పరపతి పెరుగుతుందని ఆయన సీఎంకు వివరించారు.

డీఎస్ సూచన పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి... కేసుల ఎత్తివేతపై మంగళవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే, అన్ని కేసులనూ ఎత్తివేయడం కుదరదని, న్యాయపరమైన అంశాలెన్నో మిళితమై ఉన్నాయని సీఎం కార్యాలయ వర్గాలు పునరుద్ఘాటించాయి. అన్ని కేసులనూ మంగళవారం సమీక్షించి.. దశలవారీగా ఎత్తివేతకు నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించాయి.

దీక్షకు దిగిందిలా...

తెలంగాణ ప్రాంత ఎంపీలు సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోని కాంగ్రెస్ శాసన సభాపక్ష కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత, లిబర్టీ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి, నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహానికి, బాబూ జగజ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తర్వాత గన్‌పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద ప్రతిజ్ఞ చేసి కాంగ్రెస్ ఎంపీలు కె.కేశవరావు, పొన్నం ప్రభాకర్, రాజయ్య, బలరాం నాయక్, మందా జగన్నాథం, సర్వే సత్యనారాయణ, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జి.వివేక్ సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు.

మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్యలు ఇక్కడ ఎంపీలను కలిశారు. గంటపాటు మాత్రమే అక్కడ ఉండేందుకు ఎంపీలకు అనుమతి ఉంది. దీంతో, ఇదే విషయాన్ని పలుమార్లు పోలీసులు ఎంపీలకు స్పష్టం చేశారు. చివరికి, మధ్యాహ్నం 2.15 గంటలకు ఎంపీలంతా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పాదయాత్రగా వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదిక వద్ద దీక్ష కొనసాగించారు. దీక్షలో పాల్గొనేందుకు అమెరికా నుంచి బయలుదేరిన ఎంపీ మధుయాష్కీ గౌడ్ విమానం మంచు కారణంగా రద్దవడంతో ఆయన న్యూజెర్సీ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.

సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు దీక్షకు దూరంగా ఉన్నారు. ఎంపీ సురేశ్ షేట్కర్ గన్‌పార్కు వద్దకు వచ్చినా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రాలేదు. దీక్ష చేపట్టిన ఎంపీలకు ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్, ఆరేపల్లి మోహన్, ప్రవీణ్‌రెడ్డి, రాజయ్య, ప్రసాద్‌కుమార్, ఆర్.దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఇంద్రసేన్‌రెడ్డి, కేఆర్ ఆమోస్, మోహన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రాజలింగం తదితరులు సంఘీభావం ప్రకటించారు.

కాంగ్రెస్ సీనియర్ నేతలు కమలాకర్‌రావు, వినోద్, షబ్బీర్ అలీతోపాటు న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, విద్యార్థి తదితర సంఘాల నేతలు అభినందనలు తెలిపారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌లు ఎంపీలకు సంఘీభావం చెప్పారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో విద్యార్థులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులను నేరంగా చూడకుండా ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని తాము మొదటి నుంచీ కోరుతున్నామని, సీమాంధ్రకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందునే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.

అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు నిరాహార దీక్షకు దిగారంటేనే పరిస్థితి అర్థమవుతోందని, కేసులన్నిటినీ ఎత్తివేయాల్సిందేనని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేద్దామని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేసులన్నింటినీ ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఫలితం లేనందునే గాంధేయ మార్గంలో సత్యాగ్రహ దీక్షకు దిగామని ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఎంపీ రాజయ్య డిమాండ్ చేశారు.

ఈ అంశంపై ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వంపై యుద్ధం తప్పదని సర్వే సత్యనారాయణ హెచ్చరించారు. "ఇక్కడ షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఎండ వేడిమికి తాళ లేకుండా ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వానికి మాపై దయ రాలేదా? ఎండలోనే చంపేయాలని చూస్తోందా? పోనీ.. తెలంగాణ కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం ప్రాణాలు వదిలేస్తాం'' అని సర్వే వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంతో కేసులను ఎత్తివేయించాలంటూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ డిమాండ్ చేశారు. ఇందుకు దీక్ష చేస్తే చాలదని, పదవులకు రాజీనామా చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పెడితే ఎంపీల మద్దతు అవసరమని విస్మరిస్తే ఎలా? అని నిలదీశారు.

తాము ఎంపీ పదవుల కోసం పాకులాడడం లేదని.. తెలంగాణ కోసమే ఈ పదవుల్లో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. కాగా.. అమర వీరుల స్థూపం వద్ద దీక్ష చేస్తున్న ఎంపీలకు సీడబ్ల్యూసీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి (కాకా), ఎమ్మెల్సీలు పాలడుగు వెంకటరావు, చుక్కా రామయ్య సంఘీభావం ప్రకటించారు. కేసులు ఎత్తి వేయాలంటూ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలే దీక్ష చేయడాన్ని చుక్కా రామయ్య అభినందించారు.

తెలంగాణ మంత్రులతో సీఎం సమీక్ష

తెలంగాణ ఎంపీల దీక్ష నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జానారెడ్డి, బస్వరాజు సారయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, శంకర్‌రావులతో సమీక్ష నిర్వహించారు. కేసుల ఎత్తివేతకు తాను ఏమాత్రం వ్యతిరేకం కాదని, అయితే, అన్ని కేసులనూ ఎత్తివేస్తే న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగులుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

ఎంపీలు దీక్షకు దిగినందున మరిన్ని కేసుల ఎత్తివేతపై నిర్ణయం తీసుకోవాలని మంత్రులు సూచించారు. అందుకు అనువైన కేసులు ఉంటే పరిశీలించాలని జానారెడ్డి, సబితలకు సీఎం సూచించారు. దీంతో, కేసులను సమీక్షించిన తర్వాత 900 మందిపై ఉన్న 135 కేసులను ఎత్తి వేయవచ్చని వారు వివరించారు. మిగిలిన కేసులను అంచెలంచెలుగా ఎత్తివేద్దామని సూచించారు.

ఇందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇదే విషయాన్ని విలేకరులకు... తర్వాత న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్షలో ఉన్న ఎంపీలకు మంత్రులు వివరించారు. దశలవారీగా కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నందున దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఎంపీలు దీనికి సమ్మతించలేదు. కేసులన్నీ ఎత్తేసే వరకూ దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
click here
విద్యార్థులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలన్న డిమాండ్‌తో దీక్షలు చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు.. తమ ఆందోళన అధిష్ఠానంపై తిరుగుబాటు సంకేతాలుగా పరిణ మించే ప్రమాదం ఉందని పసిగట్టి ఆ మేరకు నష్టనివారణ కోసం సోమవారం రాత్రి పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాము ఏ పరిస్థితిలో దీక్ష ప్రారంభించామో సోనియాకు తమ లేఖలో వివరించారు. తమను అపార్ధం చేసుకోవద్దని, ఇదంతా పార్టీ పటిష్టత కోసమే చేస్తున్నందున, తమ దీక్షను అర్థం చేసుకోవాలని తమ లేఖలో అభ్యర్ధించారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష ప్రారంభించడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల్లో తిరుగుబాటు మొదలయిందని, వారంతా రాజీనామాలకు సైతం సిద్ధపడుతున్నారన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడం చర్చనీయాంశమయింది.

దానికితోడు కొందరు సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ ఎంపీల దీక్ష వల్ల పార్టీకి నష్టంవస్తోందంటూ అధిష్ఠానానికి ఫిర్యాదులు పంపారు. ఈ విషయం తెలిసిన తెలంగాణ ఎంపీలు పరిస్థితి చేయిదాట కుండా, అధిష్ఠానం ఆగ్రహానికి గురికాకుండా యుద్ధప్రాతి పదికన చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే తమ అధినేత్రికి లేఖ రాశారు. తమ దీక్ష వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌ బలపడుతుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ మహాసభల ద్వారా తెలం గాణలో బలపడుతున్నందున, దాన్ని అడ్డుకోవాలంటే తాము కూడా తెలంగాణ సమ స్యలపై దీక్ష చేయక తప్పడం లేదని వివరణ ఇచ్చారు. దీన్ని అపార్ధం చేసుకో వద్దని, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్‌ రాజ కీయంగా ఎదుగు తోందని, అది చివరకు కాంగ్రెస్‌ పార్టీకే ప్రమాదంగా మారే పరిస్థితి ఉంది కాబట్టే తాము దీక్షకు దిగామని వివరణ ఇచ్చారు.

దానితో పాటు కేసుల ఎత్తి వేతపై తాము గతంలోనే సీఎంని కలసి అభ్యర్థించామని, ఆయన స్పందన పేల వంగా, నిర్లక్ష్యంగా ఉందని ఫిర్యాదు చేశారు. అదే సమ యంలో డిసెంబర్‌ 31 నేపథ్యంలో విద్యార్ధులపై కేసులను అడ్డుపెట్టుకుని, టీఆర్‌ఎస్‌ కొత్త ఉద్యమాన్ని లేవనెత్తే అవకాశం ఉన్నందున ఆ అంశాన్ని ముందుగా తామే చేపట్టామని వివరించారు. తెలంగాణలో పార్టీ పరిరక్షణే తప్ప, తమ దీక్షలో ఎలాంటి స్వార్థం లేదని ఎంపీలు సోనియాకి రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు తెలిసింది.
కేసుల ఎత్తివేతకై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల దీక్ష మంత్రుల రాయబారం
diksha 
కాంగ్రెస్‌ తెలంగాణ ఎంపీలు సొంత సర్కార్‌తోనే యుద్ధానికి దిగారు. కిరణ్‌ కుమార్‌ సర్కార్‌తో ఢీ అన్నారు. హెచ్చరించిన విధంగానే ఆందోళన కు దిగారు. గత ఏడాది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్ధులపై బనాయించిన కేసులను ఎత్తివేయాలంటూ సోమవారం నుంచి నిరువధిక నిరాహార దీక్షకు దిగారు. డిసెంబర్‌ 25 లోగా కేసుల ఎత్తివేతపై నిర్ణయం ప్రకటించక పోతే 26 నుంచి ఆందోళనకు దిగుతామంటూ ఈ నెల 20న ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విధించిన గడువు దాటడం, ప్రభుత్వం ఎంపీల డిమాండ్‌ను తేలికగ తీసుకోవడంతో కాంగ్రెస్‌ తెలంగాణ ఎంపీలు గాంధేయ మార్గంలో, విద్యార్ధులకు న్యాయం చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 10 మంది ఎంపీలు సోమవారం దీక్ష ప్రారంభించారు.

వీరి దీక్షకు పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, సుమారు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు, పలువురు పీసీసీ ఆఫీస్‌బేరర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎఐసీసీ, పీసీసీ సభ్యులు, మాజీలు సంఘీభావం తెలియజేసి కాసేపు ఎంపీలతో పాటు దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జి.వెంకటస్వామి, విహెచ్‌, ఎమ్మెస్సార్‌, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ప్రజా కవి గద్దర్‌, విమలక్క, తెలంగాణ పొలిటకల్‌ జెఎసి కన్వీనర్‌ ప్రోఫెసర్‌ కోదండరాం , పలువురు తెలంగాణ న్యాయవాదు లు దీక్షా శిబిరాన్ని సందర్శించి తెలంగాణ ఎంపీలకు సంఘీభావం తెలియజేశారు.

nirasana 

ఆదివారం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశంలో విద్యార్ధులపై కేసులు ఎత్తివేయక పోతే సోమవారం దీక్షకు దిగుతామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలా జరగక పోవడంతో సోమవారం తెలంగాణ నేతలు దీక్షకు ఉపక్రమించారు. ఎంపీలు డాక్టర్‌ కె.కేశవరావు, సర్వే సత్యనారాయణ, జి.వివేక్‌, సిరిసిల్ల రాజయ్య, కొమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సురేష్‌ షేట్కర్‌, బలరాం నాయక్‌ దీక్ష చేపట్టారు. తొలుత వీరు ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోని సిఎల్పీ కార్యాలయానికి చేరుకున్నారు.

అక్కడి నుంచి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌ వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం, బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి గన్‌పార్క్‌కు చేరుకుని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ఉదయం 11 గంటల ప్రాంత నుంచి దీక్ష ప్రారంభించారు. గన్‌పార్క్‌ వద్ద దీక్ష చేపట్టేందుకు అనుమతి లేదంటూ డిసిపీలు అకున్‌స బర్వాల్‌, కమలహాస్‌రెడ్డి చెప్పిన ఎంపీలు వినలేదు. కాసేపు కూర్చొని పోతామని చెప్పి అక్కడ దీక్ష ప్రారంభించారు. మళ్ళీ పోలీసులు జోక్యం చేసుకోవడంతో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో దీక్షాశిబిరం వేదికను గన్‌పార్క్‌ నుంచి న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌కు మార్చారు. పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, దీక్షా శిబిరానికి వచ్చి ఎంపీలకు మద్దతు ప్రకటించి వెళ్ళారు.

downdown 

ఎమ్మెల్యేలు దామోదర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, భిక్షమయ్యగౌడ్‌, శ్రీధర్‌, ఆరేపల్లి మోహన్‌, సోమారం సత్యనారాయణ, సి.లింగయ్య, కిచ్చన్నగారి లకా్ష్మరెడ్డి, పి.ప్రవీణ్‌రెడ్డి, రాజిరెడ్డి, పి.కిష్టారెడ్డి, ప్రసాద్‌కుమార్‌, సి.ప్రతాప్‌రెడ్డి, బాలు నాయక్‌, ఎమ్మెల్సీలు కె.ఆర్‌.ఆమోస్‌, భాను ప్రసాద్‌, ఇంద్రసేన్‌రెడ్డి, ఎస్‌.జగదీశ్వర్‌రెడ్డి, రాజలిం గం, బి.మోహన్‌రెడ్డి, బి.భూపాల్‌రెడ్డి, పీసీసీ నేతలు నర్సా రెడ్డి, షబ్బీర్‌ అలీ, ఫారుఖ్‌ హుస్సేన్‌, మహ్మద్‌ సిరాజుద్దీన్‌, గూడురు నారాయణరెడ్డి, జి.రత్నాకర్‌రెడ్డి, తదితరులు ఎంపీల దీక్షా శిబిరాన్ని సందర్శించి పూర్తి మద్దత ప్రకటిం చడమే కాకుండా కొంత సేపు అక్కడే వారితో గడిపారు.

మంత్రుల రాయబారం విఫలం
ఎంపీలతో తెలంగాణ మంత్రులు రెండు మార్లు జరిపిన రాయబారం విఫలమైంది. తొలుత ఉదయం దీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే గన్‌పార్క్‌ వద్ద మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్య వచ్చి దీక్ష చేపడుతున్న ఎంపీలకు సంఘీభావం తెలియజేశారు. కేసులు ఎత్తివేసే వరకు దీక్ష విషయంలో ఉపసంహరణ ఉండదని తేల్చి చెప్పడంతో మంత్రులు వెనుతిరిగారు. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీక్ష శిబిరంలో ఉన్న సీనియర్‌నేత కేశవరావుకు ఫోన్‌ చేసి ప్రస్తుతం 135 కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నామని, మిగతా కేసులను కూడా త్వరలో దశలవారిగా ఎత్తివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

విద్యార్ధులపై మొత్తం కేసులు ఎత్తివేసే వరకు దీక్ష విరమించమని సబితకు కేకే తేల్చి చెప్పారు. దీంతో మంత్రులు సిఎం వద్ద డిజిపితో మరో సారి సమావేశమై కేసుల విషయంలో మళ్ళీ చర్చించినట్లు తెలిసింది. ఆ తరువాత రాత్రి ఏడుబావు సమయంలో మంత్రులు రెండవ దఫ రాయబారం నడిపారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కె.జానారెడ్డి, శ్రీధర్‌బాబు, బస్వరాజు సారయ్య ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకుని ఎంపీలను దీక్ష విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసుల ఎత్తివేత విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారికి తెలియజేశారు.

మంత్రులు కేకేతో మాట్లాడుతున్నప్పుడు మంత్రులు సబితా, జానా, కేకే, ఎంపి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డిల మద్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. మంత్రులు ఎంపీలతో మాట్లాడుతున్నప్పుడు దీక్షా శిబిరం పార్టీ కార్యకర్తలు, తెలంగాణ మద్దతు దారులతో హోరెత్తింది. జై తెలంగాణ, సోనియా నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ అమరవీరులకు జోహార్లు, తెలంగాణ ఎంపీల ఐక్యత వర్ధిల్లాలి అని పెద్దపెట్టున నినాదాలివ్వడంతో కాసేపు శిబిరంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

శిబిరంలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతుండగా ఏడాది కాలంగా కేసుల విషయం తేల్చకుండా ఏంచేస్తున్నారు? అంటూ ఎంపి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి గట్టిగా నిలదీ శారు. దీంతో ఆమె తన ప్రసంగాన్ని నిలిపివేశారు. కేసులు పూర్తిగా ఎత్తివేసే వరకు తమ దీక్ష ఆగదని కేకే, సర్వేలతో పాటు వివేక్‌, రాజయ్య, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, మందా జగన్నాధం, గుత్తా సుఖేందర్‌రెడ్డి తేల్చి చెప్పడంతో మళ్ళీ ఉదయం వస్తామంటూ మంత్రులు నిరాశతో వెనుతిరిగారు.

నేడు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ
ఎంపీలు చేస్తున్న దీక్ష పై భవిష్యత్తు కార్యచరణ రూపొందించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఎంపీలకు మద్దతుగా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు దీక్షలో పాల్గొనాలా? రాజీనామాలు, డిసెంబర్‌ 31 తరువాత అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చించనున్నట్లు తెలిసింది. మరో వైపు ఎంపీల దీక్షకు మద్దతుగా వరంగల్‌, గోదావరిఖనిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు దీక్షలు ప్రారంభించారు.