Wednesday, December 29, 2010

ఆంధ్రప్రదేశ్‌పై మేమిచ్చే నివేదికతో శాశ్వత పరిష్కారం

ఒక రోజు ముందే నివేదిక సమర్పణ! 

AP-Map

అత్యధికులకు అత్యధిక సంతోషం
నిర్ణయం ఇక కేంద్రం చేతుల్లోనే
శాంతి భద్రతలకు ప్రమాదం లేదు
నివేదిక అమలు ఎప్పుడు? ఎలా? అన్నది మాత్రం లక్ష వరహాల ప్రశ్న
ముందు జాగ్రత్త కోసమే బలగాలు
విలేకరుల సమావేశంలో శ్రీకృష్ణ
నివేదిక రెండు సంపుటాల్లో
మార్గాంతరాలు చెప్పాం: దుగ్గల్
"నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత దాన్ని అధికారికంగా బయటపెడుతుందా? అనధికారికంగా వెల్లడిస్తుందా? అన్నది చెప్పలేం. మీ ఊపిరి బిగబట్టుకోండి.. నాలుగైదు రోజులు ఆగండి.. ప్రభుత్వం మా నివేదికను అధ్యయనం చేసేందుకు సమయం ఇవ్వండి...'' - శ్రీకృష్ణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వనున్న తమ నివేదిక రాష్ట్ర విభజన సమస్యకు శాశ్వత పరిష్కారం సూచిస్తుందని భావిస్తున్నట్టు శ్రీకృష్ణ కమిటీ చైర్మన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ చెప్పారు. గడువు ప్రకారం తమ నివేదికను ఈ నెల 31లోపు కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని స్పష్టం చేశారు. నివేదికలో అన్ని అంశాల గురించి చర్చించామన్నారు. వాటిని వెల్లడించేందుకు ఆయన తిరస్కరించారు.

అయితే.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పరిశోధించి తయారు చేసిన నివేదిక ఇదని చెప్పారు. తమ సిఫారసులపై ఇక ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని చెప్పారు. కమిటీ సభ్యులతో కలిసి ఆయన మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ముంబై అల్లర్లపై తన నివేదికను అమలు చేయలేదన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ అది నిజమేనని, ఈ కమిటీ నివేదికను కూడా ప్రభుత్వం ఎప్పుడు, ఎలా అమలు చేస్తుందనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న చెప్పారు.

60 ఏళ్లుగా పరిష్కారంకాని సమస్యను మీ నివేదిక పరిష్కరిస్తుందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు.. దీర్ఘకాలికంగా పరిష్కారం కావల్సిన సమస్యలు కొంత కాలంలోనే పరిష్కారమైన దాఖలాలున్నాయని ఆయన సోదాహరణంగా చెప్పారు. 25 సంవత్సరాలుగా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్న దంపతులకు 9 నెలల్లో పిల్లలు కలిగిన సందర్భాలు తనకు తెలుసునని ఆయన అన్నారు. తమ నివేదిక అత్యధికమంది ప్రజలకు అత్యధిక సంతోషాన్ని కలిగిస్తుందని జస్టిస్ శ్రీకృష్ణ చెప్పారు.

తమ నివేదిక తర్వాత ఎలాంటి శాంతి భద్రతల సమస్యలూ తలెత్తవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ బలగాలు రాష్ట్రానికి తరలించడం సాధారణ భద్రతా ఏర్పాట్లలో భాగమని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకుంటారని, అది ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత దేశానికి వచ్చినప్పుడు, కామన్‌వెల్త్ క్రీడలు జరిగినప్పుడు ముందు జాగ్రత్త చర్యలుగా భద్రతా దళాలను నియమించారని, అయినప్పటికీ ఒక్క సంఘటన కూడా జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు.

భద్రతా దళాలను నియమించడం ద్వారా ప్రభుత్వం సమస్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవాలని అన్నారు. నివేదిక ఎలా ఉన్నా, శాంతిని కాపాడేందుకు అన్ని వర్గాలు సహకరించాలని ఆయన పదే పదే పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలన్నీ తమకు శాంతిని కొనసాగించేందుకు సహకరించాయని, వారు చెప్పేదాన్ని నమ్మాలని ఆయన అన్నారు. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు అంతా శాంతియుతంగా జరిగిందని, ఇక ముందు కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

డిసెంబర్ 31లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నివేదిక సమర్పిస్తామని, తానెన్నడూ తనకిచ్చిన గడువును దాటలేదని అన్నారు. అయితే.. 30న ఈ నివేదికను చిదంబరానికి అందజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 31న చిదంబరం ఒక కార్యక్రమం నిమిత్తం అరుణాచల్ ప్రదేశ్ వెళుతున్నారని సమాచారం. ఈ రీత్యా 30వ తేదీనే నివేదికను శ్రీకృష్ణ కమిటీ ఆయనకు సమర్పించే అవకాశం ఉందని హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా.. నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత దాన్ని అధికారికంగా బయటపెడుతుందా, అనధికారికంగా వెల్లడిస్తుందా చెప్పలేమని శ్రీకృష్ణ అన్నారు. నివేదిక సమర్పించడంతో తమ పని పూర్తవుతుందని తెలిపారు. కేంద్ర హోంమంత్రి చిదంబరం నక్సలైట్ సమస్యను సమీక్షించేందుకు గడ్చిరోలీలో ఉన్నారని, ఆయన వచ్చిన వెంటనే నివేదికను సమర్పిస్తామని చెప్పారు. నివేదికపై ఎందుకింత ఆసక్తి నెలకొన్నదో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. శిశువు జన్మించేముందు కూడా అది మగా, ఆడా తెలుసుకునే ఆసక్తి ఉంటుందని, కానీ లింగ నిర్థారణ పరీక్షలను నిషేధించినందువల్ల అలా ముందుగా తెలుసుకునే వీలు లేదని అన్నారు. అలాంటి నిషేధం నివేదికల విషయంలో కూడా ఉండాలని ఆయన అన్నారు. "మీ ఊపిరి బిగపట్టుకోండి.. నాలుగైదు రోజులు ఆగండి.. ప్రభుత్వం మా నివేదికను అధ్యయనం చేసేందుకు సమయం ఇవ్వండి..'' అని ఆయన అన్నారు. నివేదిక ఎన్ని పేజీలున్నదీ, ఎంత పెద్దదీ, చిన్నదీ అన్నది ప్రధానం కాదని, అందులో ఏం చెప్పారో ప్రధానమని అన్నారు.

మార్గాంతరాలూ.. పర్యవసానాలు.. : దుగ్గల్
తమ నివేదిక రెండు సంపుటాల్లో ఉంటుందని కమిటీ సభ్య కార్యదర్శి వీకే దుగ్గల్ చెప్పారు. తమకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సానుకూల ప్రతిస్పందన లభించిందని, అన్ని వర్గాలతో సవివరంగా మాట్లాడామని తెలిపారు. నివేదిక రూపకల్పనకు కొన్ని సంస్థల మద్దతు కూడా తీసుకున్నామన్నారు. తమ నివేదిక మొదటి సంపుటంలో సమస్యకు సంబంధించిన అన్ని అంశాలకు అధ్యాయాల వారీగా కేటాయించామని, పలు మార్గాంతరాలను, పర్యవసానాలను సూచించామని దుగ్గల్ వెల్లడించారు.

విధి విధానాల్లో ప్రస్తావించిన ప్రతి అంశాన్నీ వివరణాత్మకంగా పరిశీలించామని, ప్రస్తుత సమస్య (తెలంగాణ) వెలుగు నీడలన్నింటినీ విశ్లేషించామని ఆయన చెప్పారు. రెండవ సంపుటిలో అనుబంధాలు ఉన్నాయని చెప్పారు. ముద్రణలో ఉన్నందున ఎన్ని పేజీలు ఉంటాయో ఇప్పుడే చెప్పలేనని, తమ నివేదిక భారీగానే ఉంటుందని అన్నారు. మార్గదర్శకాల్లో మొదటి అంశం ప్రధానమైనదని, దానిపై పూర్తి దృష్టి కేంద్రీకరించామన్నారు.

బాగా పరిశోధన చేసిన, నిష్పాక్షికమైన, వృత్తి నైపుణ్యంతో కూడిన నివేదిక తమదని ప్రతి రాజకీయ నాయకుడూ అంగీకరిస్తారని ఆయన చెప్పుకున్నారు. శాంతి భద్రతలను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని, 1969, 1972, 2009లోనూ, ఇటీవలి కాలంలోనూ ప్రభుత్వం ఏ విధంగా శాంతిభద్రతలను కాపాడిందో అదే విధంగా చర్యలు తీసుకోవడం సహజమని దుగ్గల్ అన్నారు. పార్టీలు, నాయకులందరూ నివేదిక ఎలా ఉన్నా శాంతి భద్రతలు కాపాడతామని తమకు హామీ ఇచ్చారని , ప్రజలతో మాట్లాడి శాంతికి భగ్నం కాకుండా చూస్తామని చెప్పారని కమిటీ సభ్యురాలు రవీందర్ కౌర్ తెలిపారు.

అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే తామీ నివేదికను రూపొందించామని, తమ సిఫారసులను అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తారనే అభిప్రాయంతో ఉన్నామని కమిటీ సభ్యుడు అబూసలే షరీఫ్ చెప్పారు. తాము రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలూ తిరిగి ప్రజలను కలుసుకోవడంలో, సమస్యలను చర్చించడంలో ఎంతో ఆనందాన్ని పొందామని, నివేదిక రూపకల్పనలో జస్టిస్ శ్రీకృష్ణ నాయకత్వంలో పని చేయడం సంతోషంగా ఉన్నదని మరో సభ్యుడు రణబీర్ సింగ్ చెప్పారు.

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ..... * పగ్గాలకోసం పరుగులు .....

రేపు నివేదిక ?
AP-Mapగడువు ముగిసేందుకు ఒక రోజు ముందే ప్రత్యేక తెలంగాణ ఏర్పా టుపై అభిప్రాయ సేకరణ జరిపిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక సమర్పించనున్నది. ఈ నెల 31న కేంద్ర హోంమంత్రి చిదంబరం అరుణా చల్‌ ప్రదేశ్‌ పర్యటనకు వెళ్లబోతున్నారు కనుక, 30నే శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమ ర్పించబోతున్నట్టు తెలిసింది. కమిటీకి సారథ్యం వహిస్తున్న జస్టిస్‌ శ్రీకృష్ణ, సభ్య కార్యదర్శి దుగ్గల్‌, మరో సభ్యుడు చిదంబరాన్ని కలిసి నివేదిక సమర్పిస్తారు. కాగా, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు మంగళవారంనాడు ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగించారు

తొలుత కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ మాట్లా డుతూ, ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఇప్పటివరకు కమిటీ చేసిన పర్యటనలు, సమావేశాల వివ రాలు తెలియజేశారు. తెలంగాణ, సమైక్యాంధ్ర డిమాండ్‌లకు సంబంధించి పెద్ద మొత్తంలో వినతిపత్రాలు అందాయని తెలిపారు. వీటి ద్వారా తమకు అమూల్యమైన సూచనలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం అందిందని పేర్కొన్నారు.

srikrishana 

ఈ అధ్యయనంలో ఎన్నో సాంకేతికాంశాలు పరిగణలోకి తీసుకున్నామని,అందులో ముఖ్యంగా నీటి పారుదల, విద్యుత్‌, ఉపాధి, హైదరాబాదు అనే ముఖ్యమైన నాలుగు అంశాలపై నిపుణులతో గోష్ఠి నిర్వహించమన్నారు. కమిటీ నిర్వహించిన అధ్యయనాలలో ఎక్కువ భాగం హైదరాబాదులో చేశామన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వందకు పై చిలుకు రాజకీయ పార్టీలు, ఇతర మేధావులు, ప్రతినిధులతో చర్చలు నిర్వహించామని, రాష్ట్రంలోని 23 జిల్లాలలోని పలు గ్రామాలను సైతం సందర్శించి స్థానిక వర్గాలతో కూడా చర్చించి ప్రాథమిక స్థాయి సమాచారాన్ని సేకరించమన్నారు.

సహకరించిన అందరికీ కృతజ్ఞతలు....
తమ నివేదిక రెండు సంపుటాలుగా ఉండబోతుందని, ఈ నివేదిక మెజారిటీ ప్రజలను సంతృప్తి పరిచే విధంగా వుంటుందని, కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్‌ వెల్లడించారు. ఇరు ప్రాంతాలకు సంబంధించిన పలు విషయాలను కూలంకశంగా విశదీకరించామని, నిర్ణయించిన కాలపరిమితి లోగానే నివేదికను హోంశాఖ మంత్రి చిదంబరానికి అందజేస్తామని పేర్కొన్నారు. అయోధ్య తరహాలో ఈ నివేదిక పై కూడా అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు సంయమనం పాటించి శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వానికి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ తమ నివేదిక లోని ఏ ఒక్క అంశానికి సంబంధించిన ఏ విధమైన వివరాలను, వ్యక్తుల పేర్లను వెల్లడించలేమన్నారు.

సమస్య ఎంత పురాతనమైనదైనా పరిష్కారం ఉంటుందని తమ నివేదికలో పలు పరిష్కార మార్గాలను సూచించామని, అన్ని ముఖ్యమైన అంశాలను, అతి సున్నితమైన అంశాలను నివేదికలో పొందుపరిచామని వెల్లడించారు. సమస్యకు పూర్వ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అదనపు బలగాలను రాష్ట్రానికి తరలించారని రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతని ఓ ప్రశ్న కు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో కమిటి లోని ఇతర సభ్యులు ప్రొ. రబీందర్‌ కౌర్‌, రణబీర్‌ సింగ్‌, డా. అబ్ధుల్‌ షరీఫ్‌, ఇతర ఉన్నతాధికారుల పాల్గొన్నారు. 

పగ్గాలకోసం పరుగులు
Narasimhan-Governor 
రాష్ట్రంలో పరి స్థితిని అధ్యయనం చేసిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక సమర్పించిన మరుసటి రోజే గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటన జరపనున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. రాష్టప్రతి పాలన విధిస్తారన్న ఊహాగానాలు జోరందుకుంటున్న నేపథ్యంలో గవర్నర్‌ పర్యటనకు విపరీతమైన ప్రాధాన్యం లభిస్తున్నది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర హోం మంత్రి చిదం బరం, ఇతర కీలక మంత్రులను కలుసు కుంటారని తెలిసింది. కమిటీ నివేదిక వెలు వడిన మరుసటిరోజే గవర్నర్‌ హుటాహుటిన ఢిల్లీకి పరుగులు పెట్టటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గవ ర్నర్‌ అక్క డికి వెళ్ళి రాష్ట్రంలో నివేదిక అనంతర పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతారా లేక మరేదైనా నివేదిక ఇస్తారా అనే దానిపైవిస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.

విభజన వద్దంటారా?
విశ్వసనీయ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం గవర్నర్‌కు రాష్ట్రాన్ని విడగొట్టటం సుతరామూ ఇష్టం లేదు. అలా చేయటం ద్వారా ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రాంతాలలో శాంతి భద్రతలకు చేజేతులా విఘాతం కలి గించినట్టే అవుతుందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. అసలు ఒక దశలో డిసెం బర్‌ 31 తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఏమీ మారవన్న అభిప్రాయంతో ఉన్న ఆయన ఇప్పుడు నివేదిక వచ్చీ రాగానే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెడతారన్నది ప్రశ్నగా మిగులుతోంది. డిసెంబర్‌ 31 తర్వాత ఏమవుతుందని గత డిల్లీ పర్య టన సందర్భంగా అడిగితే జనవరి ఒకటి వస్తుంది అని తేలిగ్గా కొట్టి పారేశారు. ఇప్పుడేమో పరిస్థితిని మదింపు వేసుకున్న సూచనలు కనిపిస్తున్నాయి.

పగ్గాలు చేజిక్కించుకునేందుకే?...
శ్రీకృష్ణ నివేదిక స్వరూప స్వభావాల ఎలా ఉన్నా, దానిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే దాకా రాష్టప్రతి పాలన విధిస్తే సరిపోతుందని కేంద్రానికి నివే దిక సమర్పించి, వారి అంగీకారం మేరకు రాష్ట్రంలో పగ్గాలు చేజిక్కిం చుకునేందుకే గవర్నర్‌ ఢిల్లీ పర్యటన ఆంతర్యం అని రాజకీయ వర్గాలు అను మానాలు వ్యక్తం చేస్తున్నాయి. స్వతహాగా ఐపీఎస్‌ అధికారి అయిన తనకు పగ్గా లు అప్పగిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని, ఉద్యమించే శక్తులు ఏవైనా ఉక్కు పాదంతో అణచివేస్తానని కేంద్రానికి గట్టి నమ్మకం కలిగించే ప్రయత్నాన్ని గవర్నర్‌ చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కిరణ్‌పై అనాసక్తి?...
నిజానికి గవర్నర్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌ పాలనా దక్షతపై పెద్దగా విశ్వాసం లేదన్న మాటలూ వినిపిస్తున్నాయి. తెలంగాణలో కానీ, సీమాంధ్రలో కానీ శ్రీకృష్ణ నివేదిక దరిమిలా పరిణామాలు హింసాత్మకమై శాంతి భద్రతల సమస్య తలెత్తితే కిరణ్‌ సర్కార్‌ నియంత్రించలేదన్న అభిప్రాయంతో గవర్నర్‌ ఉన్నట్టు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి తీసుకు వస్తే కిరణ్‌ సులభంగా లొంగిపోతారన్న అభిప్రాయం గవర్నర్‌కు ఉందని, దీనికి ఉదాహరణ ఉద్యమాల సందర్భంగా నమోదైన కేసుల నుంచి విద్యార్థులను విముక్తులను చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ ప్రాంత ఎంపీలు ఒకటిన్నర రోజులు నిరశన పాటించగానే ఆ డిమాండ్‌కు అనుకూలంగా కిరణ్‌ నిర్ణయం తీసుకోవటం గవర్నర్‌కు నచ్చలేదని విశ్వసనీయంగా తెలిసింది.

అలాగే రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఫ్రీ జోన్‌ అంశం తేలేదాకా ఎసై్స నియామకాలు చేపట్టరాదని రాజకీయ పార్టీలు, జేఏసీలు తీసుకు వచ్చిన ఒత్తిడికి సైతం ప్రభుత్వం లొంగిపోవటం పట్ల గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో మున్ముందు శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసు హృదయంతో అణచి వేయటమే తప్ప లొంగుబాటుకు వెళ్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని, ఈ ధైర్యం రాజకీయ పార్టీలకు ఉండదు కాబట్టి తన చేతికి పగ్గాలు ఇస్తే కేంద్రానికి ఎలాంటి తలనొప్పీ రాకుండా చూస్తానని గవర్నర్‌ తన పైరవీ తానే చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇప్పటికే జోక్యాలు...
వాస్తవానికి రాష్ట్ర గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే గవర్నర్‌ ప్రభుత్వ వ్యవహారాలను నిశితంగా పరిశీలించటం ప్రారంభించారు. తాను అందరి లాంటి గవర్నర్‌ను కాదని పదే పదే చెప్పుకున్నారు. అనేక సందర్భాలలో ముఖ్య మంత్రులు సహా సీనియర్‌ ఐఎఎస్‌, ఐపీఎస్‌, ఇంటిలిజెన్స్‌ అధికారులను పిలి పించి పరిస్థితులు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు సమ ర్పించారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన మర ణం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.రోశయ్య తమ రాజకీయ అనుభవం, చాతుర్యాన్నంతా ఉపయోగిస్తూ గవర్నర్‌ను మెప్పిస్తూ వచ్చారు. అనే క సందర్భాలలో రోశయ్య లౌక్యాన్ని ప్రదర్శించి గవర్నర్‌కు అవసరమైనంత మే రకే సమాచారం అందిస్తూ వచ్చారు. ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో గవర్నర్‌ ఇంత వరకూ పాలనాపరమైన అంశాలపై చర్చించిన సందర్భం లేదు.

సిఫారసుల మేరకే?...
అసలు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏముందో ఎవరికీ తెలియకుండానే రాష్ట్రానికి భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను రప్పించటం, ఉస్మానియా వర్సిటీలో భారీగా మోహరించి వరుసగా కవాతులు నిర్వహింపజేయటం వంటి నిర్ణయాలను డీజీపీ తీసుకోవటం వెనుక సైతం గవర్నర్‌ జోక్యం ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో శ్రీకృష్ణ కమిటీతో సైతం ఆయన మాట్లాడినట్టు చెబుతున్నారు. నివేదిక సమర్పించటం వరకే తప్ప శాంతి భద్రతల విషయంలో తమకే సంబంధం లేదని మంగళవారం ఢిల్లీలో మీడియాకు చెప్పిన జస్టిస్‌ శ్రీకృష్ణ అదే సందర్భంలో శాంతి భద్రతలను పరిరక్షించటానికే అదనపు బలగాలు వెళ్ళాయని, దానివల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందేమీ కలగదని చెప్పటం గమనార్హం.

కాంగ్రెస్సే గెలిచింది !

kk-come
విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలన్న డిమాండ్‌తో దీక్షకు దిగిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల వ్యూహం ఫలించింది. రెండు రోజులుగా ఈ ఎంపీలు చేస్తున్న దీక్ష కార్యక్రమం అందరూ ఊహించినట్లుగానే సుఖాంతమైంది. ఇన్నాళ్ల పాటు మొత్తం కేసుల ఎత్తివేతకు న్యాయ పరమైన చిక్కులను సాకుగా చూపిన ప్రభుత్వమే నేడు వాటిని స్వయంగా తొలగించేందుకు సిద్దమైంది. ఈ కేసుల ఎత్తివేత క్రెడిట్‌ కాంగ్రెస్‌ పార్టీకే దక్కాలన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరును పరిశీలిస్తే స్పష్టమవుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని అధికార కాంగ్రెస్‌ పార్టీ సైతం అంగీకరిస్తోంది. తెలంగాణలో తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకే అధికార కాంగ్రెస్‌ పార్టీ ఈ రకమైన పాచికలు వేసిందని తెలుస్తోంది. తెలంగాణ పేరుపై జరిగే ప్రతి కార్యక్రమంలోనే క్రెడిట్‌తనకే దక్కేలా కాంగ్రెస్‌ నాయకత్వం వ్యూహ రచన చేస్తోంది.

న్యాయపర చిక్కులు ఇప్పుడెలా వీడుతాయి?
రాష్ట్ర విభజన ఉద్యమంలో విద్యార్ధులపై నమోదుచేసిన కేసులను ఎత్తి వేయాలన్న డిమాండ్‌ న్యాయపరమైనది అని అన్ని రాజకీయ పార్టీలు భావిం చాయి. ఈ నేపథ్యంలోనే మొన్నటి శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ఉభయ సభలలో ఈ అంశంపై అన్ని పార్టీలు ముక్త కంఠంతో కేసుల ఎత్తివేతకు డిమాం డ్‌ చేశాయి. కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటూ మొత్తం కేసులను ఎత్తివేసే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. కొన్ని చిన్న చిన్న కేసులు మినహా సీరి యర్‌, వెరి సీరియస్‌ కేసులను ఎత్తివేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం వొక్కానించింది.

ఈ కేసులు ఎత్తివేతకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని కూడా స్పష్టం చేసింది. ఈ కారణం చేత మొత్తం కేసులను ఎత్తివేయలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం కేసులు ఎత్తివేయాల్సిందేనని ప్రతిపక్షపార్టీలతోపాటు అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులంతా సభలో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై రెండున్నర రోజుల పాటు సభ కూడా స్థంబించింది. ఇంత చేసిన న్యాయపరమైన చిక్కులున్నాయని, మొత్తం కేసుల ఎత్తివేత సాధ్యంకాదని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. కానీ ఈ సమావేశాలు ముగిసి నెల రోజులు కూడా కాకముందే కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షకు దిగడంతో మొత్తం కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

న్యాయపరమైన సమస్యలను తెరపైకి తీసుకురాకుండానే అన్ని ఎత్తివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వెనక అసలు వ్యూహం ఏమిటో ఇట్టే తెలుస్తోంది. మొత్తం కేసుల ఎత్తివేతకు అసెంబ్లీలో ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో కోరినా స్పందించని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం వాటిపట్ల సానుకూలంగా స్పం దించడం వెనక వ్యూహం దాగివుందని ఇట్టే తెలుస్తోంది. నాడు ప్రభుత్వం ఈ వ్యవహారంలో స్పందించివుంటే అధికార కాంగ్రెస్‌కే కాకుండా క్రెడిట్‌ ప్రతి పక్షపార్టీలకు దక్కేది. ఈ కారణం చేతను అసెంబ్లీ సమావేశాలలో స్పందిం చకుండా సాగదీసి కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షలు చేశాక స్పందించడం క్రెడిట్‌ కోస మేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు ఎత్తివేస్తున్నప్పుడు క్రెడిట్‌ తమకు దక్కకపోతే ఎలా అని ఓ కాంగ్రెస్‌నేత వ్యాఖ్యనించడం గమనార్హం.

సొంత అజెండాతోనే?
తెలంగాణ సాధనకోసం అన్ని పార్టీలతో కలసి ఒకే అజెండాతో ముందుకెళ్తామని మొన్నటి వరకు చెప్పిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేక అజెండాతో కదనరంగంలోకి దూకుతున్నారు. విద్యార్ధుల కేసుల ఎత్తివేతపై స్వతంత్రంగానే దీక్షలోకి దిగిన తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం భవిష్యత్తులోకూడా ఇదే ధోరణీతో వెళ్లాలని యోచిస్తున్నారు. ఈ కేసులను మేమే ఎత్తివేయించామని చెప్పుకోవడంతోపాటు తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామే అని చెప్పుకోనే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది, తెచ్చేది తాము అని చెప్పినందున ఈ విషయంలో తమపై బాధ్య మరింత పెరిగిందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ రకమైన ప్రచారం ద్వారా తెలంగాణ ఉద్యమంలో పెద్దన్న పాత్రను పోషించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం సిద్దమవుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో టిఆర్‌ఎస్‌కు చెక్‌పెట్టి క్రెడిట్‌ను దక్కించుకొనే యత్నం సాగిస్తోంది. 

కాంగ్రెస్‌ ఎంపీల దీక్ష రాజకీయ డ్రామా : ఎర్రబెల్లి కేసులు ఎత్తివేయాలంటూ కాంగ్రెస్‌ ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్ష అంతా రాజకీయ డ్రామా అని టీడీపీ నేత ఎర్రబెల్లి ఎద్దేవ చేశారు. కాంగ్రెస్‌తో కేసీఆర్‌ సైతం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారని ఆయన విమర్శించారు. అక్రమ కేసులు పెట్టింది వాళ్లే, ఎత్తేసింది వాళ్లే... దీంట్లో కొత్త ఏముందని ప్రశ్నించారు. అసెంబ్లీని ఏడు రోజులు స్థంభింపజేశాం... పార్లమెంటును ఏనాడైనా స్థంభింపజేశారా? అని కాంగ్రెస్‌ ఎంపీలను ఆయన నిలదీశారు. చిత్తశుద్ది ఉంటే ఆమరణ దీక్ష చేయండని సవాల్‌ విసిరారు.