హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై తెలంగాణ పోరాట వీరుడు కొమురం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణవాదుల ఒత్తిడికి దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం భీమ్ విగ్రహాన్ని సత్వరం ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో సాంస్కృతిక శాఖ పని ప్రారంభించింది. మొత్తం 30 లక్షల రూపాయల వ్యయంతో కొమురంభీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
విగ్రహస్థాపనకు స్థలం కేటాయించాల్సిందిగా హైదరాబాద్ గ్రేటర్ కమిషనర్కు లేఖ రాశామని రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక అధికారి కాంతారావు గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు.
తెలంగాణవాదుల ఒత్తిడికి దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం భీమ్ విగ్రహాన్ని సత్వరం ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో సాంస్కృతిక శాఖ పని ప్రారంభించింది. మొత్తం 30 లక్షల రూపాయల వ్యయంతో కొమురంభీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
విగ్రహస్థాపనకు స్థలం కేటాయించాల్సిందిగా హైదరాబాద్ గ్రేటర్ కమిషనర్కు లేఖ రాశామని రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక అధికారి కాంతారావు గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు.