Wednesday, July 11, 2012

దేవుడు జడ్జి

"ధనాని భూమై పశువష్టి గోష్టే...భార్యాగృహ ర్వారే సుతా స్మశానే జనాని భూమే. ధర్మాను గోగచ్ఛతి జీవేక అనే శ్లోకానికి అర్థం ఏమిటంటే ..ధనము భూమిలో ఉండిపోతుంది. పశువులు కొట్టంలో ఉండిపోతాయి. భార్య గుమ్మందాక వస్తుంది. కొడుకు స్మశానం దాకా వస్తాడు.. జనం కూడా స్మశానం వరకే వస్తారు. ధర్మం ఒక్కటే జీవుడితో వచ్చేది'' ఈ తాత్పర్యమే నేను ఆచరిస్తాను అంటారు రిటైర్ట్ న్యాయమూర్తి చేకూరి వెంకట సూర్యనారాయణరాజు.. 
ఈ పేరు ఎక్కువమందికి తెలీకపోవచ్చు కాని దేవుడు జడ్జి అంటే మాత్రం ఓ ఆయనా అంటారు. న్యాయశాఖలో 33 ఏళ్ల అనుభవం ఆయనది. అందులో జడ్జిగా 17 ఏళ్లు. అప్పటి తీర్పులకే దేవుడు జడ్జిగా పేరు పొందారు. దీని వెనుక ఎంతటి త్యాగం, నైతిక విలువలు, పోరాటాలు ఉన్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 15 ఏళ్ళ క్రితమే పదవీ విరమణ చేసినప్పటికీ, అనంతర జీవనం కూడా సమాజ సేవకే అంకితమవ్వడం ఆయన గొప్పతనం.

ఓ న్యాయమూర్తి పనిచేసే కోర్టుకు ధర్మరాజు కోర్టుగా పేరు రావడమంటే మాటలు కాదు. శిక్షలు, జరిమానాలు విధించే ముందు ఆయన కక్షిదారుల పట్ల కనికరం చూపించడమే అందుకు కారణం. కక్షిదారుల పరిస్థితులను సమగ్రంగా పరిశీలించేవారు. విశాఖపట్టణం పోర్టులో మున్సిఫ్ మేజిస్ట్రేట్‌గా పనిచేసినపుడు అవసరమైతే కక్షిదారుల నివాసాలకు వెళ్ళి కుటుంబ సభ్యులతో ఇంటి పరిస్థితుల గురించి చర్చించేవారు. ఆ తర్వాతే వారికి శిక్ష ఖరారు చేసేవారు. ఆ శిక్ష ఎంతో ఎంతో న్యాయంగా ఉండేది. అలా చేస్తాడనే ఆయన పనిచేసిన కోర్టు ధర్మరాజు కోర్టుగా పేరు పొందింది. ఈ శైలి లాయర్లలో, తోటి న్యాయమూర్తులలో చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ కక్షిదారులు మాత్రం చాలా ఆనందించేవారు.

దేవుడు జడ్జి ఎలా అయ్యారంటే.....

శిక్షకు గురైనవారు జరిమానా చెల్లించలేకపోతే తనే ఒక్కొక్కసారి ఆ డబ్బును ప్రభుత్వ ఖాతాలో జమచేసేవారు. ఒక్కొక్కసారి డబ్బు సాయం కూడా అందించి కక్షలు పెంచుకోవద్దంటూ సలహాలు ఇచ్చేవారు. శిక్షలు కూడా నెల నుంచి 15 రోజులలోపు మాత్రమే విధించేవారు. ఈ విషయంలో తన ధోరణిని ఏమాత్రం మార్చుకునేవారు కాదు. ఆయన విశాఖపట్టణంలో పనిచేసినపుడు ఎక్కువగా రైల్వే కేసులు చూసే వారు. అక్కడ బొగ్గు చోరీ కేసులు, టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసిన కేసులు ఎక్కువగా వచ్చేవి.

మామూలుగా రైల్వే బొగ్గు దొంగతనం కేసుల్లో దొంగతనం చిన్నదైనా, పెద్దదైనా శిక్ష మాత్రం ఒకటే ఉండేది. ఆరు నెలల నుంచి ఏడాది వరకూ జైలు శిక్ష వేసేవాళ్లు. ఒకసారి తట్ట బొగ్గు దొంగతనం చేస్తూ ఒక వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. అదే సమయంలో ఒక లారీ బొగ్గు పట్టుకుపోతూ మరో దొంగ కూడా దొరికాడు. చట్టప్రకారం అయితే వీరిద్దరికీ ఒకే శిక్ష వేయాలి. కాని రాజుగారు తట్ట బొగ్గు దొంగతనం చేసిన వ్యక్తికి నెల రోజులు జైలు శిక్ష వేసి, లారీలోడు బొగ్గుల దొంగకు ఆరెనెలలు వేశారు.

మొదటి దొంగ కట్టాల్సిన జరిమానా తనే కట్టారు. తీర్పు హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి వెళ్లినపుడు 'చట్టాన్ని అతిక్రమించి సొంత తీర్పులు ఇవ్వడం కుదరద'ని ఆయన హెచ్చరించారు. చిన్నదొంగను, పెద్ద దొంగను ఒకే గాటన కట్టకూడదు కదా అంటూ ఆయన దానికి వివరణ ఇచ్చుకున్నారు. రైల్వే టిక్కెట్టు కొనకుండా ప్రయాణం చేసిన వారికి, ఆటోలు, రిక్షాలు రాంగ్ పార్కింగ్ చేసేవారితో ఆరు వందల నుంచి రెండు వేల వరకూ జరిమానా కట్టించుకుంటారు. ఇలాంటి కేసుల్లో పేదవారంటే వారితో రెండు రూపాయలే కట్టించేవారు. దీంతో పేదవాళ్లపాలిట దేవుడిగా మారారాయన.

ఇంటికెళ్లిన న్యాయం...
ఒకసారి వైజాగ్‌లో ఇద్దరన్నదమ్ములు ఇంటి ప్రహరీగోడ విషయంలో గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసు కేసులు పెట్టుకున్నారు. కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడి నీది తప్పంటే నీది తప్పంటూ వాదించుకున్నారు. రాజుగారు కేసు వాయిదా వేసి మర్నాడు ఆ ఇద్దరన్నదమ్ముల ఇళ్లకు వెళ్లారు. రెండు కుటుంబాలను కూర్చోబెట్టి మాట్లాడారు. జడ్జీగారే స్వయంగా ఇంటికి వచ్చి సమస్య గురించి మాట్లాడడం చూసి వారంతా షాకయ్యారు.

అన్ని విషయాలను తెలుసుకున్నాక ఎవరు గోడ ఎక్కడ కట్టుకోవాలో ఆయనే స్వయంగా చెప్పి వచ్చారు. ఈ పెద్దాయన సలహాలు, ఆయన చెప్పిన న్యాయం ఆ ఇద్దరన్నదమ్ములకి నచ్చి ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసుల్ని వెనక్కి తీసుకున్నారు. ఇలాంటి కేసులు ఒకటీ రెండూ కాదు వందల సంఖ్యలో పరిష్కరించారాయన. రాజమండ్రిలో న్యాయమూర్తిగా పనిచేసేటప్పుడు దశాబ్ద్దాలుగా పెండింగ్‌లో ఉన్న 2200 కేసుల్ని రెండేళ్లలో పరిష్కరించి న్యాయశాఖ ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా పొందారు. ఏ కోర్టులో ఉన్నా ఆయన ఇదే ధోరణి అవలంబించేవారు.

సేవా జీవితం...

దేవుడు జడ్జికి కబడ్డి అంటే ఎంతో ఇష్టం. కాలేజి చదువు నుంచే ఎన్నో పోటీల్లో పాల్గొనే వాడినని చెప్పారు. న్యాయశాఖలో ఉద్యోగిగా ఉండి కూడా కబడ్డీ ఆడి రాష్ట్రస్థాయి క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. రిటైర్ అయినా ఆటపై మక్కువ పోలేదు అంటారు. పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆయన తన సేవా కార్యక్రమాలు ఆపలేదు. తనకు వచ్చే రూ.30 వేల పింఛను సొమ్ములో కొంత భాగాన్ని పేదలు కోసం కేటాయిస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికంగా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


- వరప్రసాద్, ఆన్‌లైన్,భీమవరం


Saturday, July 7, 2012

ఇవేం కొద్ది బుద్ధులు

పోయినోళ్లంతా మంచివాళ్లే -ఇది మనకు మన పెద్దలు నేర్పిన సంస్కారం. అయితే ఇప్పుడు మనం ఈ సంస్కారాన్ని వదిలి కుసంస్కారానికి అలవాటు పడుతున్నాం. దశాబ్దాలుగా మహనీయులుగా గుర్తింపు పొంది, జాతి గౌరవం పొందిన ఆదర్శమూర్తులకు కూడా కళంకం అంటించడానికి ఇటీవలి కాలంలో ప్రయత్నాలు మొదలయ్యాయి. చరిత్రలో మహనీయులుగా కీర్తించబడిన వారికి కూడా ఏవో కొన్ని వ్యక్తిగత బలహీనతలు, జీవించి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలలో అప్పుడప్పుడు అపశ్రుతులు దొర్లి ఉండవచ్చు. చిన్ని చిన్ని లోపాలను ఎత్తి చూపకుండా ఆయా మహానుభావులు జాతికి చేసిన సేవలను గుర్తించి గౌరవించడం మన బాధ్యత. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయా వ్యక్తులను వివాదాస్పదం చేయడం ఒక ఘనకార్యంగా చలామణి అవుతోంది.

సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నట్టు ఒక వ్యక్తి గొప్పవాడుగా కీర్తించబడటానికి ఎన్నో త్యాగాలు చేసి ఉండాలి. గొప్పవాళ్లను పలుచన చేయడం ద్వారా తాము కూడా గొప్పవాళ్లం అని అనిపించుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాలలో ఇలాంటి వ్యక్తులు సఫలం అవుతూ ఉంటారు కూడా. అంత మాత్రాన ఇంతకాలం మనం పూజించిన మహనీయులకు వచ్చిన నష్టమేమీ ఉండదు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం మనల్ని మనం కించపరచుకోవడమే అవుతుంది.

ఇదేదో కొత్తగా ఇప్పుడే ప్రారంభం కాలేదు. లబ్ధప్రతిష్ఠులలో లోపాలు వెతికేవారు ఎప్పుడూ ఉండనే ఉంటారు. అయితే గతంలో ఇలాంటి చర్యలకు ప్రాచుర్యం లభించేది కాదు. ఇప్పుడు ప్రసార మాధ్యమాల ప్రభావం అధికం కావడంతో గొప్పవాళ్లతో పాటు వారిని నిందించే వారికి కూడా ప్రచారం లభిస్తోంది. నిజానికి లోపాలు వెతకడం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది.

అంతదాకా ఎందుకు - దేవుడు ఉన్నాడని నమ్మేవారు ఉన్నట్టుగానే, లేడని నమ్మేవారు కూడా ఉన్నారు కదా! గిరిపుత్రుల జీవితాలలో వెలుగు నింపడానికి బ్రిటిష్‌వారితో పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి కూడా బర్ల వెంకటరావు అనే అతను తన వ్యాసంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా దివంగత పి.వి.నరసింహారావును కూడా వివాదాల్లోకి లాగుతూ పుస్తకాలు వస్తున్నాయి. ఇవన్నీ చరిత్రలో మరో కోణం చూపడానికి పనికి వస్తాయేమో గానీ, సమాజానికి మరే విధంగానూ ఉపయోగపడవు. పి.వి.కి తెలిసే బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందని ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు ఈ విషయంలో కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. పి.వి. ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఆయన 'మా వాడు' కాదు అన్నట్టు వ్యవహరిస్తోంది. అయినా పి.వి.ని దోషిగా చిత్రీకరించడం వల్ల ఆయన చేసిన మంచి పనులు మరుగున పడిపోవు. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పి.వి. సొంతం. ఆనాటి పరిస్థితులలో ఆర్థిక సంస్కరణలు తప్ప మరో మార్గం కనిపించి ఉండకపోవచ్చు! అయితే కాలక్రమంలో విధానాలలో మార్పులు చోటుచేసుకోవడం సహజం.

సమాజానికి ఇవ్వాళ మంచి చేసిన విధానాలు, రేపు చెడు చేసేవిగా మారవచ్చు. ఇందుకు ఏ 'ఇజం' కూడా అతీతం కాదు. చైనాలాంటి దేశంలోనే కమ్యూనిస్టులు తమ విధానాలలో ఎన్నో మార్పులు చేసుకుంటూ రావడం వల్లనే ఇప్పటికీ అక్కడ కమ్యూనిజం మనగలుగుతోంది. అలాగే పి.వి.నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలలో మార్పులు చేసుకోవలసిన బాధ్యత తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులదే అవుతుంది. ఆర్థిక సంస్కరణల వల్ల ఏవైనా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయంటే అందుకు వాటిని ప్రారంభించిన పి.వి.ని తప్పుబట్టే బదులు, ఆయా విధానాలలో మార్పులు చేయకుండా గుడ్డిగా అనుసరించిన తదుపరి పాలకులనే నిందించాలి.

అలాగే బాబ్రీ మసీదు వ్యవహారం ముగిసిపోయిన అధ్యాయం. మసీదు కూల్చివేతకు పి.వి.ని బాధ్యుడిని చేసినా, చేయకపోయినా ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు ఏమీ ఉండదు. ఆయన కీర్తిశేషుడై చాలా కాలమైంది. ఆయన వారసులు ఎవరూ అధికారంలో లేరు. అయినా ఈ అంశాన్ని ఇప్పుడు రాజకీయం చేయడానికి ఏ పార్టీ అయినా ప్రయత్నిస్తే అది వారి కుసంస్కారానికి నిదర్శనం. పి.వి.ని కాంగ్రెస్ పార్టీనే సొంతం చేసుకోనప్పుడు ఈ అంశాన్ని రాజకీయం చేయడం వల్ల ఏ పార్టీకైనా వచ్చే ప్రయోజనం ఏమిటి?

ఇక వ్యక్తిగత విషయాలకొస్తే ఆయా రంగాలలో లబ్ధప్రతిష్ఠులైన వారిలో ఏదో ఒక బలహీనత ఉండే అవకాశమే ఎక్కువ. అయితే సమాజ విశాల ప్రయోజనాల కోసం వారు చేసిన సేవలను జాతి గుర్తుపెట్టుకుంటుందే గానీ వ్యక్తిగత అంశాలను ఏనాడూ పట్టించుకోలేదు. పట్టించుకోదు. ఉదాహరణకు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూనే తీసుకుందాం. ఆయనకు లేడీ మౌంట్‌బాటన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండేవని ప్రచారం జరిగింది. అయినా భారత తొలి ప్రధానిగా నెహ్రూ దేశానికి చేసిన సేవలనే జాతి గుర్తుంచుకుంది. జాతిపిత మహాత్మాగాంధీకి కూడా వ్యక్తిగత బలహీనతలు ఉన్నాయని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.

అయినా ఈ దేశ ప్రజలే కాదు- ప్రపంచమే వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. భారతదేశానికి స్వాతంత్య్రం సముపార్జించి పెట్టిన మహానుభావుడిగానే మనం ఆయనను స్మరించుకుంటూ గౌరవిస్తున్నాం. అయితే దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఇంతకాలం జాతి మొత్తం పూజించిన మహనీయులను కొందరివాళ్లుగా కుదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహాత్మాగాంధీ విగ్రహాలకు అపచారం జరిగితే ఆర్య వైశ్యులు మాత్రమే స్పందిస్తున్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు దళితవాడలకే పరిమితం అవుతున్నాయి.

ఆయన విగ్రహాలను ధ్వంసం చేస్తే దళితులు మాత్రమే ఆందోళన చేస్తున్నారు. మన్యం వీరుడిగా కీర్తించబడిన అల్లూరి సీతారామరాజును సొంతం చేసుకోవడానికి ఇప్పుడు క్షత్రియులు ఆరాటపడుతున్నారు. ఇలా అందరివాళ్లను కొందరివాళ్లుగా కుదించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించవలసిన అవసరం ఉంది. పి.వి.నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల లాభపడింది, నష్టపోయింది బ్రాహ్మణులు మాత్రమే కాదు. అయినా పి.వి.ని బ్రాహ్మణులకే పరిమితం చేస్తున్నారు. విద్యాబుద్ధులతో వికసించవలసిన మన మనస్సులు ఇలా కుదించుకుపోవడానికి కారణాలను అన్వేషించవలసిన తరుణం ఆసన్నమైంది.

ప్రతి విషయాన్నీ రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలన్న ధోరణి రాజకీయ పార్టీలలో పెరిగిపోవడం వల్ల దాని ప్రభావం సమాజంపై పడింది. ఫలితంగానే మనం కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా విడిపోతున్నాం. అల్లూరి సీతారామరాజు 115వ జయంతి ఉత్సవాలు రెండు రోజుల క్రితమే జరిగాయి. అల్లూరి స్మారక సేవా సమితి ఆహ్వానం మేరకు ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి భీమవరం వెళ్లిన నన్ను, కొంత మంది రాజుల కుర్రాళ్లు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. భీమవరంలో రైలు దిగిన నాకు ఈ పరిణామం తెలిసి ఆశ్చర్యం వేసింది. అల్లూరి సీతారామరాజును కించపరిచే విధంగా 'ఆంధ్రజ్యోతి' పత్రికలో బర్ల వెంకటరావు అనే అతను రాసిన వ్యాసాన్ని ప్రచురించినందుకు నిరసన తెలుపుతున్నట్టు సదరు యువకులు ప్రకటించారు.

వాస్తవానికి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నవారిలో అత్యధికులు పత్రికలే చదవరు. అందునా ఎడిట్ పేజీలో వచ్చిన వ్యాసాలను చదివే అలవాటు ఎంత మందికి ఉంటుంది? అయినా ఎవరో రాసిన వ్యాసానికి నాకు నిరసన తెలపడం ఏమిటా అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ఈ నిరసనల తంతు వెనక యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలం ఉండటం ఆశ్చర్యం కలిగించలేదు. జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఎండగట్టడంలో 'ఆంధ్రజ్యోతి' పత్రిక అగ్రభాగాన ఉండటం ఆ పార్టీ వారికి సహజంగానే కంటగింపుగా ఉంటుంది. అయితే తమ నాయకుడికి వ్యతిరేకంగా వార్తలు వచ్చినందుకు నేరుగా నిరసన తెలపలేరు

కనుక, బర్ల వెంకటరావు రాసిన వ్యాసాన్ని సాకుగా చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజును కించపరుస్తూ 'ఆంధ్రజ్యోతి'లో ఒక వ్యాసం వస్తే ఆయన ఔన్నత్యాన్ని కొనియాడుతూ అయిదు వ్యాసాలు వచ్చాయి. అంటే సీతారామరాజును న్యూనత పరచాలన్న ఆలోచన గానీ, ఉద్దేశం గానీ 'ఆంధ్రజ్యోతి'కి లేదని స్పష్టమవుతోంది. మే నెలలో ప్రచురితమైన ఈ వ్యాసానికి జూలై నెలలో నిరసన తెలపడం ఏమిటన్న ప్రశ్న ఉండనే ఉంది. వాస్తవానికి నాకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలను సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదు.

అయినా ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్నదంటే, జగన్ పార్టీ కపటత్వాన్ని వివరించడంతో పాటు, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడేవారు ఆచరణలో ఏ విధంగా వ్యవహరిస్తారో చెప్పడానికే! బర్ల వెంకటరావు రాసిన వ్యాసంలోని అంశాలు అల్లూరిని అభిమానించేవారి మనస్సులను గాయపరచి ఉండవచ్చు. సీతారామరాజును నిజంగా అభిమానించేవారు ఆయన ఆశయాలను సైతం పుణికిపుచ్చుకుని ఆచరించాలి. బ్రిటిష్ ప్రభుత్వ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా అల్లూరి పోరాటం చేశారు.

మన్యం ప్రజల జీవితాలలో వెలుగు నింపడానికి తన జీవితాన్ని త్యాగం చేశారని మనం చదువుకున్నాం. అలాంటి త్యాగమూర్తికి అపచారం జరిగిందని బాధపడేవారు ఆచరణలో అల్లూరిని అనుసరిస్తున్నారా.. అన్నదే ఇక్కడ ప్రశ్న! పేదల కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు కాగా, నాకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు దర్శకత్వం వహించిన పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పేదల పేరిట ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి! ఎంత వైరుధ్యం! సీతారామరాజును అభిమానించే వారు జగన్ పార్టీలో ఎలా కొనసాగగలుగుతున్నారా? అన్నదే నా సందేహం. అంటే హిపోక్రసీకి కూడా అంతు లేకుండా పోతున్నదన్న మాట! ఇక్కడ ఒక విషయం ప్రస్తావించవలసి ఉంది.

భీమవరంలో జరిగిన సభలో పాల్గొన్న వారిలో వయోధికులే ఎక్కువ. సభా ప్రాంగణం వెలుపల నిరసన తెలుపుతున్నవారంతా యువకులే! అంటే మన యువత ఆలోచనలు ఎంత పెడదారి పడుతున్నాయో అర్థమవుతోంది. అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వారిలో చేకూరి వెంకట సూర్యనారాయణరాజును చూపిస్తూ "ఆయనను దేవుడు జడ్జీగా పిలుచుకుంటాం'' అని మాజీ ఎమ్మెల్యే ఎర్రా నారాయణస్వామి నాతో అన్నారు. అదేమిటని ప్రశ్నించగా "ఆయన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యారు.

న్యాయమూర్తిగా ఉన్నప్పుడు చట్ట ప్రకారం పేదలకు శిక్ష విధించవలసి వస్తే అపరాధ రుసుం విధించేవారు. అయితే పేదల తరఫున సదరు అపరాధ రుసుమును సొంత జేబులోంచి ఆయనే చెల్లించేవారు'' అని నారాయణస్వామి చెప్పారు. అలాంటి ఆదర్శమూర్తుల వారసులు ఇప్పుడు జగన్ పార్టీ తరఫున తిరుగుతున్నారు. ఈ పరిణామం పట్ల అల్లూరి సీతారామరాజును నిజంగా అభిమానించి, గౌరవిస్తున్నవారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రాజకీయ కుయుక్తులతో లబ్ధి పొందడానికి జగన్ పార్టీ అలవాటు పడింది. కొందరిని కొంత కాలమే మోసం చేయగలం. అందరినీ అన్ని సందర్భాలలోనూ మోసం చేయలేం! ఈ సూత్రాన్ని విస్మరించిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అమాయకులు, తాము ఏమి చెప్పినా నమ్ముతారన్న ధీమా వారిలో ఉండవచ్చు. నిజం కన్నా అబద్ధం ముందుగా ప్రచారంలోకి వెళ్లడం కూడా ఇందుకు కారణం కావొచ్చు. నిజం నిలకడ మీద తెలుస్తుందని కూడా చెప్పుకుంటాం కనుక జగన్ పార్టీ కపటత్వాన్ని ప్రజలు ఏదో ఒక రోజు తెలుసుకోకపోరు.

తాజాగా సృష్టించిన కాల్ లిస్ట్ వివాదాన్నే తీసుకుందాం. సి.బి.ఐ. జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, చంద్రబాల, నేను కలిసి జగన్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నామని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. నేను, లక్ష్మీనారాయణ మాట్లాడుకున్నట్టు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని నేను విసిరిన సవాల్‌కు వారి నుంచి ఇంతవరకు సమాధానం లేదు. ఇది వాస్తవం కాదని వారికి కూడా తెలుసు. అయినా రాజకీయ పార్టీలు, మీడియా కలిసి జగన్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని జనాన్ని నమ్మించడమే వారి లక్ష్యం కనుక అడ్డగోలు ఆరోపణలు చేస్తూ ఉంటారు.

హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మరణించడం వెనుక కుట్ర ఉందని కూడా ఇదే విధంగా ప్రచారం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ తల్లి శ్రీమతి విజయలక్ష్మి, చెల్లి షర్మిల ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. రాజశేఖర్ రెడ్డి మరణం ప్రమాదవశాత్తూ జరిగిందేనని తెలిసినా, ఆ సంఘటన వెనుక కుట్ర ఉందనీ, రాజశేఖర్ రెడ్డిని చంపించారనీ ప్రజల్లో అనుమాన బీజాలు వేయడం వల్ల ఎన్నికలలో లబ్ధి పొందడం వారి లక్ష్యం. ఈ విషయంలో వారి లక్ష్యం నెరవేరిందని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. దీంతో ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ప్రచారం ప్రారంభించారు.

కాంగ్రెస్ నాయకులు కొందరు ఆక్షేపిస్తున్నట్టుగా ఎన్నికల తర్వాత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం గురించి తల్లీ కూతుళ్లు ఎందుకు ప్రస్తావించడం లేదు? సి.బి.ఐ అధికారులు జగన్‌ను వేధిస్తున్నారని ఢిల్లీదాకా వెళ్లి ప్రధానమంత్రిని సైతం కలిసి మొర పెట్టుకున్న శ్రీమతి విజయలక్ష్మి, కనీసం మాట మాత్రంగానైనా తన భర్త మరణం గురించి ప్రస్తావించకపోవడానికి కారణం ఏమిటి? ఒకవైపు సి.బి.ఐ., మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కమ్ముకురావడంతో పీకల్లోతు కష్టాలలో చిక్కుకున్న జగన్‌ను వీలైతే కేసుల నుంచి బయటపడేయడానికి లేదా ప్రజల్లో మళ్లీ సానుభూతి పొందడానికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత ఢిల్లీ యాత్ర చేపట్టి ఉండవచ్చు. పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నిస్తుంది.

ఇందులో తప్పు పట్టవలసింది ఏమీ లేదు. అయితే ఎదురుదాడే మంత్రంగా జగన్ పార్టీ పన్నుతున్న పన్నాగాలకు ఒక్కొక్క వ్యవస్థ బలవుతూ వస్తున్నది. న్యాయ వ్యవస్థలో ఏమి జరిగిందో మనం చూశాం. పారిశ్రామిక రంగం కుదేలైంది! మంత్రులు కేసుల్లో చిక్కుకున్నారు. ఒక మంత్రి జైలు జీవితం గడుపుతున్నారు. చివరకు మీడియాలో కూడా విభేదాలు సృష్టించారు. జర్నలిస్టుల సంఘాల నాయకులను కూడా వివాదాస్పదం చేశారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన నాలుగు స్తంభాలకు మకిలి అంటించిన ఘనత 'జగన్ అండ్ కో'కే చెందుతుంది. జీవిత చరమాంకంలో కాసులకు కక్కుర్తి పడినందుకుగాను న్యాయమూర్తి పట్టాభి రామారావు అవమాన భారంతో కుంచించుకుపోతున్నారు.

అటు గాలి, ఇటు జగన్ కేసుల్లో చిక్కుకున్న అధికారులు, వ్యాపారవేత్తలు మౌనంగా రోదిస్తూ జైలు జీవితం గడుపుతుండగా, ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయంగా మలచుకుని ప్రయోజనం పొందడానికి శ్రీమతి విజయలక్ష్మితో పాటు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కుమారుడు జైలుకు వెళ్లి నెల దాటిందన్న విచారం శ్రీమతి విజయలక్ష్మి మొహంలో కనిపించడం లేదు. ఆమె ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులను కలుసుకుని మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చిరునవ్వులు చిందిస్తున్నారు. భర్తను కోల్పోయి, కొడుకు జైలు పాలైనా దిగులు పడని శ్రీమతి విజయలక్ష్మి కోసం జనం మాత్రం బాధపడుతున్నారు.

జగన్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మానసికంగా కుంగిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గాలికి బెయిల్ కేసులో ఎ.సి.బి. అధికారులు అరెస్ట్ చేసిన సమయంలో రౌడీ షీటర్ యాదగిరిరావు చిద్విలాసంగా చేతులు ఊపుతూ, 'మళ్లీ కలుద్దాం' అని మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య నేరాలకు అలవాటు పడిన వారికి, తెలిసో తెలియకో విధిలేని పరిస్థితులలో నేరం చేసిన వారికి మధ్య వ్యత్యాసాన్ని చెప్పకనే చెబుతున్నది. ఈ మొత్తం కేసులలో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న వారిలో జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, సునీల్ రెడ్డి, యాదగిరిరావు మినహా మిగతా వారెవ్వరూ వంచిన తల ఎత్తడం లేదు.

జగన్ పార్టీ నాయకులు తమ ప్రత్యర్థులుగా భావిస్తున్న వారిపై ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నా, ఈ వ్యత్యాసాన్ని ప్రజలు తెలుసుకునే రోజు ఎంతో దూరంలో లేదు. రాజకీయాలలో ఉన్నవారంతా అవినీతిపరులేనని ప్రచారం జరగడం కూడా జగన్‌కు లాభిస్తున్నది. ఈ ప్రచారానికి ఒక వర్గం మేధావులు కూడా ఊతం ఇవ్వడంతో మంచికి, చెడుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ఫలితంగా నిబద్ధత, నిజాయితీతో వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులకు, అవినీతిపరులకు మధ్య అంతరం తెలియకుండా పోతున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మొత్తం రాజకీయ వ్యవస్థపైనే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లి ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. సినిమాలలో ఇదివరకు ప్రతినాయకుడి పాత్రలను అందవిహీనంగా చూపించేవారు.

ఇప్పుడు హీరో కంటే అందమైన వాళ్లతో ప్రతినాయకుడి పాత్రలు వేయిస్తున్నారు. దీంతో విలన్లను ఆరాధించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పుడు రాజకీయాలలో కూడా ఇదే పరిస్థితి. విలన్ లక్షణాలు ఉన్నవారు హీరోలుగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే చరిత్ర పురుషుల ఔన్నత్యాన్ని జాతికి తెలియజెప్పవలసిన అవసరం ఉంది. మహనీయుల లోపాలను ఎత్తిచూపే బదులు, వారి త్యాగాలను వివరించగలిగితే సమాజానికి మేలు చేసిన వాళ్లవుతారు. కంచుకి, కనకానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గుర్తించేలా వారిని చైతన్యపరచవలసిన బాధ్యత మేధావి వర్గంపై ఉంది. లేని పక్షంలో మన యువత, గాంధీ బదులు గాడ్సేలను ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది! 

కొత్త పలుకు! - ఆర్కే


Monday, July 2, 2012

నెల్లూరు నుంచి నాసా వరకు


అమెరికాలో అత్యున్నత ఉద్యోగాలు చేస్తున్న మన తెలుగింటి ఆడపడుచులు చాలా మందే ఉన్నారు. వారిలో నెలకో ఇద్దర్ని 'మన పరదేశీ' శీర్షిక కింద పరిచయం చేసే కాలమ్ ఇవాళ్టి నుంచి ప్రారంభించాం. నాసాకు చెందిన లాంగ్లీ రీసెర్చి సెంటర్ (లార్క్)లో సీనియర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్‌గా పని చేస్తున్న ఏకైక భారతీయ మహిళ మంజులా అంబూర్. నెల్లూరులో పుట్టి కర్నూలులో చదివి అమెరికా వెళ్లి నాసా ఇచ్చే అసాధారణ ప్రతిభా మోడల్, వారి టీమ్ లీడర్‌షిప్ అవార్డులు పొందిన ఆమే మొదటి 'మన పరదేశీ'


అమెరికా వచ్చేనాటికి నేను డిగ్రీ మాత్రమే చేశాను. నా భర్త దామోదర్ రెడ్డి పి.హెచ్.డి చేయడానికి అమెరికా వస్తే ఆయన వెంట నేనూ వచ్చాను. ఆ తరువాత నాసాలో ఉద్యోగం వచ్చిందాయనకి. నేనేమో కమ్యూనిటీ కాలేజిలకి వెళ్లి కంప్యూటర్ కోర్సులు చేశాను. జార్జియా స్టేట్ యూనివర్శిటీలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో ఎమ్మెస్ చేశాను.మేము అమెరికాకి వచ్చినప్పుడు పరిస్థితులు వడ్డించిన విస్తరిలా ఏమీ లేవు. ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు, అలవాటు పడేందుకు కొంత సమయం పట్టింది. అయితే నాకున్న పట్టుదల, సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు వీలయినంత ఎక్కువ పనిచేయాలనుకునే నా ఆలోచనలే నన్ను కెరీర్ పరంగా బాగా నిలబెట్టాయి. ఎంత వీలైతే అంతే పని చేయాలనుకునే వారిలో ఒకదాన్ని కాదు నేను. ఏ పని చేసినా వంద శాతం కృషి చేస్తాను. ఎప్పుడూ, ఏ విధంగా నేను చేసే పనిలో వెనక్కి తగ్గి ఉండాలని అనుకోను. నేను వీరికంటే తక్కువ, నాకు వీరికంటే ఎక్కువ తెలీదు లాంటి భావాలని అసలు దరికి రానీయలేను. నా మెరిట్‌ని, తెలివిని, కృషిని నమ్ముకుని ముందుకు సాగుతూ పోయాను.


మొదటి మహిళని నేనే
అట్లాంటాలోని ఐటి డిపార్టుమెంటులో నా కెరీర్ మొదలయ్యింది. అక్కడ మూడేళ్లు పనిచేసిన తరువాత నాసాకు చెందిన లాంగ్లీ పరిశోధనా కేంద్రం (వర్జీనియా)లో చేరాను. మన దేశానికి చెందిన మగవాళ్లు, అమెరికా ఆడవాళ్లు చాలామందే పనిచేస్తున్నారక్కడ. కాని అక్కడ చేరిన మొదటి భారతీయ మహిళని మాత్రం నేనే. లాంగ్లీరీసెర్చి సెంటర్ నాసా ఫీల్డ్ సెంటర్స్‌లో అన్నిటికన్నా పాతది. లార్క్ ముఖ్యంగా ఏరోనాటికల్ రీసెర్చ్ పై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇక్కడి నుండే అపొలో లునార్ ల్యాండర్ ప్లైట్ టెస్ట్ చేశారు. అలాగే పెద్ద పెద్ద స్పేస్‌మిషన్స్ ఇక్కడే డిజైన్ చేయబడ్డాయి. అమెరికాలో నాసా సెంటర్లు పది ఉన్నాయి. నేను మొదటి భారతీయ మహిళనైతే లాంగ్లీ రీసెర్చి సెంటర్‌కి మొట్టమొదటిసారిగా ఒక అమెరికన్ స్త్రీ లెసా బి.రో. ఇప్పుడు డైరెక్టర్‌గా ఉన్నారు.


జెండర్‌తో కాకుండా మెరిట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ. అందుకని నన్నెవరూ వేరుగా చూడరు. నా పనిని గౌరవిస్తారు. మొదటి నుండీ నాసాలో చాలెంజింగ్ పనులే ఇచ్చేవారు. ఇష్టమైన పనిచేస్తుంటే కష్టంగా అనిపించదు అనేది నాకు బాగా వర్తిస్తుంది. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలతో ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోగలిగానంటే ఈ పని పట్ల నాకున్న ఇష్టమే కారణం. మా ఆయన సహకారం కూడా ఎంతో ఉంది నా విజయంలో. అంతేకాకుండా నాకవసరం అయినప్పుడల్లా అమ్మావాళ్లు వచ్చి సాయం చేయడంతో కెరీర్‌లో పైకెదగగలిగాను. అదే సహకారం ఇప్పటికీ లభిస్తోంది.


నాసాలో లీడర్‌షిప్ ప్రోగ్రామ్స్ చేసిన తరువాత చాలా పనులు చేయడం సులువైంది నాకు. ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థయిర్యం పెంపొందాయి. దాంతో కీలక నిర్ణయాలు తీసుకోవడం సులువైంది. ఎన్నో బృందాలతో వివిధ రకాల ప్రాజెక్ట్స్ విజయవంతంగా చేయగలిగాను.


పని తీరిలా...
ఐటి ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఆపరేషన్ అండ్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్‌లో 1989 నుంచి 1997 వరకు పనిచేశాను. అప్పుడు 30 మంది కంప్యూటర్, సమాచార నిపుణుల బృందంతో కలిసి సెంటర్ వైడ్ 'డిజిటల్ లైబ్రరీ సిస్టమ్స్' ను అభివృద్ధి చేసి ఆచరణలో పెట్టాను. అలాగే దేశంలోని వివిధ నాసా విభాగాల్లో (పది సెంటర్లలో 25 ఉద్యోగుల బృందంతో) మొట్టమొదటి ఆన్‌లైన్ సమాచార పద్ధతిని డిజైన్ చేశాను. 1996 నుంచి 2001 వరకు సీనియర్ ఐటి ప్రాజెక్ట్ మేనేజర్ ఫ్రంట్ ఆఫీసులో ఆఫీసర్‌గా పనిచేశాను. సెంటర్ ఇయర్ 2000 ప్రాజెక్టులో రెండు వందల మంది ఇంజనీర్లు, కంప్యూటర్ నిపుణులతో,సెంటర్ వై2కె క్రాస్ ఆర్గనైజేషనల్ బృందంతో పరీక్షలు జరిపే ప్రదేశాల్లో, పరిశోధనాలయాల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్లకి ఏ సమస్య వచ్చినా అధిగమించడానికి సంసిద్ధంగా ఉన్నాం.


20 మంది బృందానికి నాయకత్వం వహిస్తూ వెబ్ బేస్డ్ పోర్టల్ పద్ధతిని అభివృద్ధి చేసి నాసాలోని వివిధ విభాగాల్లో అద్భుతమైన సమాచార, కమ్యూనికేషన్ పద్ధతిని విజయవంతంగా ప్రవేశపెట్టగలిగాం. దీనివల్ల నాసాకి చెందిన అన్ని కేంద్రాల మధ్య సమాచారాలు పంచుకోవడం సులభమైంది. నాసా ఐటి స్ట్రాటజీ 30 మంది బృందంతో రోడ్‌మ్యాప్‌ని తయారుజేయడంలో, ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని సిస్టం ద్వారా నెట్‌వర్క్‌లో అప్‌గ్రేడ్ చేయడం, నాసా పోర్టల్‌ని వ్యూహాత్మకంగా నిర్మించడంలో ముఖ్యపాత్ర వహించాం. 2001 నుంచి 2005 వరకు స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా, ఆఫీస్ ఆఫ్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేశాను. అలాగే విజ్ఞానాన్ని విస్తరింపచేసే (కెఎమ్ - నాలెడ్జి మేనేజ్‌మెంట్) మిగతా కేంద్రాలతో, ఆ కేంద్రాలలో వివిధ భాగాలు కలిసి పనిచేయడంలో సాయపడ్డాను.నాసా సెంటర్‌లో వివిధ సంస్కృతుల గురించి అవగాహన పెంపొందించడానికి ఒక బృందానికి లీడర్‌గా పనిచేశాను. ఆ సెంటర్‌లో బడ్జెట్ సవాళ్లని ఎదుర్కోవడానికి సెంటర్ అసోసియేట్ డైరెక్టర్‌తో కలిసి పనిచేశాను.


ఇతర రంగాలకూ సేవలు
నాసాలోనే కాకుండా ఇతర రంగాల్లో అంటే క్లీవ్‌లాండ్ హాస్పిటల్‌కి సాంకేతికంగా సమాచారాన్ని అందించేందుకు కొత్త ప్రక్రియలను ఆరోగ్య సేవా పరిశ్రమకి ఇచ్చాను. నాసా సెంటర్‌లోని ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, మేనేజర్లకి ఉపయోగపడే వెబ్ టెక్నాలజీ, డేటా మేనేజ్‌మెంట్, వ్యవస్థాగత అన్వేషణ ప్రక్రియలు పెంపొందించేందుకు పనిచేశాను. గూగుల్, ఐబియంతో కొత్త అన్వేషణ ప్రక్రియలు, కొత్త సాంకేతిక విజ్ఞానంలో భాగస్వామ్యం నెలకొల్పాను. నాసా సెంటర్లోని పరిశోధన, సైన్స్, అంతరిక్ష శోధన, ఏరోనాటిక్స్ వివిధ భాగాల మధ్యన అవగాహన పెంపొందించడానికి కృషి చేశాను.


రెండు సంతోషాలు...
గత మూడు ఏళ్లుగా చేస్తున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో సమస్యలు వచ్చి ఎంతో మంది ఎంతో సమయం వెచ్చించి చేసిన పని అంతా దండగవుతుందేమో అనే పరిస్థితి వచ్చింది. కానీ ఈ మధ్యనే అన్ని సమస్యలతో ఆగిపోతుందేమో అనుకున్న ప్రాజెక్టు మళ్లీ కొనసాగుతుందని తెలియగానే చాలా ఆనందం వేసింది. దామెదర్ రెడ్డికి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోషన్ వచ్చినపుడు కూడా చాలా సంతోషం వేసింది. ఆయన నాసాకి అతి ముఖ్యమైన ప్రాజెక్టులు చేశారు. ఆయన ప్రతిభకి గుర్తింపు వచ్చినందుకు సంతోషించానే కాని ఆ సంతోషంలో తను క్లీన్‌లాండ్‌కి వెళ్లి ఉండాలి అనే విషయం కూడా గుర్తు రాలేదు. అక్కడ కొన్నాళ్లు పని చేశాక మళ్లీ లాంగ్లీరీసెర్చ్ సెంటర్‌కి వచ్చేశారు.


ఇదీ ఇప్పటి నేను...
విరామం అన్నది లేకుండా పనిచేశాను ఇన్నాళ్లూ కాని ఈ మధ్య కొన్ని రోజులు ఇంటి నుంచి పనిచేస్తున్నాను. అదీకాక మరీ ఒత్తిడి కలిగించే విషయాలు పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న విషయాల్లో మార్పులు చేసుకున్నా నా ఉద్యోగంలో మూడు ముఖ్యమైన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలోనే నాకు సంతృప్తి ఉంది. వాటిలో మొదటిది నాతో పనిచేసేవారి గురించి పట్టించుకోవడం. వాళ్లు మానసికంగా బాగుంటేనే చేసే పనిపై దృష్టి పెడతారు. అలాగే వాళ్లకి చాలెంజింగ్ పనులివ్వడం, ప్రతిభకి తగ్గ పనిని ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రెండోది బడ్జెట్‌ని సరిగా బాలెన్స్ చేయడం. మూడోది కొత్తగా వచ్చే సాంకేతిక రిజ్ఞానంతో పనిచేయడం. ఇది ఎంతో ముఖ్యమైనది. అలాగే నాకెంతో ఇష్టమైనది.


నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు మా పెద్దబాబు పసివాడు. ఇప్పుడు వాడు డాక్టర్, అమెరికన్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. తనకి ఇద్దరు పాపలు. చిన్నబ్బాయి ముందు ఇంజనీరింగ్ చదివినా సర్జన్ కావాలని ఉండేది వాడికి. అందుకని మళ్లీ మెడిసిన్ చదివాడు. మే నెలలో గ్రాడ్యుయేట్ అయ్యాడు. రెసిడెన్సీ చేస్తూ క్యాన్సర్ సర్జరీలో స్పెషలైజేషన్ చేస్తాడు. చిన్న బాబుకి తెలుగమ్మాయితో నిశ్చితార్థం అయ్యింది. వ చ్చే ఏడాది పెళ్లి చేస్తాం. కెరీర్ ముఖ్యమే అయినప్పటికీ కుటుంబం అంతకంటే ముఖ్యం నాకు. పిల్లలతో చాలా సన్నిహితంగా ఉంటాను. మన సంస్కృతి, సంప్రదాయాలంటే మాకు చాలా ఇష్టం. ఆ పద్ధతుల్లోనే పిల్లల్ని పెంచాం. మా పెద్దబ్బాయి పెళ్లి భారతీయ సంప్రదాయం ప్రకారం, చర్చిలో వారి పద్ధతి ప్రకారం కూడా చేశాం. మా పిల్లలిద్దరూ ఇప్పటికీ నాకు రెగ్యులర్‌గా ఫోన్ చేసి అన్ని విషయాలూ చెప్తారు.


అవార్డులు
- నాసా ఇచ్చే అసాధారణమైన ప్రతిభా మెడల్


- వై2కె, ఆర్థిక పద్ధతి, శాస్త్ర సమాచార పద్ధతి, సంస్కృతి మార్పు వంటి అనేక షయాల్లో నాసా టీమ్ లీడర్‌షిప్ అవార్డ్‌లు వచ్చాయి


పనిని తగ్గించుకోవడం వల్ల చాలా మార్పు కనిపిస్తోంది. యోగా చేస్తే మనసు, శరీరం రెండూ రిలాక్స్ అవుతాయి. స్నేహితుల్ని అప్పుడప్పుడు ఇంటికి ఆహ్వానించడం, వాళ్లతో సంతోషంగా గడపడం వల్ల కూడా మనసు రిలాక్స్ అవుతుంది. వార్తా పత్రికలు చదువుతాను. పుస్తకాలు, నవలలు కూడా బాగా చదువుతాను. మా నాన్న వై.బి.వి రమణారెడ్డి పుస్తకాలు బాగా చదివేవారు. రోజూ కాసేపు ఏదైనా చదివితేనే కాని ఆయన నిద్రపోయేవారు కాదు. నాన్నని చూసే నాకు పుస్తకాలు చదివే అలవాటయ్యింది.
- కనకదుర్గ (అమెరికా నుంచి)
* Andhra Jyothy

Monday, June 25, 2012

చంద్రబాల చేసిన తప్పేమిటి?


ఆమె ఎవరో రెండు రోజుల క్రితం వరకు ఎవరికీ తెలియదు. తన ఉద్యోగమేదో చేసుకుంటూ, ఖాళీ సమయంలో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటూ తన మానాన తాను బతుకుతున్న ఒక సాధారణ మహిళ. కాని ఈ రోజున రాష్ట్రమంతటా ఆమె గురించే చర్చ. వాసిరెడ్డి చంద్రబాల ఎవరంటూ ఒకటే ఆరాలు. దీనికంతటికీ కారణం జగన్ అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సిబిఐ జెడి లక్ష్మీనారాయణకి ఆమె సహాధ్యాయి కావడం. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన ఈ వ్యవహారం గురించి కొందరు ప్రముఖుల అభిప్రాయాలివి...

అసభ్యం - అనాగరికం
- ఓల్గా, స్త్రీవాద రచయిత్రి

ఈ విషయం గురించి మాట్లాడాలంటే అసభ్యం, అనాగరికం అనే రెండు పదాలే చాలనిపిస్తుంది. ఆమెను అన్యాయంగా వార్తల్లోకి లాగి పూర్తిగా అభద్రతలోకి నెట్టివేశారు. ఒక మహిళను ఇలా లాగడం వల్ల కుటుంబపరంగాను, పనిచేసేచోటా, బంధువులు, స్నేహితుల వద్దా ఎన్ని అనవసర ప్రశ్నలు ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది? నాగరికంగా, గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మీడియాకి. వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉండకూడదు. అందుకే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు మీడియా ప్రత్యేకంగా ఒక నియమావళిని రూపొందించుకోవాలి. అంతెందుకు ఈ విషయంలోకి బయటి వాళ్లనే కాకుండా స్వయానా మీడియా వాళ్లని కూడా లాగారు కదా.

అది వేధింపులకు గురిచేయడమే...
- వాసుదేవ దీక్షితులు, ఆంధ్రప్రభ పూర్వ సంపాదకులు

లీడ్ ఇండియా వంటి సంస్థలో పనిచేస్తూ యువతీ, యువకుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతున్న చంద్రబాల విషయంలో ఇలా వ్యవహరించడం ఆమెను వేధించడమే. చంద్రబాల స్వేచ్ఛను హరించి, అపఖ్యాతి పాల్జేయడమే. సిబిఐ జెడీ లక్ష్మీనారాయణతో ఎవరైనా ఎందుకు మాట్లాడకూడదు? సమాధానం చెప్పగలరా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఆ వర్గం మీడియా. ఇదంతా మైండ్‌గేమ్ మినహా ఇంకేమీ కాదు. ఏమీ లేని సమయంలో ఏదో జరిగిపోతోందని చెప్పడానికి వాళ్లు ఆడిన ఆట ఇది. దాంట్లోకి ఒక స్త్రీని లాగడం హేయమైన సంస్కృతి.

చంద్రబాల సిబిఐ జెడీ లక్ష్మీ నారాయణతో మాట్లాడటమే తప్పా... ఒక వేళ ఆ సంభాషణలో ఏదైనా కుట్ర గురించి మాట్లాడుకున్నారని అనుమానం వస్తే... ఆ టేపులు బయటపెట్టాలి కదా. మరి అలా చేయలేదేం. మాట్లాడారు...మాట్లాడారు చివరి వరకు ఇదే. చంద్రబాల అందుబాటులోనే ఉన్నారుగా..ఆమెతో మాట్లాడితే విషయం తెలియదా? ఆమె ఏం చెప్తారో వినాలా? లేదా? అలా కాకుండా వెకిలి పేరడీలు, చౌకబారు మాటలు ప్రచారం చేయడం ఎవరు నేర్పిన నీతి.

మహిళల భద్రతతో పనిలేదా?
- సంధ్య, పిఒడబ్ల్యు నాయకురాలు

చంద్రబాల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. వారాంతపు సెలవుల్లో లీడ్ ఇండియా అనే సంస్థ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న సాధారణ మహిళ. అలాంటావిడ్ని ఈ వ్యవహారంలోకి తీసుకురావడం దారుణం. అమ్మమ్మ వయసులో ఉన్న స్త్రీని వాళ్ల రాజకీయాలకోసం భ్రష్టు పట్టించే ప్రయత్నం ఎంత ఘోరం? జెడి లక్ష్మీనారాయణపై బురద చల్లడం కోసం రాజకీయాలతో, మీడియా యుద్ధాలతో, మనీల్యాండరింగ్‌తో, అక్రమాస్తులు, అక్రమపెట్టుబడులతో ఏ మాత్రం సంబంధంలేని వ్యక్తిని తీసుకు రావడం దుర్మార్గం, చవకబారుతనం.

నేలబారు ఆలోచనలు చేస్తున్నారనిపిస్తోంది ఈ వ్యవహారమంతా చూస్తుంటే. ఎబిఎన్‌కి గాని, ఎండి రాధాకృష్ణ గారికి గాని లీడ్ ఇండియా పనుల కోసం ఓ రెండు సార్లు ఫోన్లు చేస్తే ఎన్నో కాల్స్ చేసినట్టు చెప్పడం ఏమిటి? ఇదంతా గమనిస్తే వైఎస్పార్సీపి వాళ్లు ఎంత నిరాశానిస్పృహల్లో ఉన్నారో అర్థమవుతోంది. లేకపోతే ఒక మధ్యతరగతి మహిళను ఈ విధంగా మీడియాకెక్కించే ప్రయత్నం వేరెవరూ చేయరు. వాళ్లు ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. వాళ్ల పార్టీకీ మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతర మహిళల భద్రతని, గౌరవాన్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్న వీళ్లు తమ పార్టీ మహిళా ఓటర్లను ఎలా పట్టించుకోగలుగుతారు.

ఇక్కడ మీకో విషయం చెప్పాలి సాక్షి మీడియాలో చంద్రబాల స్టోరీ వేసేందుకు గాను ఆ మీడియా రిపోర్టర్ ఒకరు చంద్రబాల ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నంత పనిచేసి మరీ ఆవిడ ఫోటో పట్టుకెళ్లారు. అలా తీసుకెళ్లిన ఫోటోని క్యారికేచర్ చేసి వాడారు. చంద్రబాల కుటుంబంతో నాకు 30 ఏళ్లుగా పరిచయం ఉంది. నైతిక విలువలతో, సామాజికస్పృహతో ఉన్న కుటుంబం వాళ్లది. ఈ వ్యవహారాల వల్ల వాళ్ల కుటుంబం చాలా బాధపడుతోంది. జెడి లక్ష్మీనారాయణకి ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరితో పరిచయం ఉంది. వాళ్లంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్.

వైఎస్సార్‌సీపికి ఉపఎన్నికల్లో వచ్చిన గెలుపు అహంకారాన్ని తెచ్చిపెట్టింది. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. జెడి మీద బురద చల్లడానికి ఈవిడ్ని పావుగా వాడడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఆయన మీద వాళ్లకున్న వ్యక్తిగత ద్వేషానికి ఎవరినంటే వాళ్లని రోడ్డు మీదకి ఈడుస్తారా. ఆ చానల్ గాని, పార్టీ గాని మహిళలకి ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పందించి స్త్రీ విలువకి, గౌరవానికి సంబంధించిన అంశంగా దీన్ని పరిగణించాలి. ఆమె భద్రతకి, ఆత్మగౌరవానికి ముప్పు కలిగించే పని జరిగింది కాబట్టి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి.

అన్ని విధాలా దిగజారుడుతనం
- వరవరరావు, విరసం

ఒక మహిళ ఒక పురుషినితో మాట్లాడినందుకు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి తీసుకురావడం దారుణం. చంద్రబాల తనకు జెడీ లక్ష్మీ నారాయణ క్లాస్‌మేట్ అని, పూర్వ విదార్థుల సమ్మేళనం అవసరాల రీత్యా ఆయనను సంప్రదించానని చెప్పాల్సిరావడంఎంతో బాధాకరమైనది. ఒక పురుషుడు, స్త్రీ మాట్లాడుకుంటేనే తప్పా? తల్లీ, కూతురు, అన్నా, చెల్లీ మాట్లాడుకున్నా ఇలాగే సంజాయిషీ ఇచ్చుకోవాలా? మనం ఏ వ్యవస్థలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి.

ఏదో ఒక కంపెనీకి ప్రయోజనం చేకూర్చడానికే ఇప్పుడు మీడియా పనిచేస్తోంది. శ్రీశ్రీ ఎప్పుడో చెప్పారు "పత్రికలు..పెట్టుబడిదారుల విష పుత్రికలని''. అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా విశ్వరూపం చూసే అవకాశం ఆయనకు లేకపోయింది. చూసి ఉంటే ఇంకేమి అనేవారో. మీడియా కూడా వ్యవస్థలో భాగమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ఏమిస్తే ...రేపు అదే మనకు అంటే సమాజానికి అందుతుంది. అందుకే మనందరం సమాజంలో భాగమని గుర్తించాలి. నిజాలు చెప్పడం ఒక పద్ధతి. అబద్దాన్ని నిజం చేయడానికి ఒకరి వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం ప్రమాదకరం. చంద్రబాల -జెడీ లక్ష్మీనారాయణల పరిచయాన్ని తప్పుగా ప్రచారం చేయాలనుకోవడం ఈ కోవకిందకే వస్తుంది.

ఇప్పుడు ఫోన్లు వచ్చాయి. సోషల్ నెట్‌వర్కు సౌకర్యం పెరిగింది. ఇలాంటి పరిస్థితిలో వ్యక్తుల పరిచయాలను రాజకీయ ప్రయోజనాలకో, మరో దానికో ఎలా వాడుకుంటారు? ఎవరితో మాట్లాడాలో ఆమె ఇష్టం. అలా కాకుండా చంద్రబాల ఫలానా వారితోనే మాట్లాడాలని ఏమైనా రూలు పెడదామా? ఎవరికైనా ఎవరితోనైనా మాట్లాడాకునే స్వేచ్ఛ ఉంది. మీడియా ఇది గమనించాలి. అలా కాకుండా ఆమెను కించపరిచేలా పేరడీలు, జోకులు సృష్టించడం దిగజారుడుతనం అవుతుంది.

ఇదేనా స్త్రీలను గౌరవించే సంస్క ృతి?
- ఘంటా చక్రపాణి, రాజకీయ విశ్లేషకులు

ఈ మొత్తం ఎపిసోడ్‌లోకి చంద్రబాలను లాగడం అనైతిక రాజకీయాలకు పరాకాష్ట. రాజకీయ సంస్థల ప్రయోజనాల కోసం మీడియా నడిపిన కుట్రకు ఆమె ఎందుకు బలి కావాలి? ఇదేనా స్త్రీలను గౌరవించే మన సంస్కృతి. అసలు మీడియాకు స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ నుంచి దక్కిందే. దాన్ని అడ్డంపెట్టుకుని ఇంకొకరి వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా హరిస్తారు.

చంద్రబాలకు స్త్రీగా సమాజంలో ఒక హోదా ఉంది. గౌరవం ఉంది. అవేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఆమె ఒక పురుషునితో మాట్లాడటం తప్పయిపోయిందా? ఆమె మాట్లాడిన వ్యక్తి ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థలో పనిచేస్తుంటే మాత్రం వారి సంబంధం అనైతికమైనదా? ఇదేం సంస్కృతి. అది తప్పని చెబుతున్నారంటే...సమాజంలోని మానవసంబంధాలన్నీ అనైతికమని చెప్పడమేగా? ఈ ధోరణి సమాజాన్ని ఎటువైపు నడిపిస్తుంది. సమాజం మొత్తం కలవరపడాల్సిన విషయమిది.

మీడియా నిజాలను వెలుగులోకి తీసుకురావాలి. అంతేకాని రాజకీయపార్టీల ప్రయోజనాల కోసం ఎంతకైనా బరితెగించాలా? విచారణ జరపడానికి విచారణ సంస్థలున్నాయి. శిక్షించడానికి న్యాయ స్థానాలున్నాయి. వీటన్నిటినీ వదిలి ఒక స్త్రీపై పడటం ఎక్కడి న్యాయం. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని చాలా బిల్లులను వెనక్కుపంపిన చరిత్ర ఉంది. అదంతా విస్మరించి కేవలం రాజకీయపార్టీల, వ్యక్తుల ప్రయోజనాలకోసమే చంద్రబాలను నడిబజారులోకి ఈడ్చడం నాగరిక ప్రపంచంలో హర్షణీయమైన చర్యకాదు.

- ప్రస్తుతం పరిస్థితి ఎలా మారిందంటే...ఘోరమైన తప్పులు చేసిన వ్యక్తి సమాజం ముందు నిల్చొని తన ప్రవర్తన సమర్ధించుకోవడానికి "అందరూ తప్పులు చేస్తున్నవారే కదా'' అని చెప్పినట్టుగా ఉంది. ఇలాంటి ఒక చెత్త వాదనకు బలాన్నివ్వడానికే వ్యక్తుల స్వేచ్ఛను బలి చేయడానికి సిద్ధపడిపోయారు. చంద్రబాల కావచ్చు, మరొకరు కావచ్చు ఎవరి విషయంలోనైనా ఇలా జరగడం సమాజానికే శ్రేయస్కరం కాదు.

వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు
- దేవి, సామాజిక కార్యకర్త

మహిళలకి సంబంధించి వివాదాస్పదమైన వార్తలు ప్రసారం చేసేటప్పుడు వాళ్ల ముఖాన్ని చూపించకూడదని, వాళ్ల పేర్లు వెలువరించకూడదని నియమం ఉంది. కాని సాక్షి చానల్‌లో చంద్రబాల విషయంలో ఈ విలువలేవీ పాటించలేదు. ఆవిడకి సంబంధించి ఎటువంటి కేస్‌లు లేవు. అయినప్పటికీ ఊహాగానాలు చేసి స్టోరీ అల్లేశారు. ఒకవేళ ఆమె వల్ల వాళ్లెవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే ఆమెపై వాళ్లు కేసు పెట్టవచ్చు. అంతేకాని వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకుని ఆవిడ స్వేచ్ఛను భగ్నం చేస్తూ... ఆవిడ ఎవరెవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు అంటూ ఫోను జాబితాను వెలువరించడమనేది అమానుషమైన చర్య. ఇలాంటి విషయాల్లో సాధారణంగా ఏమవుతుందంటే ఆడవాళ్లు బయటికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారంటే రకరకాల ఊహాగానాలు జరుగుతాయి. ఆమె ప్రవర్తనని, శీలాన్ని శంకించే అవకాశం ఉంది.

ఈ మధ్య మీడియాలో సున్నిత విషయాలను పట్టించుకోకపోవడం సర్వసాధారణమైంది. ఊహాగానాల ప్రసారాలకు అడ్డుకట్ట వేయాలి. చంద్రబాల విషయాన్ని ఎలాగైనా ప్రసారం చేయాల్సిందే అని వాళ్లనుకుంటే కనుక ఒక అపరిచిత మహిళ అనో, ఒక మహిళ అనో చెప్పి ఉండాల్సింది. అలా కాకుండా ఆమె పేరు, ఫోను నంబరుతో సహా ఇచ్చి ఆమె ఫోటోను ప్రసారం చేయడం దారుణమైన చర్య. నేరపూరితమైన చర్యగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు వీళ్లకెవరు ఇచ్చారు. ఈ విషయంపై ఆమె కావాలనుకుంటే క్రిమినల్ కేసు పెట్టొచ్చు.

Friday, April 6, 2012

ఇంటికెళితే అమ్మనే ....


ఏ శాఖలో పనిచేస్తున్నా పూనం మాలకొండయ్య తన ప్రత్యేకత చాటుకుంటుంటారు. నికార్సయిన పనితనంతో సంచలనం రేపుతుంటారు. ప్రస్తుతం ఎపిపిఎస్సీ సెక్రటరీగా చేస్తున్న ఆమె ఎబీఎన్‌లో ఇల్లాలి ముచ్చట్లు కార్యక్రమంలో పాల్గొని ఇలా మాట్లాడారు...

మీరు చాలా కఠినమైన అధికారి అని పేరుంది. ఇంట్లో కూడా అంతే కఠినంగా ఉంటారా?
ఇంట్లో అధికారాలు ఉండవు. ఆత్మీయతలు ఉంటాయి. ఆఫీసుకు పూర్తిగా భిన్నమైన వాతావరణం అక్కడ ఉంటుంది. భర్త, పిల్లలు, వారితో ఉంటే వచ్చే ఆనందం అన్నీ ఉంటాయి. నేను ఇంట్లో పూర్తిగా అమ్మనే. ఒక అమ్మ పిల్లల్ని ఎలా చూసుకుంటుందో అలాగే నేనూ ఉంటాను. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి మెడిసన్ చదువుతోంది. అబ్బాయి లా చదువుతున్నాడు.

ఒక తల్లిగా పిల్లల్ని ఎలా పెంచాలంటారు?
పిల్లలు జీవితంలో స్థిరపడేలా తీర్చిదిద్దితే చాలని చాలామంది అనుకుంటారు. కాని వాళ్లు సమాజం గురించి ఆలోచించేలా కూడా ప్రోత్సహించడం అవసరమని నేను అంటాను. పిల్లల్ని అలాగే పెంచాలని కూడా చెబుతాను.

మీ బాల్యం ఎలా గడిచింది?
నాన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగి. దాని వల్ల నా బాల్యం చాలా చోట్ల నా బాల్యం గడిచింది. అన్నిటికంటే తమిళనాడులోని కోయంబత్తూరులో ఎక్కువకాలం ఉన్నాము. నా పాఠశాల, కాలేజీ రోజులన్నీ కోయంబత్తూరులోనే.

గృహిణి పాత్రను ఎలా పోషిస్తారు?
నాకు వంటలంటే చాలా ఇష్టం. సెలవు రోజుల్లో రకరకాల వంటలు చేస్తాను.

ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు, ఇంట్లో గృహిణిగా ...రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు?
ఆఫీసును ఇంటికి తీసుకెళ్లను. ఇంట్లో అడుగుపెట్టగానే మారిపోతాను. నిజానికి బ్యాలెన్స్ చేయడమంటూ ఏమీ ఉండదు. ఆఫీసులో ప్రతి నిమిషం సద్వినియోగం చేస్తే బయటకొచ్చేటప్పుడు ప్రశాంతంగానే ఉంటాం. అప్పుడు ఇంట్లో కూడా హాయిగా ఉంటుంది.


ఇప్పుడు స్వేచ్ఛ, సమస్య రెండూ ఉంటున్నాయి. ఇది అభివృద్ధా? వెనకబాటు తనమా?
అమ్మాయిలకు ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. నా దృష్టిలో స్వేచ్ఛ అంటే బాధ్యత. ఇంట్లో, సమాజంలో మనకు చాలా బాధ్యతలు ఉంటాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించాలి. లేదంటే రకరకాల సమస్యలు వస్తాయి. బాధ్యతాయుతంగా ఉండాలన్నది స్త్రీలకే కాదు ఎవరికైనా వర్తిస్తుంది.

స్త్రీలు తమకు ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?
గతానికి ఇప్పటికి చాలా మార్పులొచ్చాయి. ఏ రంగంలో తీసుకున్నాసరే స్త్రీలు కనిపిస్తున్నారు. సాంకేతిక పరమైన స్కిల్స్ వారిలో ఉంటున్నాయి. అయినప్పటికీ సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. సమస్యలు ఎదురైనపుడు ప్రతిభ ఒక్కటే సాయపడగలదు.

విదార్థినుల డ్రాపవుట్స్ తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేయాలి?
కుటుంబానికి ఆర్థిక స్వేచ్చ ఉంటే సగం వరకు డ్రాపవుట్స్ తగ్గుతాయి. ఈ డ్రాపవుట్స్ కూడా ఒక్కో దశలో ఒక్కో రకంగా ఉంటున్నాయి. పాఠశాలలు అందుబాటులో ఉంటే చదవడానికి వెళుతున్నారు. అదే ఐదారు కిలోమీటర్ల దూరానికి నడిచివెళ్లాలంటే మాత్రం క్రమంగా చదువుకు దూరమవుతున్నారు. దీంతోపాటు పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాలు వలన కూడా డ్రాపవుట్స్ ఎక్కువవుతున్నాయి.

తరాలమధ్య ఎలాంటి తేడాలున్నాయి? నేటి తరంపై మీ అభిప్రాయం?
ఇప్పటి తరానికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. తమను తాము రక్షించుకోగలరు. ప్రతిభ అపారం. గతంలో నేర్చుకోవడానికి ఇన్ని అవకాశాలు లేవు. ఇప్పటి తరానికి అవి పుష్కలం. వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. నేనైతే ఈ తరానికి హ్యాట్సాఫ్ అంటా.

స్త్రీని నిర్వచించమంటే?
'ఆమె' ఒక క్రియేటర్. దేన్నయినా నిర్మించగలదు. కూలగొట్టనూ గలదు. కుటుంబంలోనూ, సమాజంలోనూ ఆమే కేంద్రబిందువు. ఏదైనా నాగరికతను నిర్వచించాల్సి వస్తే ఆ కాలంలో సమాజం స్త్రీని ఎలా చూసేది అన్న విషయాన్ని గమనిస్తే చాలు. స్త్రీ పాత్ర అలాంటిది.

మరి స్త్రీల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి?
నేననుకోవడం అర్బన్ ప్రాంతంలోనే ఆత్మహత్యలు ఎక్కువని. చదువుకున్న వారు కూడా చిన్నవిషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశమే అందుక్కారణం. సమస్యలను విశ్లేషిస్తే ఎలాంటి చెడూ జరగదు. కాని చదువుకున్న వారు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువుకొని ఏమీ చేయలేకపోతున్నామే అనే బాధతో చనిపోయేవారు, చదువుకోకుండానే సమాజంలో నెట్టుకొస్తున్న చాలామందిని చూసి తెలుసుకోవాలి. అనాథ శరణాలయాల్లోనూ, వృద్ధాశ్రమాల్లోనూ ఎంతోమంది జీవిస్తుంటారు. వారి జీవితాలు గమనించి సహాయం చేయగలిగితే ఆనందంతోపాటు ఎలా జీవించాలో అర్థమవుతుంది.

ఎన్నో మంచి విషయాలు చెప్పగలిగే మీరు మీడియాకు దూరంగా ఉంటారెందుకు?
నా పని నేను చేసుకుపోతూ ఉంటాను. ముఖ్యమైన విషయాలైతే మీడియా ముందుకు వస్తాను. అంతే. అయినా మీడియాను ఎవరూ దూరంగా ఉంచలేరు. ఏదైనా విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి మీడియా అవసరం కదా. 

ఇంటర్వ్యూ : శ్వేత

Monday, March 14, 2011

రాష్ట్రం తాకట్టు ?

Takattuపరిశ్రమలు, సెజ్‌లు, ఓడ రేవులు, థర్మల్‌ ప్రాజెక్టుల పేరుతో పేద రైతులు, దళితలకు చెందిన లక్షలాది ఎకరాల భూము లను సర్కారు ప్రైవేట్‌కు ధారాదత్తం చేసింది. పచ్చని పంట పొలాలు, దళితులకిచ్చిన అసైన్డ్‌ భూములు, అటవీ భూములు, ఏజెన్సీ ప్రాం తంలోని అడవిబిడ్డల భూములు, తీరప్రాంత మత్య్సకారుల భూముల న్నింటిని పలు ప్రైవేటు సంస్థలకు అప్పగిం చింది. లక్షలాది ఎకరాల భూములను శ్రీకా కుళం నుంచి చిత్తూరు వరకు వ్యూహాత్మకం గానే కాంగ్రెస్‌ సర్కార్‌ పరిశ్రమల పేరుతో తన అనుయాయులైన ప్రైవేట్‌ యజమాను లకు నామమాత్రం ధరలకు దోచిపెటింది.

పేదల ప్రయోజనాలు ఏమాత్రం పట్టకుండా, మానవతాదృక్పథంతో వ్యవహరించకుండా అడుగడుగునా చట్టాలకు, నిబంధనలకు నీళ్ళు వదిలి ప్రైవేటు భూదాహాన్ని తీర్చింది. ఆరేళ్ళుగా సాగు తున్న భూసంతర్పణపై ఎన్ని విమర్శలు చెలరేగినా వాటన్నిం టికి ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. న్యాయవివాదాలు తలెత్తినా పెట్టుబడి వర్గాలకు సర్కారు దాసోహంగా వ్యవహరిస్తున్నారు. గొప్పలకు పోయి అనేక ప్రాజెక్టులకు భూములు కేటాయించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయనే భ్రమలు కల్పించిన ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట సామాన్యులను రోడ్డు పాలు చేసింది.

పేదల నుంచి తీసుకున్న భూములకు సైతం సరైన నష్టపరిహారం చెల్లిం చలేదని బాధితులు ఇప్పటికీ నెత్తినోరు బాదుకుంటు న్నారు.పేదలు, రైతుల కుటుంబాలను చిన్నా భిన్నం చేసి.. పచ్చని పొలాలను ప్రత్యేక ఆర్థిక మండళ్ళు(సెజ్‌), పారి శ్రామిక పార్కులకు కేటాయించి సంవత్సరాలు గడుస్తున్నా.. ఉపాధి కల్పించే ప్రాజెక్టు ఏదీ రాకపోవడంతో జనం బిత్తరపోతున్నారు. ఉపాధికి సంబంధించి స్థానిక ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో నిలదీసి ప్రశ్నిస్తున్నా సరైన సమాధానాలు చెప్పలేని పరిస్థితి. ఆరేళ్ళుగా కాంగ్రెస్‌ సర్కార్‌లో కొందరు పెద్దలు చేసిన ఏకపక్ష నిర్ణయాలకు తమను బాధ్యులను చేయడంపై స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా మండిపడుతున్నారు.

సర్కారుకు వాన్‌పిక్‌ గండం

తాజాగా స్థానిక పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. ఓడ రేవులు, సెజ్‌లకు కేటాయించిన భూములు, విద్యుత్‌ థర్మల్‌ ప్రాజెక్టులకు కేటాయించిన భూమల వ్యవహారంపై అసెంబ్లీ, శాసన మండలి అట్టుడికిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాల్లో వాన్‌పిక్‌కు కేటాయించిన భూములపై స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అసెంబ్లీలోనే ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. వాన్‌పిక్‌ దోపిడికి వ్యతి రేకంగా ఆయన సభలో ఆడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి సైతం సంతృప్తికరంగా సమాధానం ఇవ్వ లేక నీళ్లు నమలడం తప్ప మరోదారి లేకుండాపోయింది.

చివరికి సభలో దీనిపై సీఎం స్పందిం చాల్సి వచ్చింది. పరిస్థితుల తీవ్రతను ఇప్పటికే గమనిస్తున్న సీఎం రాష్ట్రంలో సెజ్‌లు, ఇతర పరి శ్రమలకు కేటాయించిన భూములతోపాటు.. ఓడరేవులకు కేటాయించిన భూములనూ పునః సమీక్షిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వ భూసేకరణతో దెబ్బతిన్న నిర్వాసితులను సముచిత రీతిలో ఆదుకుంటామని కూడా చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు పరిశ్రమలు, సెజ్‌లు పేరుతో సాగిన భూ కేటాయింపులపై నిజాలు నిగ్గు తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుచేస్తామని సీఎం తెలిపారు. ఆరేళ్ళ పాలనలో భూ కేటాయిం పులపై సీఎం స్పందనను కొన్ని రాజకీయపార్టీలు స్వాగతిం చాయి.

అసైన్డ్‌ భూములుసైతం ...
దళితులకు, భూములేని పేదలకు కేటాయించిన అసైన్డ్‌ భూములను కూడా ప్రభుత్వం పరిశ్రమల పేరుతో పారిశ్రామిక వేత్తలకు అప్పగించింది. రాష్ర్టంలోని సెజ్‌లు, ఓడరేవుల కోసం వేలాది అసైన్డ్‌ భూములను ప్రభుత్వం పేదల నుంచి బలవంతంగా గుంజుకున్నది. తీరా.. బాధిత పేదలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... అసైన్డ్‌ భూములపై హక్కులు ప్రభుత్వా నికే ఉంటాయని, ఎవరికైనా అసైన్డ్‌ భూములను కేటాయిస్తే అది వారికి ఉపాధి కల్పించేందుకు మాత్రమే తప్ప, వారికి హక్కులుకల్పించినట్లు కాదని సర్కారు వాదిస్తున్నది.

అసైన్డ్‌ భూములను గతంలో ప్రభుత్వమే దళితులకు, భూమిలేని పేదలకు ఇచ్చింది. ప్రస్తుతం అవసరం వచ్చింది కాబట్టి ప్రభుత్వమే వాటిని వెనక్కి తీసుకుంటుం దని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదు పాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఐఐసీ) అధినేతగా పనిచేసిన ఓ ఉన్నతాధికారి బాధిత నిరాశ్ర యులతో చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కేవలం కాకినాడ సెజ్‌ పరిధిలో పరిశ్రమల పేరుతో అధికారికంగా 12 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో అసైన్డ్‌ భూములే 2,500 ఎకరాలు ఉండడం విశేషం. అంతేకాకుండా కాకినాడ సెజ్‌ యాజ మాన్యం స్థానికంగా ఉద్రికత్త పరిస్థితులు సృష్టించి.. పేద రైతులకు చెందిన పచ్చని పొలాలనుసైతం కారుచౌకగా తీసుకుందన్న విమర్శలు లేకపోలేదు. కాకినాడ సెజ్‌ భూములపై ఇప్పటికే పెద్ద ఎత్తున న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి.

అదే విధంగా చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటీ సెజ్‌ కూడా పది వేల ఎకరాల వరకు పేదల నుంచి సేకరించింది. ఇక్కడ కూడా పేదల ఆధీ నంలో ఉన్న అసైన్డ్‌ భూములు పరిశ్రమల పేరుతో బలవతంగా లాక్కున్నట్లు విమర్శలు న్నాయి. ఇప్పటికే శ్రీసిటీ భూసేకరణపై కోర్టులలో ప్రైవేట్‌ కేసులు నడస్తున్నాయి. అంతే కాకుండా అత్యంత కీలకమైన తీర ప్రాంత భూములను కూడా చౌకగా కృష్ణపట్నం, వాన్‌పిక్‌ ఓడరేవు సంస్థ లకు ప్రభుత్వం ధారాదత్తం చేసింది. దీనిపై తీర ప్రాంత పేదలు, మత్స్యకారులు ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వ తీరులో ఏ మాత్రం చలనం లేకపోవడం విశేషం. తాజాగా ప్రస్తుత ముఖ్యమంత్రి వీటిపై పునఃసమీక్షిస్తానని పైకి చెబు తున్నప్పటికీ.. బాధిత ప్రజానీకానికి సీఎం మాటలు అంతగా నమ్మకం కలిగించడం లేదు.

అందరి దృష్టి ఆ రెండింటిపైనే
ఇప్పటి వరకు ఎమ్మార్‌ , రహేజా అక్రమాల్లో సీఎం వ్యవహారిస్తున్న తీరుపై సొంత క్యాబినేట్‌ మంత్రులు, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులే పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర సర్కారు ఆర్థిక ప్రయోజనాలనే నిలువునా తాకట్టుపెట్టిన ఎమ్మార్‌, రహేజాల వ్యవహారంలో ఇప్పటిదాకా జరగాల్సిన రాద్దాంతం జరిగింది, ఇకపై చాలు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవ హరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఆ రెండింటి విష యంలో నిగ్గుతేల్చి మిగతా వాటిపై చర్యలకు ఉపక్ర మించాలని సొంత పార్టీ నేతలు సవాల్‌ విసురు తున్నారు. అనంతపురం జిల్లాలో హిందూపురం సమీపంలో లేపాక్షీ హబ్‌ పేరుతో రాయలసీమకు చెందిన మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడికి వేల ఎకరాలను కట్టబెట్టింది.

లేపాక్షి హబ్‌ భూ కేటాయింపులన్నీ అప్పట్లో వ్యూహాత్మకంగా జరగ డం, ఈ కేటాయింపులపై నాడు ఎవ్వరూ నోరు మెదపని పరిస్థితి నెలకొని ఉండడంతో ప్రస్తుతం ఈ కేటాయింపుల లోగుట్టులన్నీ బహిర్గతం అవుతున్నాయి. సర్కారు పెద్దలు అనంతపురం జిల్లాలో సదరు సంస్థకు వేలాది ఎకరాలు నామ మాత్రపు రేటు సమర్పించారు. తాజాగా అక్కడ ప్రభుత్వ భూములు లేకపోవడంతో... లేపాక్షి హబ్‌కు కేటాయించిన భూముల్లోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిడిఎల్‌ మిసైల్‌ ప్రాజెక్టు రూ. 750 కోట్లతో చేపడుతుంది.

ప్రతిపాదిత ప్రాజెక్టు కోసం బిడిఎస్‌ సంస్థ కనీసం 600 ఎకరాలు అవ సరమని కోరుతున్నది. అదే విధంగా ఇసిఐఎల్‌, బిహెచ్‌ఇఎల్‌ సంయుక్తంగా సుమారు 700 ఎకరాల్లో రూ. 500 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ సంస్థ ప్రఖ్యాత సైన్స్‌ పార్కును అనంతపురం లేపాక్షి హబ్‌లో ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తో న్నది. దీనికోసం వెయ్యి ఎకరాలు కావాలని కోరుతున్నది. అదే విధంగా అమిత్ర యూనివర్సిటీ రూ. 150 కోట్ల ప్రతిపాదిత ప్రాజెక్టు కోసం 150 ఎకరాలు కోరుతున్నది. ఈరకంగా ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున లేపాక్షీ హబ్‌లో వేలాది ఎకరాల భూములను కోరడం విశేషం.

భూముల జాతీయకరణ
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఐఐసీ ద్వారా భూములు సేకరించి.. తదుపరి పియస్‌యూ, ఇతర సంస్థలకు భూములు కేటాయిస్తే.. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి వీలుపడుతోంది. తాజాగా రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లోని భూము లను పరిశ్రమలు, సెజ్‌లు, ఓడరేవుల పేరుతో ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించి ఆ తర్వాత ప్రభుత్వ పరం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాల రీత్యా ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసినట్లుగానే దేశంలో, రాష్ట్రంలోని ప్రైవేట్‌ పారిశ్రామిక పార్కులు,సెజ్‌ భూములను జాతీయం చేసే పరిస్థితి లేకపోలేదం టున్నారు. అది కూడా ఎంతోదూరంలో లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ మంత్రి ఒకరు ఘాటుగా స్పందించారు. కోస్తా తీరప్రాంత భద్రతపై ఇప్పటికే ప్రభుత్వానికి తమ ఆందోళన తెలియ చేశామని, రాష్ర్ట ప్రభుత్వం దీనిపై తీవ్రంగా దృష్టిసారించక పోతే కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని సదరు మంత్రి స్పష్టం చేశారు.

భూములు అడుక్కుంటున్న పీఎస్‌యూలు

వ్యూహాత్మకంగా పలు జిల్లాల్లో విలువైన భూములను ప్రయివేటు గద్దలకు సర్కారు పెద్దలు దారాదత్తం చేయడంతో తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ(పియస్‌యు)ల అవస రాలకు ప్రయివేటు సంస్థల నుంచి భూములు కోరాల్సిన దుస్థితి నెలకొంది. అంటే సర్కారు వద్ద ఉండాల్సిన ల్యాండ్‌ బ్యాంక్‌ను సైతం ప్రయివేటు సంస్థలకు దోచిపెట్టి ప్రభుత్వం జీరో ల్యాండ్‌ బ్యాంక్‌ స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు పిఎస్‌యు భూముల కోసం ప్రభుత్వమే ప్రైవేటు సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపరడాల్సి రావడం విశేషం. మౌలిక సదుపాయాలు ఇతరత్రా అభివృద్ధికే పెద్ద ఎత్తున ప్రైవేట్‌ సెజ్‌లు, పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం పైకి చెబుతున్నప్పటికీ కొన్ని లక్షల కోట్ల విలువ చేసే వేల ఎకరాలు వారుతన్నుకుపోతున్న విషయం మాత్రం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మరుగున పెడుతున్నది.

Sunday, January 9, 2011

మధ్యంతరమా? వస్తుందా?


ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఎంత కాలం ఉంటుం ది? రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు తప్పవా? ఈ రెండు ప్రశ్నలు ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో పరిపాలన దాదాపుగా అచేతనావస్థకు చేరుకుంది. దీనికి ప్రధాన కారణం, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళంతోపాటు, తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ మరో అయిదారు రోజులలో నివేదిక ఇవ్వవలసి ఉండటం! ఈ రెండు పరిణామాల వల్ల ప్రభుత్వ మనుగడపై పలు సందేహాలు నెలకొన్నాయి.

వాస్తవానికి శాసనసభ కు మధ్యంతర ఎన్నికలు రావాలని ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు కోరుకోవడం లేదు. మధ్యంతర ఎన్నికలు రావాలని కోరుకుంటున్నది, కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి న మాజీ ఎం.పి. జగన్మోహనరెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే. ఎందుకంటే ఎన్నికలు వస్తే తెలంగాణలో టి.ఆర్.ఎస్. గరిష్ఠ స్థాయిలో లాభపడే అవకాశం ఉండగా, సీమాంధ్రలో జగన్ ఎంతో కొంత లాభపడతారు.

అందువల్లే పరిస్థితులు కుదుటపడి పార్టీపై పట్టు వచ్చేవరకు, ఎన్నికలు జరిగే పరిస్థితి తలెత్తకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థి తి ఇటు తెలంగాణలో దిక్కుతోచని రీతిలో ఉండగా, సీమాంధ్రలో కూడా అంతంత మాత్రమే కనుక ఆ పార్టీ కూడా ఎన్నికలు కోరుకోవ డం లేదు.

'లక్ష్య' పేరిట విజయవాడలో జగన్ చేపట్టిన దీక్షకు ఎంతమంది ఎం.ఎల్.ఎ.లు సంఘీభావం ప్రకటించారన్న దాన్ని బట్టి మధ్యంతర ఎన్నికలు వస్తాయని అంచనా వేయలేని స్థితి! ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభ్యులు ఎటూ తేల్చుకోలేని డోలాయమానంలో ఉన్నారు. జగన్‌కు సంఘీభావం ప్రకటించిన వారంతా చివరి వరకు ఆయనతోనే ఉంటారన్న నమ్మకం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీతోనే ఉంటామని చెబుతున్న వారి ప్రకటనలనూ విశ్వసించలేని స్థితి.

నిజానికి పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రస్తుతం రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ఉదయం జగన్‌తో మాట్లాడితే, సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలుస్తున్నారు. ఈ పరిణామం వారి మానసిక స్థితికి అద్దం పడుతోంది. భారీ ఖర్చుతో విజయవాడ లో చేపట్టిన 48 గంటల లక్ష్య దీక్షకు ఆశించినస్థాయిలో జనం రాలేద న్న వార్తలు వచ్చాయి. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లాలో రెండవసారి జగన్ చేసిన పర్యటనకూ జనం పలుచబడినట్టు వార్తలు వచ్చాయి.

ఈ పరిస్థితి జగన్ వర్గాన్ని సహజంగానే ఎంతో కొంత నిరాశకు గురిచేసింది. కాలం గడిచే కొద్దీ జగన్ ప్రభావం బలహీన పడుతుందన్నది కాంగ్రెస్ ప్రముఖుల అంచనా. అదే జరిగితే, ప్రస్తు తం జగన్‌కు సంఘీభావం ప్రకటించినవారు కూడా మనస్సు మార్చుకునే అవకాశం ఉంది. మీడియా ప్రచారం ద్వారా జగన్ గురించి ఎంతో ఊహించుకున్న జనానికి ఆయన ప్రసంగాలు నిరాశ నే మిగిల్చాయి.

ఈ నేపథ్యంలో మున్ముందు జగన్ ఎటువంటి వ్యూహంతో కదులుతారు? ఆయనకు ప్రస్తుతం కనిపిస్తున్న జనాదర ణ చివరి వరకు మిగులుతుందా? అనే అంశాలు స్పష్టం అయితే గానీ మధ్యంతర ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది చెప్పలేం. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టి మధ్యంతర ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలన్నది జగన్ లక్ష్యం. ఈ కారణంగానే విజయవాడ సభలో ప్రసంగించిన ఆయన వర్గీయులు, రైతుల సంక్షే మం కన్నా, రాజకీయ విమర్శలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోయడానికి ప్రాధాన్యత ఇచ్చారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతానికి మైనారిటీలో పడిన విషయం వాస్తవం. అయితే జగన్‌కు సంఘీభావం తెలుపుతున్న వారంతా రాజీనామాల కు సిద్ధపడతారా? అన్నదీ సందేహమే. వీలైతే మరో రెండు మూడు నెలల్లో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచనతో జగన్ వర్గం ఉంది. అందుకు అవసరమైన బల సమీకరణకు చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తోంది. 50 నుంచి 60 మంది వరకు శాసన సభ్యులను కూడగట్టగల సత్తా ప్రస్తుతానికి జగన్‌కు ఉంది.

పరిస్థితి జగన్‌కు అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే ఈ సంఖ్య పెరగవచ్చు కూడా. కానీ ప్రస్తుతానికి 50 నుంచి 60 మంది శాసన సభ్యులు తమ సభ్యత్వాలను వదులుకొంటారా? అన్నది ప్రశ్నార్థకమే! రాజీనామా లు చేసి, జగన్ వెంట నడిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న ధీమా ఏర్పడితే తప్ప, వారెవ్వరూ ఆ పని చేయడానికి సిద్ధపడ రు. ఈ క్రమంలో సర్వే సంస్థలపై పలువురు ఆధారపడుతున్నారు.

జగన్ బలం ఎంత? అనే విషయం అలా ఉంచితే, రాజకీయంగా జగన్ బలపడే పరిస్థితి ఏర్పడకుండా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సహజంగానే కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో దాదాపు 40 మంది శాసనసభ్యులు ఉన్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగాలేనందున వారెవ్వరూ మధ్యంతర ఎన్నికలను కోరుకోరు. అలాగని నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్ద తు ఇచ్చే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీకి ఉండదు.

జగన్ బలం 60కి పరిమితమయ్యే పక్షంలో (ఇది ప్రస్తుతానికి గరిష్ఠం), ప్రజారాజ్యం-మజ్లిస్ శాసనసభ్యుల సంఖ్య ను కలుపుకొన్నా, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఇంకా దాదాపు 35 మంది శాసన సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. మధ్యంతర ఎన్నికలు తెచ్చుకుని ప్రధాన రాజకీయ పక్షాలైన తాము నష్టపోవడానికి కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు సిద్ధంగా ఉండవు కనుక ఏదో ఒక ఫార్ములా రూపొందే అవకాశం ఉంది.

తాము కనుమరుగై చంద్రశేఖరరావు, జగన్మోహనరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు లాభపడటాన్ని ఆ రెండు పార్టీ లు సహజంగానే జీర్ణించుకోలేవు. మధ్యంతర ఎన్నికలు వస్తే తెలంగాణలో 100 స్థానాలను కైవసం చేసుకోవాలని టి.ఆర్.ఎస్. అధినేత చంద్రశేఖరరావు అప్పుడే లెక్కలు వేస్తున్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం కాకుండా ఇప్పటికిప్పు డు ఎన్నికలు వస్తే, కె.సి.ఆర్ అంచనా వేస్తున్నట్లు, 100 స్థానాలకు కొంచెం కుడిఎడమగా టి.ఆర్.ఎస్. బలం పెరిగే అవకాశం కచ్చితం గా ఉంది. సీమాంధ్రలో పరిస్థితిని ప్రస్తుతానికి అంచనా వేయలేం.

ఈ నేపథ్యంలో ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు, జగన్మోహన్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా మారినా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ఇవ్వాలా? లేదా? అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ స్థానంలో మరే ఇతర పార్టీ ఉన్నా అదే పని చేస్తుంది. అటు సీమాంధ్రలో జగన్‌కు, ఇటు తెలంగాణలో కె.సి.ఆర్.కు లాభించే పని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకు చేస్తుంది? జగన్ ఇదివరకే సమైక్యాంధ్ర నినాదాన్ని చేపట్టినందున, రాష్ట్ర విభజ న జరిగితే సీమాంధ్రలో ఆయనకే లాభం చేకూరే అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఫలితంగా తెలంగాణ అంశం మరోమారు పీటముడి పడే అవకాశం ఉంది. సీమాంధ్రలో జగన్ ప్రభావం నామమాత్రమన్న నిర్ణయానికి వచ్చే వరకూ తెలంగాణ అంశాన్ని ఎటూ తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ నాన్చే అవకాశం ఉంది. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఏ సిఫారసులు చేస్తుందన్న విషయం అటుంచితే, అది ఇచ్చే నివేదికను పరిశీలించడానికి మంత్రుల కమిటీని నియమిం చి కాలయాపన చేయవచ్చు.

టి.ఆర్.ఎస్. అధినేత కె.సి.ఆర్. ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇటువంటి అనుమానాలకు ఊతం ఇస్తున్నాయి. ఉద్యమాల గురించి మాట్లాడకుండా ఆయన, ఎన్నికల గురించి, ఆ ఎన్నికల్లో సాధించవలసిన సీట్ల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ ధోరణితో తెలంగాణ ఇప్పట్లో రాదన్న అనుమానాలు తెలంగాణవాదుల్లో కలుగుతున్నాయి. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌వాదులతో పాటు, కరడుగట్టిన తెలంగాణవాదులు కూడా, ప్రైవేటు సంభాషణల్లో, ఇటువంటి సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చి రెండు ప్రాంతాలలో నష్టపోవడానికి కాంగ్రెస్ మాత్రం ఎందుకు సిద్ధపడుతుంది? జగన్ వ్యవహారం ఉండి ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేది.

ఈ విషయం అలా ఉంచితే, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత లు చేపట్టి నెల రోజులు గడిచాయి. కానీ ఇంతవరకు ఆయన అంతరంగం ఏమి టో ఆవిష్కృతం కాలేదు. తాను మొండి మనిషినని రుజువు చేసుకోవడానికి అనుక్షణం ఆయన ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, తాను మెతకగా ఉంటే పని చేయనివ్వరని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆ కారణంగానే ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రిమొండితనాన్ని ప్రదర్శిస్తున్నారు.

ప్రభుత్వపరమైన అంశాల విషయంలోనే కాకుండా, పార్టీ పరమైన విషయాలలో కూడా ఆయన తనకంటూ ఒక టీంను ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. మంత్రులను విశ్వాసంలోకి తీసుకుని వారికి బాధ్యతలు అప్పగించిన దాఖలాలు లేవు. దీనితో పలువురు సీనియర్ మంత్రు లు ఆయన పట్ల కినుకగా ఉన్నారు. అయినా, ఎవరు ఏమనుకుంటా రు అన్న దానితో నిమిత్తం లేకుండా, కిరణ్‌కుమార్‌రెడ్డి తనదైన శైలి లో వ్యవహరిస్తున్నారు.

రైతులకు మరింత మెరుగైన ప్యాకేజీ ఇవ్వాల ని కోరుతూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఏడురోజుల పాటు నిరాహారదీక్ష చేసినా, కనీసం ఒక్క డిమాండ్‌ను తీర్చడానికి కూడా ముఖ్యమంత్రి అంగీకరించలేదు. వాస్తవానికి అసెంబ్లీలో తాను ప్రకటించిన ప్యాకేజీ కన్నా మెరుగైన ప్యాకేజీ ఇవ్వడానికి ప్రభుత్వపరంగా కృషి జరుగుతోంది. అయితే చంద్రబాబు దీక్ష చేపట్టినందునే ప్రభుత్వం సాయం పెంచిందన్న అభిప్రాయం రైతుల్లో కలగకుండా ఉండటానికే, అఖిలపక్ష సమావేశంలో ఎవరు ఎంత గొంతు చించుకున్నా, ముఖ్యమంత్రి మొండికేశారు.

ఒకటిరెండు రోజులలో ప్రభుత్వం కొత్త ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయంలో కేంద్రం కూడా ఉదారంగా సహాయం చేయడానికి సుముఖత చూపినట్లు తెలుస్తున్నది. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూరరాదన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి అంత మొండిగా ఉన్నారు. చంద్రబాబుతో దీక్ష విరమింపచేయడానికి కనీసం మంత్రు ల బృందాన్ని అయినా పంపారు. విజయవాడలో ఆర్భాటంగా జగన్ చేపట్టిన 48 గంటల దీక్షను ముఖ్యమంత్రి కనీసం గుర్తించలేదు.

జగన్‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకూడదన్నది కిరణ్ ఆలోచనగా చెబుతున్నారు. తొలిదశలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించి, మలి దశలో రాజశేఖరరెడ్డి ప్రభావాన్ని తగ్గించి, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న రెండంచెల వ్యూహంతో ఆయన ఉన్నారు. ప్రజల్లో రాజశేఖరరెడ్డి ప్రభావం తొలగించగలిగితే, జగన్ పరిస్థితి 'నీటిలో నుంచి ఒడ్డున పడ్డ చేప'లా తయారవుతుందని ముఖ్యమంత్రి వర్గీయులు అంచనా వేస్తున్నారు.

వాస్తవం కూడా అదే! రాజశేఖరరెడ్డి పేరు చెప్పుకొనే జగన్ ప్రస్తుతానికి రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి, తాను కంగారు పడి ఇతరులను కంగారు పెట్టే బదులు, ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఈ క్రమం లో కాంగ్రెస్ అధిష్ఠానం సలహాలు, సూచనలతో రూపొందించుకున్న రెండంచెల వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయగలిగితే, 2014లో జరిగే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయవచ్చునన్నది కిరణ్ అంతరంగంగా చెబుతున్నారు.

రాజకీయ పార్టీలలో ఉన్నవాళ్లు దీక్షలు చేసినా, మరొకటి చేసినా, రాజకీయ ప్రయోజనాలు అంతర్లీనంగా అందులో ఇమిడి ఉంటాయి. చంద్రబాబు చేపట్టిన దీక్ష వెనుక గానీ, జగన్ ముగించుకున్న లక్ష్య దీక్ష వెనుకగానీ రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఎలా ఉంటాయి?! అయితే ఇప్పుడు రాష్ట్రంలోని పార్టీలన్నీ, రాజకీయ ప్రయోజనాలను కాసేపు పక్కనబెటి,్ట రైతుల లో ఆత్మ విశ్వాసం పాదుకొల్పడానికి ఏకోన్ముఖంగా ముందుకు కదలవలసిన అవసరం ఉంది.

ప్రతిరోజూ 20 మందికి తగ్గకుండా రైతు లు, ఆత్మహత్య లేదా గుండెపోటుతో చనిపోతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 48 గంటల లక్ష్య దీక్ష చేపట్టిన జగన్ ఆ వెంటనే క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి పులివెందుల వెళ్లిపోయారు. రాజకీ య బల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇచ్చిన ఇటువంటి దీక్షల వల్ల రైతులకు వొనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. రైతులకు ఇప్పుడు కావలసింది పార్ట్ టైం రాజకీయ నాయకులు కాదు. 'మీ వెనుక మేము న్నాం' అని ధైర్యం చెప్పి, ఆదుకునే ఆపన్న హస్తం కావాలి.

ఏడురోజులపాటు నిరాహారదీక్ష చేపట్టి, ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబునాయుడు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి న తర్వాత ఏమి చేయనున్నారో వేచి చూడాలి. రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడకుండా, రైతులకు సహాయం అందించడానికి చొరవ తీసుకోవలసిన బాధ్యత, ఒక ప్రతిపక్ష నేతగా, తొమ్మిది సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై ఎక్కువగా ఉంది. చంద్రబాబుకు ఎక్కడ లబ్ధి చేకూరుతుందోనని ఆలోచించకుం డా, రైతులకు వీలైనంత మేర సహాయం అందించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యోన్ముఖులు కావాలి.

'సర్వరోగ నివారి ణి జిందా తిలిస్మాత్' అన్నట్లు, అన్ని సమస్యలకు తెలంగాణ ఏర్పాటే పరిష్కారం అని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసే బదులు, తెలంగాణ జిల్లాలలో గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్న రైతాంగానికి భరోసా ఇవ్వడానికి టి.ఆర్.ఎస్. అధినేత కె.సి.ఆర్. ముందుకు రావలసిన అవసరం ఉంది. తనకు ఎంతమంది శాసనసభ్యులు మద్ద తు ఇస్తారన్న లెక్కలకు కాసేపు స్వస్తి చెప్పి, రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వానికి సహకరించవలసిన బాధ్యత జగన్‌పై ఉంది. మరి వీళ్లంతా కలసి కదులుతారా? 

-ఆదిత్య


Wednesday, January 5, 2011

తేల్చేద్దాం! * 'తెలంగాణ'పై అనిశ్చితి అంతానికే కేంద్రం మొగ్గు * శ్రీకృష్ణ నివేదికలో స్పష్టమైన రోడ్ మ్యాప్ * పార్టీలు తేల్చుకోవాలి పరిష్కారం వాటి చేతుల్లోనే

 
ప్రాధాన్య క్రమంలో ఆరు సిఫారసులు
అదే విధానంలో పరిష్కారానికి యత్నాలు
గురువారం ఉదయం 11 గంటలకే పార్టీలతో భేటీ
స్పందించేందుకు 10 రోజుల సమయం
స్పష్టత ఇవ్వకుంటే తుది నిర్ణయం కేంద్రానిదే
రాష్ట్ర విభజనపై తేల్చేద్దాం... అనిశ్చితిని అంతం చేద్దాం... సాగదీతకు ఫుల్‌స్టాప్ పెట్టి, సాధ్యమైనంత త్వరలో తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేద్దాం..!! ఇవీ కేంద్రం మదిలో తాజా ఆలోచనలు. రాష్ట్రంలో సామాజిక ఆందోళనలు.. విభజన అంశంపై కొనసాగుతున్న అనిశ్చిత వాతావరణం ఎక్కువకాలం కొనసాగితే మంచిది కాదన్న అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సాధ్యమైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చేయాలని కేంద్రం భావిస్తోందని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి.

శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పరిష్కార మార్గాలు చెప్పిందని, స్పష్టమైన ఆ రోడ్‌మ్యాప్‌ను ఆధారం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సమాయత్తమవుతోందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల ఆరున ఉదయం 11 గంటలకు రాష్ట్రానికి చెందిన 8 రాజకీయ పార్టీలతో సమావేశం యథాతథంగా జరుగుతుందని, ఆ సమావేశంలో నివేదికను అందజేయడంతో పాటు.. నివేదిక సారాంశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందని సమాచారం. ఆ వెంటనే నివేదికను మధ్యాహ్నం రెండు గంటలకల్లా వెబ్‌సైట్‌లో పెట్టేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై ప్రతి స్పందించేందుకు రాజకీయ పార్టీలకు పది రోజుల పాటు సమయం ఇస్తారని తెలుస్తోంది.

నివేదికపై రాజకీయ పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెప్పిన తర్వాత ఇక నిర్ణయం కేంద్రమే తీసుకుంటుందని ఈ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా శ్రీకృష్ణ కమిటీ నివేదికలో సూచించిన ఆరు పరిష్కార మార్గాల్లో ఒక్కోదానికి ఒక్కో గ్రేడ్ ఇచ్చారని తెలిసింది. ఈ ఆరింటిలో మొదటి పరిష్కారమే ఉత్తమ మార్గమని కమిటీ అభిప్రాయపడుతోందని హోంశాఖ వర్గాలు చెప్పాయి. ఒక వేళ మొదటి పరిష్కారం సాధ్యం కాదని రాజకీయ వర్గాలు భావించిన పక్షంలో రెండవ పరిష్కారంవైపు దృష్టి పెడతారు.

దీన్నీ తిరస్కరిస్తే మూడోది.. అలాగే ఇతర పరిష్కార మార్గాలపైనా చర్చ జరుగుతుందని హోం శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇదే విధంగా కొనసాగించడమా? లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమా? సమైక్యాంధ్రలో తెలంగాణకు రాజ్యాంగ రక్షణ కల్పించడమా? వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు సూచించడమా, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడమా? లేక రెండు ప్రాంతాల రాజధానిగా కొనసాగించడమా, మూడు రాష్ట్రాలుగా విభజించడమా, లేక రాయలసీమను తెలంగాణలో విలీనం చేయడమా? ఇలా అనేక అంశాలను కమిటీ చర్చించిందని తెలిసింది. ఇందులో ఏ పరిష్కార మార్గానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందో ఇప్పుడే చెప్పడానికి హోంశాఖ వర్గాలు నిరాకరించాయి.

రాజకీయ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారమే రాష్ట్రం విషయంపై కేంద్రం ఒక నిర్ణయానికి రావడానికి వీలుంటుందని ఈ వర్గాలు చెప్పాయి. వారి అభిప్రాయానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని, ఒక వేళ విభజనకే నిర్ణయించిన పక్షంలో తాత్కాలికంగా ఉభయ ప్రాంతాలకు హైదరాబాద్‌ను రాజధానిగా అంగీకరించడమో, విజయవాడ, గుంటూరులను నూతన రాష్ట్రానికి రాజధానిగా ప్రతిపాదించడమో జరుగుతుందని ఆ వర్గాలు వివరించాయి.

తాము అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నామని పేర్కొన్నాయి. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు గతంలో ఒక అభిప్రాయం చెప్పి, తాము ప్రకటన చేసిన తర్వాత కేంద్రంపై నింద వేశాయని, ఇప్పుడు ఆ ఆవకాశం లేకుండా ఆ పార్టీలు స్పష్టత ఏర్పర్చుకోవాల్సి ఉన్నదని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను స్పష్టంగా, పరిస్థితిని యథాతథంగా నివేదించిందని, ఈ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోలేకపోతే ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేమని, రాజకీయ పార్టీలు కూడా ఈ నివేదికను తమ నిర్ణయానికి ఆధారంగా స్వీకరించాలని ఈ వర్గాలు సూచిస్తున్నాయి. కాగా అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర హోంమంత్రి చిదంబరం సంప్రదిస్తున్నారని, వారు ఢిల్లీకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపాయి. వారు రాకపోతే నివేదికను వారికి చేరేలా చేస్తామని ఈ వర్గాలు చెప్పాయి.
Click Here!

పార్టీలు తేల్చుకోవాలి
పరిష్కారం వాటి చేతుల్లోనే
అవి కోరినంత కాలం చర్చలు

అనిశ్చితి ఎంత కాలమో నాకూ తెలియదు
6న అర్థమవుతుంది
ఇద్దరేసి చొప్పున రమ్మనడం భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించడం కాదు
ఎంత మందిని పంపాలో పార్టీల ఇష్టం
చిదంబరం వ్యాఖ్యలు
 అనిశ్చితి ఎప్పుడు తొలగిపోతుందో ఆరో తేదీ దాకా నాకూ తెలియదు.. తెలంగాణకు పరిష్కారం రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉంది..! కోరుకున్నంత కాలం చర్చలు జరపడానికి సిద్ధం! ఇవీ కేంద్ర హోం మంత్రి నోట వెలువడిన మాటలు!! శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందజేసేందుకు ఈ నెల ఆరున ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో చిదంబరం చేసిన వ్యాఖ్యలు! ఆహ్వానించిన అన్ని పార్టీలూ తాను ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతాయన్న ధీమా వ్యక్తం చేసిన చిదంబరం.. ఈ భేటీలో ఏ పార్టీ ఏం చెబుతుందో వేచి చూడాలని అన్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలపై ఎంతకాలం చర్చలు కొనసాగించాలన్న విషయం రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉన్నదని చెప్పారు. దాని గురించి ఆ పార్టీలే తేల్చుకోవాలని, కాలపరిమితి గురించి తాను చెప్పలేనని చిదంబరం స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు చర్చలు కొనసాగించాలని కోరుకున్నంత కాలం తాను చర్చలు జరుపుతానని తెలిపారు. సమస్యను నాన్చడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు వచ్చిన వ్యాఖ్యానాల్ని ఆయన ఖండించారు. "నాకు ఉద్దేశాలు అంటకట్టకండి.'' అంటూ తీవ్రంగా ప్రతిస్పందించారు.

జవవరి 6న మీరు విస్తృత చర్చలు జరుపుతారా, లేక కేవలం నివేదిక ఇచ్చి ఊరుకుంటారా? అని అడిగినప్పుడు రాజకీయ పార్టీలు సమావేశంలో స్పందించే తీరును బట్టి చర్చలు సాగుతాయని తెలిపారు. ఈ నెల 6న కమిటీ నివేదికపై చర్చించేందుకు ఒక పార్టీ నుంచి ఇద్దర్ని ఆహ్వానించినంత మాత్రాన ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలను ప్రోత్సహిస్తున్నామని కాదని ఆయన వివరణ ఇచ్చారు.

గత జనవరి 5న ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి గురించి చర్చించేందుకు 8 పార్టీల నుంచి ఇద్దర్ని ఆహ్వానించామని, ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించామని ఆయన చెప్పారు. ఇద్దర్ని మాత్రమే పంపాలన్న నిబంధన ఏమీ లేదని, పార్టీ ఒక్కర్ని కూడా సమావేశానికి పంపించవచ్చునని చిదంబరం స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఇద్దరు వచ్చినంత మాత్రాన వేర్వేరు అభిప్రాయాలు చెబుతారని కూడా చెప్పలేమని అన్నారు.

గత సమావేశంలో కూడా సీపీఎం, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయని చిదంబరం గుర్తు చేశారు. జనవరి 6 సమావేశాన్ని టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు బహిష్కరిస్తున్న సంగతిని ప్రస్తావించగా.. "చూద్దాం..'' అన్నారు. నివేదిక అధ్యయనం చేసేందుకు టీఆర్ఎస్, సీపీఐలు సమయం కోరుతున్నాయని చెప్పినప్పుడు "వారు జనవరి 6న ఏం చెబుతారో చూడాల్సి ఉంది..'' అని స్పందించారు.

టీఆర్ఎస్ ఈ సమావేశంలో పాల్గొంటుందనే ఆశాభావాన్ని చిదంబరం వ్యక్తం చేశారు. జనవరి 6న ఏం జరుగుతుందో, పార్టీలు ఏమి చెబుతాయో చూడకుండా ఇప్పుడే తాను మాట్లాడలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే అన్ని పార్టీలూ ప్రజాస్వామ్య క్రమం కొనసాగేలా చూడడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Click Here!
భయం వద్దు !
pc-chindambram తెలంగాణపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ ప్రకటించినా, ఆరో తేదీన జరిగే చర్చలకు ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది రాజకీయ పార్టీలూ హాజరవుతాయన్న విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. ‘అఖిలపక్ష సమావేశానికి ఎనిమిది పార్టీల్నీ ఆహ్వా నించాం. మొత్తం ఎనిమిది పార్టీలూ సమావేశానికి హాజరవుతాయన్న నమ్మకం నాకుంది’ అని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మంగళవారం విలేకరులకు తెలి పారు. తెలంగాణపై అభిప్రాయ సేకరణ జరిపి శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత చిదంబరం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఒక్కో పార్టీ నుంచీ ఇద్దరు ప్రతినిధుల్ని ఆహ్వానించి, కేంద్రం భిన్నాభిప్రాయాల్ని కోరుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన ఆరోపణలను గురించి అడగ్గా చిదంబరం -‘అలా అనడం సరికాదు. తెలంగాణ అంశంపై చర్చించేందుకు కేంద్రం 2010 జనవరి 5నప్రతి పార్టీనుంచి ఇద్దరేసి ప్రతినిధుల్ని ఆహ్వానించింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించాం’ అన్నారు. అ యితే, ఏ పార్టీ అయినా ఒక ప్రతినిధిని కూడా పంపవచ్చ న్నారు. ‘గత ఏడాది అనుభవాన్ని బట్టి చూస్తే, ఫలానా పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు వస్తే, వారు రెండు అభి ప్రాయాల్ని వ్యక్తం చేస్తారని అనుకోకూడదని తెలిసింది. 2010 జనవరి 5న జరిగిన సమావేశానికి సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం నుంచి ఇద్దరేసి ప్రతినిధులు హాజరైనా, ఒక్కో పార్టీ తరఫున ఒకే అభిప్రాయం వ్యక్తమైంది.

అయినా, ఇదో సమస్య కాదు. ఆరున జరిగే సమావే శంలో టీఆర్‌ఎస్‌ పాల్గొంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వారు ఒకరిని లేదా ఇద్దరిని పంపవచ్చు. అది వారిష్టం’ అని చిదంబరం పేర్కొన్నారు. ‘గురువారం సమావేశంలో తాము పాల్గొనడం లేదని ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలు ప్రకటించడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందా?’ అని విలేకరులు అడగ్గా - ‘ఆరున ఏం జరుగుతుందో చూద్దాం’ అని చిదంబరం సమాధానమిచ్చారు. నివేదిక వెల్లడి అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అల్లర్లు జరగవని, అల్లర్లు జరుగుతాయంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని చిదంబరం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలకు లక్ష్మణరేఖ
telangana-mps
కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ ఎంపీలను ఆ పార్టీ అధిష్ఠానం హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. తెలంగాణ ప్రాంత లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరు కూడా బుధవారం మధ్యాహ్నం హస్తినలో అందుబాటులో ఉండాలని ఆదే శించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ మంగళవారం ఎంపీలకు ఫోన్‌ చేసి బుధవారం ఒంటిగంట వరకు ఢిల్లీకి చేరు కోవాలని సూచించారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పార్టీ కోర్‌ కమిటీ సభ్యుడు, సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, మరో కేంద్ర మంత్రి గులాం నబీఆజాద్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జీ డాక్టర్‌ ఎం.వీరప్ప మొయిలీ తదితరులు తెలంగాణ ఎంపీలతో భేటి కానున్నారు.

పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్ప టికే కొందరు ఎంపీలు ఢిల్లీ చేరుకోగా, మరి కొందరుబుధవారం ఉదయం బయలుదేరి వెళ్ళనున్నారు. సమావేశం ఎజెండా ఏమిటో ఇప్పటి వరకు ఎంపీలకు సైతం తెలియరానప్పటికీ, గత కొన్ని రోజులుగా తెలంగాణ ఎంపీల వైఖరి, ఈ నెల 6న అఖిలపక్ష సమావేశం తరువాత శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం వెల్లడించనున్న నేపధ్యంలో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై తగు సూచనలు చేసే అవకాశాలుంటాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

మందలింపులా?
ఇటీవలి కాలంగా పార్టీ తెలంగాణ ఎంపీల వ్యవహార శైలీపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు వినిపిస్తోంది. డిసెంబర్‌ 22 నుంచి తెలంగాణ ఎంపీలు గట్టిగా వ్యవహరించడం, విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలంటూ సీనియర్‌నేత, స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ కె.కేశవరావుతో సహా 10 మంది ఎంపీలు న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష ప్రారంభించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మల్యేలు వారితో పాటు దీక్షలో పాల్గొన్నారు. అంతే కాకుండా ఇద్దరు మంత్రులు సైతం దీక్షా శిబిరానికి వెళ్ళి సంఘీభావం తెలిపారు. తెలంగాణ కోసం అవసరమైతే మాతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైకమాండ్‌ను ధిక్కరించే స్థాయిలో వీరు వ్యవహరించారని సీమాంధ్ర నేతలు ఇప్పటికే హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వీరి వ్యవహారం పార్టీ హైకమాండ్‌కు ఇబ్బంది కరంగా పరిణమించింది.

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే అన్నింటికి సిద్ధమని, అవసరమైతే పదవులను సైతం వదులుకుంటామని కేకేతో సహా పలువురు నేతలు హైకమాండ్‌కు హెచ్చరించినంత పనిచేశారు. ఈ నెల 7వ తేదీ మరో సారి భేటి అయి శ్రీకృష్ణ కమిటీ నివేదికపై భవిష్యత్‌ కార్యచరణ రూపొందించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ నేతల సమావేశాల్లో పలువురు నేతలు చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా హైకమాండ్‌ దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. దీంతో సీరియస్‌గా ఉన్న అధిష్ఠానం కంట్రోల్‌ చేయక పోతే మళ్ళి కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని భావించే తెలంగాణ ఎంపీలను ఢిల్లీకి పిలిపించినట్లు ఎఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎంపీల తీరుపై అధిష్ఠానం నేతలు మందలించే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, గీత దాటితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడమే కాకుండా ఎంపీలకు లక్ష్మణరేఖ విధించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

బుజ్జగింపులా?

తెలంగాణ ఎంపీలను బుజ్జగించేందుకే అధిష్ఠానం వారిని ఢిల్లీకి పిలిపించినట్లు పార్టీలో మరో వాదన వినిపిస్తోంది. కేంద్ర మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి, ఎంపి అంజన్‌కుమార్‌ యాదవ్‌, రాజ్యసభ సభ్యులు నంది ఎల్లయ్య, ఎం.ఎ.ఖాన్‌లు మినహాయించి మిగతా 10 మంది ఎంపీలు తెలంగాణ కోసం రాజీనామాలు చేయడానికి సైతం వెనుకాడబోమని ఇటీవలే స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్ధులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలంటీ గత వారం ఎంపీలు చేపట్టిన దీక్షకు పై నలుగురు ఎంపీలు దూరంగా ఉన్నారు.

pranabaమరో ఎంపి విహెచ్‌ ఎంపీల దీక్షలో పాల్గొనక పోయినా సంఘీభావం తెలియజేశారు. పది మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వారి బాటను అనుసరిస్తే పార్టీకి లేని పోని సమస్యలు రావడంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుందనే ఆందోళనతో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. పది మంది ఎంపీలు ఒక్క తాటిపై ఉండి తెలంగాణ విషయంలో ఇక వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పడం, విద్యార్ధులపై కేసుల ఎత్తివేత విషయంలో దీక్షకు దిగన సమయంలో , హైకమాండ్‌ పలు మార్లు సంప్రదించి, దీక్ష విరమించుకోవాలని విజ్ఞప్తి చేసినా వినిపించుకోకుండా అలాగే కొనసాగించారు.

తెలంగాణ పేరుతో ఎంపిలు తిరుగుబాటు చేస్తే ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా తయారవుతుందని పార్టీ నాయకత్వానికి భయం వెంటాడుతున్నట్లు వినిపిస్తోంది. మరో వైపు కేంద్రం కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడే కాకుండా కొంత కాలం తరువాత తెలంగాణ ఇవ్వాలనే ఆలోచనతో హైకమాండ్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదికను చూసి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ ఎంపీలకు హైకమాండ్‌ నచ్చజెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే టిఆర్‌ఎస్‌కు లాభం చేకూరకుండా, అది కాంగ్రెస్‌ వల్లే వచ్చిందనే భావం ప్రజల్లో ఏర్పడే విధంగా చూడాల్సిన వసరం ఉందని, అందుకే కాస్త జాప్యం జరిగినా మీరు ఓపికపట్టాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడి అనంతరం మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడకుండా సంయమనం పాటించాలని పార్టీ ఎంపీలను అధిష్ఠానం నచ్చజెప్పే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలో వినిపిస్తోంది.

నేడు ఢిల్లీకి డిఎస్‌, సిఎం
పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఉదయం వేర్వేరుగా ఢిల్లీకి బయలు దేరి వెళ్ళనున్నారు. రెండు రోజుల పాటు వీరు అక్కడే ఉంటారు. 6వ తేదీన నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోంశాఖ శ్రీకృష్ణ కమిటీ నివేదికను వెల్లడించనున్నందున వీరు హస్తినకు వెళుతున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలని అధిష్ఠానం ఆదేశించడంతోనే పీసీసీ చీఫ్‌ డిఎస్‌ హస్తిన పర్యటనకు వెళుతున్నారు. ఇక అఖిలపక్ష సమావేశానికి ముఖ్యమంత్రి కూడా హాజరు కావాల్సి ఉండటంతో కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక రోజు ముందుగానే ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా బుధవారం తెలంగాణ ఎంపీలతో అధిష్ఠానం ఏర్పాటు చేసిన సమావేశంలో వీలును బట్టి కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా పాల్గొనే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నారు.

మాకేనా హద్దులు ?
 మాకే నా హద్దులు. సీమాంధ్ర ఎంపీలకు వర్తించవా? పార్టీ నుంచి బయటికి వెళ్ళిన జగన్‌కు మద్దతు పలుకుతూ, అతని సభలకు జనసమీకరణ చేస్తూ, చర్యలు తీసుకుంటే రాజీనామాలు చేస్తామంటూ బెదిరిస్తున్న ఎంపీల విష యం పట్టదా? మేము పార్టీని బతికించుకోవడానికి నానా పాట్లు పడుతుంటే, వాళ్ళు పార్టీకి నష్టం కలి గించే విధంగా వ్యవహరిస్తున్నారు అని కాంగ్రెస్‌ తెలంగాణ ఎంపీలు అధిష్ఠానం తీరుపై తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుధవారం హస్తినలో హైక మాండ్‌ ఏర్పాటు చేసిన సమావేశం తెలంగాణ ఎంపీలను కట్టడి చేయడానికేనని ప్రధానంగా ప్రచా రం జరుగుతుండడంతో ఆ ప్రాంత ఎంపీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ప్రజల కోసం, పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు తాము దీక్షలు చేపడితే అదేదో పెద్ద నేరంగా, పార్టీకి చేసినద్రోహంగా చిత్రీకరించి అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించడం, కొందరి మాటలు విని హైకమాండ్‌ తమతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇటూ పార్టీలో, అటు ప్రజల్లో తాము చులకనయ్యే అవకాశాలుంటాయని ఎంపీలు మండిపడుతున్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో తాము మౌనంగా ఉంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను క్షమించరని, తెలంగాణకు అంగీకరించి కమిటీ వేసి ఇప్పుడేమో తెలంగాణ ఇచ్చేది లేదంటే జనం కాంగ్రెస్‌ను ఎన్నడు నమ్మె పరిస్థితి ఉండదని తెలంగాణ ఎంపీలు అంటున్నారు. పైగా తాము ఇటీవల దీక్షలు చేపట్టింది కూడా విద్యార్ధులపై కేసుల ఎత్తివేత కోసమే తప్ప, మరొకటి కాదన్నారు. గత ఏడాది డిసెంబర్‌ 9న చిదంబరం చేసిన ప్రకటనను, పార్లమెంట్‌లో ఇచ్చిన హమీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనందుకే తాము దీక్షలు చేపట్టాల్సి వచ్చిందని వారంటున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాల మేరకు పనిచేయక పోతే తెలంగాణలో పార్టీకి పుట్టగతులు ఉండని పరిస్థితులు వస్తాయని ఒక ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం తాము ఉద్యమించక పోతే రేపటి రోజు తెలంగాణలో జనం కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి ఉండదని, తెలంగాణలో కాంగ్రెస్‌ బతికి ఉండాలంటే తాము నడుస్తున్న దారి సరైనదని మరో ఎంపీ వ్యాఖ్యానించారు.

తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ మోసం చేస్తున్నదని ప్రజల్లో భావం ఏర్పడుతున్నదని, అలాంటి పరిస్థితులు రాకుండా తాము ప్రయత్నిస్తున్నామని ఒక ఎంపీ అన్నారు. పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన జగన్‌కు మద్దతుగా నిలుస్తూ, అతని సభలకు జనసమీకరణ చేస్తూ, ఓదార్పు యాత్ర కోసం కార్యాలయాలను నెలకొల్పుతూ, సోనియాకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జగన్‌ మాట్లాడినా అతని వెంటే ఉంటూ అతనికి జై కొట్టడమే కాకుండా, చర్యలు తీసుకుంటే రాజీనామాలు చేస్తామని బెదిరిస్తున్న సబ్బం హరి లాంటి ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీనియర్‌ ఎంపి ఒకరు ప్రశ్నించారు.

వాళ్ళు పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నా అధిష్ఠానం మౌనంగా ఉంటున్నదని, తాము పార్టీని పటిష్టం చేయడానికి దీక్షలు, తెలంగాణకు మధ్దతుగా మాట్లాడితే ఏదో నష్టం జరిగిపోయినట్లు స్పందించిన తీరు బాగులేదని ఆ ఎంిపీ అధిష్ఠానం వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టికెట్ల కోసం చూసుకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని మరో ఎంపి వ్యాఖ్యానించారు. రేపు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది అధిష్ఠానమే అయినా ఓట్లు వేసే జనం పక్షాన నిలబడక పోతే, వారి సానుభూతి, సహకారం లేక పోతే గెలువగలమా? అధిష్ఠాం గెలిపిస్తుందా? అని ఆ ఎంపి ప్రశ్నించారు. తాము తెలంగాణ ప్రజల అభిష్ఠాల మేరకే వ్యవహరిస్తున్నామని, ఎక్కడ కూడా పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరించడం లేదని ఎంపీలు పేర్కొన్నారు. బుధవారం హైకమాండ్‌తో జరిగే భేటిలో ప్రణబ్‌, ఆజాద్‌, మొయిలీలకు తమ వాదనలు వినిపించేందుకు తెలంగాణ ఎంపీలు సిద్ధమవుతున్నారు.

చేతులెత్తేసిన కిరణ్‌, డీఎస్‌
krian-sirr 
శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వివరాల వెల్ల డికి సమయం సమీపిస్తోన్న నేప థ్యంలో తమ పార్టీకి చెందిన పార్ల మెంటు సభ్యులను కట్టడి చేసే బాధ్య తను అధిష్ఠానమే స్వయంగా భుజం మీద వేసుకుంది. అయితే, ఆ అం శంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తమ వల్ల కాదంటూ చేతులెత్తేయడ ంతో నేరుగా అధిష్ఠానమే రంగంలో దిగడం అనివార్యమయింది. విశ్వస నీయ సమాచారం ప్రకారం... శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అను కూలంగా రాకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తాను ఎన్నిసార్లు స్వయంగా వెళ్లి నచ్చచెబుతున్నా మాట వినడం లేదని పీసీసీ అధ్యక్షుడు డిఎస్‌ అధిష్ఠానానికి మొరపెట్టుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల వైఖరి వల్ల టీఆర్‌ఎస్‌ లాభపడటమే కాకుండా, తెలంగాణవాదం బలపడి అది ప్రత్యక్షంగా శాంతిభద్రతల సమస్యగా మారి, పరోక్షంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తోందని సీఎం కూడాఫిర్యాదు చేశారు. ఇటీవల చేపట్టిన దీక్ష వల్ల సొంత పార్టీ ఎంపీలే సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్న భావన ప్రజల్లో నెలకొందని సీఎం నాయకత్వానికి వివరించారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉండాలన్న తమ మాటను ఎవరూ లెక్కచేయకుండా, తెలంగాణపై గట్టిగా మాట్లాడకపోతే ఎక్కడ వెనుకబడి పోతామోనన్న భయంతో కాంగ్రెస్‌ ఎంపీలు సొంత అజెండాతో వెళ్లి ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తున్నారని కిరణ్‌ నాయకత్వానికి వివరించారు.

dss తాను కూడా వారికి ఇటీవలి కాలంలో నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ మాటవినడం లేదన్నారు. దానికితోడు.. వెంకట స్వామి, కేశవరావు, హన్మంతరావు, మధుయాష్కీ, సర్యే సత్యనారా యణ, వివేక్‌ వంటి నాయకులంతా సీనియర్లయినందున తన స్థాయి కూడా సరిపోవడం లేదని, వారికి తాను చెప్పినా వినే పరిస్థితి లేదని కిరణ్‌ తన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఆయన ప్రధానంగా కేశవరావు మీదే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేకేనే దీనిని తెర వెనుక ఉండి నడిపిస్తున్నారంటూ ప్రభుత్వానికి అందిన నివేదికలను కిరణ్‌ తన వాదనలకు మద్దతుగా పంపించారు. అయితే నిజానికి.. రాష్ట్రంలో నెలకొన్న తెలంగాణ వేర్పాటువాద ఉద్యమం, జగన్‌ తిరుగు బాటు వ్యవహారాన్ని తాను సమర్థవంతంగా అణచివేస్తానన్న భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న కిరణ్‌, తీరా అధిష్ఠానానికి తానిచ్చిన హామీలలోనే వైఫల్యం చెందడ ం ప్రస్తావనార్హం.

వైఎస్‌ మృతి చెందిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, జగన్‌ వ్యవహారంపై స్పీకర్‌ హోదాలో ఎప్పటికప్పుడు నివేదికలు పంపించడంతో పాటు, అనేకసార్లు స్వయంగా అధిష్ఠానం వద్ద పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చి, ఢిల్లీకి దగ్గర య్యారు. ఆ తర్వాత కీలకమైన ఆ రెండు అంశాలపై నిర్దిష్ట హామీ ఇచ్చి సీఎం పదవి పొందిన కిరణ్‌, ఇప్పుడు తెలంగాణ అంశాన్ని నియంత్రించడం తన వల్ల కాదంటూ చేతులెత్తేడయం చర్చనీయాంశమయింది. జగన్‌ వైపు రెడ్డి వర్గం వెళ్లకుండా ఉండేందుకే మంత్రివర్గంలో ఆ వర్గానికి ఎక్కువ స్థానాలు, కీలక హోదాలు ఇవ్వాలని పట్టుపట్టి విజయం సాధించిన కిరణ్‌, తెలంగాణ అంశంలో తానిచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయి, చివరకు ప్రణబ్‌ను ఆశ్రయించవలసి వచ్చింది.

తాము చెప్పినా వినే పరిస్థితి లేకపోవడం, తన స్థాయి, అనుభవం, వయసుకు మించి నాయకులు ఉండటంతో.. మీరు జోక్యం చేసుకోకుంటేనే జనవరి 6 తర్వాత పరిస్థితులు ప్రభుత్వం చేతులో ఉంటాయని ముఖ్యమంత్రి విస్పష్టంగా చెప్పిన తర్వాతే ప్రణబ్‌ ముఖర్జీ రంగప్రవేశం చేశారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు భేటీ కావాలని తెలంగాణ ఎంపీలందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఆ భేటీకి బహుశా ముఖ్యమంత్రితో పాటు, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ కూడా హాజరుకావచ్చంటు న్నారు. తాజా పరిస్థితి, పరిణామాలు పరిశీలిస్తే.. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి చేతులు దాటినట్లు స్పష్టమవుతోంది. వారిద్దరికీ ఎవరూ మాట వినడం లేదన్న వాస్తవం రుజువయిపోయింది.

అంతా ఢిల్లీ స్థాయి నేతలు కావడం, వారికి అధిష్ఠానంలో ఏదో ఒక స్థాయిలో పలుకుబడి ఉండటంతో సీఎం, డీఎస్‌ చేతులెత్తేయవలసి రావడం చర్చనీయాంశమయింది. ప్రధానంగా.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ ప్రస్తుత తెలంగాణ సీనియర్ల అనుభవం-వయసుతో పోలిస్తే చిన్నవాడు కావడం కూడా ఇబ్బందికలిగిస్తోంది. ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలోనూ దాదాపు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే భవిష్యత్తులో కూడా సీఎం, పీసీసీ అధ్యక్షుడిని పక్కకుపెట్టి.. ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాలను ఇక నేరుగా అధిష్ఠానమే చూసేలా ఉందన్న అభిప్రాయం పార్టీ శ్రేణులలో ఏర్పడుతోంది.

Monday, January 3, 2011

6న భేటిపై రగడ * జనవరి 'ఆరు'పై అరవై వాదనలు * తెలంగాణకు తెర * నివేదిక సీఎం చేతుల్లో !


అఖిలపక్షానికి వెళ్లం..మళ్లీ గోల్‌మాల్‌కే సమావేశం : కేసీఆర్
ఒక్కో ప్రతినిధినే పిలవాలంటూ చిదంబరానికి లేఖ
అసలు కమిటీనే పనికిమాలినది... మేమూ ఢిల్లీ వెళ్లం : బీజేపీ
మీరూ వెళ్లొద్దు...నారాయణకు కేసీఆర్ వినతి
తిరస్కరించిన సీపీఐ... భేటికి వామపక్షాల ,పీఆర్పీ రెడీ
సోనియాను పిలిస్తే బాబూ వస్తారు... కేసీఆర్ మెలికపై టీడీపీ
కథ అడ్డం తిరిగింది. కేంద్రం అనుకున్నదొకటి. జరుగుతున్నది మరొకటి! తాంబూలాలు ఇచ్చేద్దాం అని కేంద్రం భావిస్తే.. దానికి ముందే తన్నులాటలు షురూ అయ్యాయి!! ఆరో తేదీ రాకుండానే.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక బయటపడకుండానే.. అఖిల పక్షంలోని పార్టీలు తలో పక్షంగా మారిపోయాయి. నివేదికతో సంబంధం లేకుండా అఖిలపక్ష భేటీపైనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రానికే షరతులు విధిస్తున్నాయి.

అఖిలపక్ష భేటీని బహిష్కరిస్తున్నామని కొన్ని పార్టీలు ప్రకటిస్తే.. మాకు టైం కావాలని మరికొన్ని డిమాండ్ చేస్తున్నాయి. అసలా భేటీయే దండగ అని మరికొన్ని ఈసడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆరో తేదీ భేటీపై అసలు కేంద్రం వైఖరి ఏమిటి? పార్టీల డిమాండ్లను పట్టించుకుంటుందా!? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే.. నెలనెలా కేంద్ర హోం శాఖ నిర్వహించే విలేకరుల సమావేశం సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా పార్టీల వైఖరులపై చిదంబరం తన స్పందనను వ్యక్తం చేసే అవకాశం ఉంది.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో ఈనెల ఆరో తేదీన 8 గుర్తింపు పొందిన పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను పంపాలని.. అప్పటికప్పుడే అభిప్రాయాలు చెప్పాలని ఆహ్వానిస్తూ చిదంబరం లేఖలు రాశారు. ఆ లేఖలోని కేంద్రం మెలికకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. అఖిలపక్ష భేటీని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు.

ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధినే ఆహ్వానించాలని.. ఒక్క అభిప్రాయాన్నే చెప్పమనాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఏకాభిప్రాయం సాధ్యమవుతుందన్నారు. మళ్లీ గోల్‌మాల్‌కే ఆరోతేదీ భేటీ అన్నారు. ఇద్దరేసి ప్రతినిధులు వస్తే.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తారని, ఏకాభిప్రాయం లేదని కేంద్రం తప్పించుకుంటుందని, తెలంగాణ సమస్యను తాత్సారం చేయడానికే ఈ ఎత్తు అని ధ్వజమెత్తారు. కేంద్రమే కిరికిరి చేస్తోందని విమర్శించారు. ఈ మేరకు చిదంబరానికే ఆయన బహిరంగ లేఖ రాశారు.

ఇక, ఈ అఖిలపక్ష భేటీ.. పనికిమాలిన, పనికిరాని సమావేశమని బీజేపీ తేల్చేసింది. దానిని తాము బహిష్కరిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. శ్రీకృష్ణ కమిటీనే తాము గుర్తించడం లేదని, ఇక అదిచ్చే నివేదికను గుర్తిస్తామా!? అని ప్రశ్నించారు. అయితే.. ప్రజారాజ్యం పార్టీతోపాటు వామపక్షాలు మాత్రం భేటీకి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రతినిధులను కూడా ఎంపిక చేశాయి. అఖిలపక్ష భేటీకి వెళ్లవద్దంటూ కేసీఆర్ కోరినా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

అంతేనా.. మీరు కూడా పాల్గొని పార్టీ వాదనను అక్కడే వినిపించండి అంటూ కేసీఆర్‌కే ఆయన హితవు పలికారు. అయితే.. సీపీఐతోపాటు పీఆర్పీ కూడా నివేదిక అధ్యయనానికి తమకు మరికొంత సమయం కావాలంటూ చిదంబరానికి లేఖలు రాశాయి. ఇక, కేసీఆర్ 'ఝలక్'పై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ను చూసి ఊసరవెల్లి భయపడుతోందని ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియాను పిలిపిస్తే.. టీడీపీ తరఫున చంద్రబాబు అఖిలపక్ష భేటీకి వస్తారని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ నుంచి ఒక్కొక్కరినే పిలవాలన్న కేసీఆర్ వాదనను టీడీపీ నేతలు ఎర్రబెల్లి, కడియం శ్రీహరి సమర్థించారు. కానీ, పార్టీ అధ్యక్షులనే పిలవాలని మెలిక పెట్టారు. నివేదికపై అసలు అఖిలపక్షమే అనవసరమని తేల్చేశారు. ఈ పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నేతలే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నివేదిక ఇచ్చాక అఖిలపక్షం దండగ అని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్, ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి వ్యాఖ్యానిస్తే.. కేసీఆర్ వాదనతో తమకు పని లేదని, అఖిలపక్ష భేటీకి వెళతామని మరో ఎంపీ రాజయ్య స్పష్టం చేశారు.

కేసీఆర్‌ది పలాయన వాదమని సీమాంధ్రనేతలు విమర్శించారు. ఇక, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కేకే మరికాస్త ముందుకెళ్లారు. సీడబ్ల్యూసీ పదవి తనకు ముఖ్యం కాదని, తెలంగాణ రాకపోతే ఆ పదవిని విసిరి పారేస్తానని వ్యాఖ్యానించారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తెలంగాణ రాదా!? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. ఈ దెబ్బతో తెలంగాణ సమస్య ఖతం కావాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు.

పొలిటికల్ బెటాలియన్ ఎవరి వాదనను వారు వినిపిస్తుంటే.. పోలీస్ బెటాలియన్ వాడవాడలా కవాతు చేస్తోంది. పికెట్లు, తనిఖీలతో రాష్ట్ర రాజధానిలో గుబులు పుట్టిస్తోంది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో తెలంగాణ చిక్కుముడి.. అఖిలపక్షానికి ముందే పీటముడి పడుతోంది. ఈ ముడిని చిదంబరం విప్పుతారా!? మరో ముడి వేస్తారా!?.


అఖిలపక్ష భేటీకి రాం.. *  చిదంబరానికి కేసీఆర్ ఝలక్

ఒక్కోపార్టీ నుండి ఇద్దరేసి సభ్యులన్నందుకే తిరస్కరిస్తున్నామని ప్రకటన
తెలంగాణ సమస్యను జటిలం చేసేందుకు కేంద్రం కుట్రపన్నుతోంది
అనైతిక చర్యలకు పాల్పడుతూ, కాలయాపన చేసేందుకు యత్నిస్తోంది
ఒక పార్టీ.. ఒక్క అభిప్రాయమే చెప్పాలి
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలి
అభివృద్ధి ఒక్కటే కాదు.. ఆత్మగౌరవం, స్వయంపాలన కావాలి

టీఆర్‌ఎస్ అధినేత వ్యాఖ్యలు

శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ నిమిత్తం కేంద్ర హోంశాఖ ఈ నెల 6న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి తాము హాజరు కాబోమని టీఆర్‌ఎస్ ప్రకటించింది. ఒక్కో రాజకీయ పార్టీ నుంచిఇద్దరు వ్యక్తులను పంపాలంటూ కేంద్ర హోంమంత్రి చిదంబరం పంపిన ఆహ్వానాన్ని ఆ పార్టీ తిరస్కరించింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు విజయశాంతి, హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంలో కేంద్రం అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భేటీ ఏర్పాటు చేసిన పద్ధతి సక్రమంగా లేదని, గతాన్ని పునరావృతం చేసే విధంగానే ఉందని కేసీఆర్ విమర్శించారు. ఇటువంటి సమావేశాల వల్ల ఫలితం రాదని, అందువల్ల తాము అఖిలపక్ష సమావేశానికి రాబోమని తేల్చిచెపుతూ హోంమంత్రి చిదంబరానికి లేఖ రాశారు.
ఇద్దర్ని ఎలా పిలుస్తారు..?

‘ఒక్కొక్క పార్టీ నుండి ఇద్దరిని ఆహ్వానించడం ఆశ్చర్యకరం. ఒకే పార్టీకి చెందిన రెండుప్రాంతాల వారు అక్కడకొచ్చి కలహించుకుని కొట్లాడుకునే విధంగా ఈ ప్రయత్నం ఉంది. చాట్లో తవుడుపోసి కుక్కలకు కొట్లాట పెట్టేవిధంగా, తాంబూలాలిచ్చేశాం.. తన్నుకుని చావండనే విధంగా కేంద్రం వ్యవహరిస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని తాత్సారం చేసి, జటిలంగా మార్చి, మరింత కాలం నానబెట్టాలనే ధోరణి వారిలో కనిపిస్తోంది. ఒక్కొక్క పార్టీ నుండి ఇద్దరు సభ్యులను పిలిచి కేంద్రమే కావాలని అనైతిక విధానాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకే చిదంబరం ఆహ్వానాన్ని బాధతో తిరస్కరిస్తున్నా..’ అని కేసీఆర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులతోనూ, తెలంగాణ మేధావులతోనూ చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఏడాదికిందట అఖిలపక్ష సమావేశంలో ఇద్దరిని పిలిచి చేసిన తప్పే శ్రీకృష్ణ కమిటీ కూడా ప్రస్తుతం చేసిందన్నారు. పార్టీ నుండి ఒక్కటే నివేదికను కాకుండా ఆయా పార్టీలో భిన్నాభిప్రాయాలను తీసుకుని తప్పుచేసిందని విమర్శించారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేయటం ‘పెళ్లి తర్వాత పెళ్లిచూపుల వంటింద’ని మండిపడ్డారు.
కేంద్రం నిర్ణయం అనైతికం..
‘కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒకపార్టీ నుండి ఒకే అభిప్రాయం వచ్చేవిధంగా చూడాలి. ఇద్దరిని ఆహ్వానించడం వల్ల ఏకాభిప్రాయం రాలేదంటూ తెలంగాణ అంశాన్ని మరింత కాలయాపన చేస్తరు. ఒక పార్టీ నుండి ఇద్దరిని పిలవాలనే నిర్ణయం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమవుతుంది. ఒకేపార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చే అనైతిక పద్ధతులకు కేంద్ర నిర్ణయమే ఆస్కారాన్నిస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అభిప్రాయం కూడా చెప్పాలంటే ఎలా సాధ్యం? డిసెంబరు 10న పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తారా లేదా’ అని కేసీఆర్ ప్రశ్నించారు. పిడికెడు మంది స్వార్థపరులు, సీమాంధ్ర పెట్టుబడిదారులు మినహా తెలంగాణ ఏర్పాటుకు అక్కడి ప్రజలు వ్యతిరేకంగా లేరని పేర్కొన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని గుంటూరులో ఇటీవల టీడీపీ నిర్వహించిన రైతుకోసం సభలో ఎంతోమంది సాధారణ ప్రజలు మీడియా ఎదుట స్పష్టంగా చెప్పారని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. శ్రీకృష్ణ కమిటీపై విశ్వాసం లేకున్నా ఇప్పటివరకూ ఓపిక పట్టామన్నారు. ఈ కమిటీలు, నివేదికలతో సంబంధం లేకుండా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధితో తెలంగాణ అంశాన్ని ముడిపెట్టలేమని, ఆత్మగౌరవం, స్వయంపాలనను ఇక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నారని కేసీఆర్ చెప్పారు. నివేదికలోని అంశాలేమిటో తెలియకుండా తొందరపడి వ్యాఖ్యానించడమెందుకని, 6వ తేదీ దాటితే నివేదిక ఇంటర్నెట్‌లోనే ఉంటుందన్నారు. నివేదికలోని అంశాలను చూసిన తర్వాతనే ఎలా స్పందించాలనేది నిర్ణయిస్తామని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణకు తెర
జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు అఖిలపక్షాన్ని ఆహ్వానించటం ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సాధ్యమైనంత కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నదా?...అసలు కమిటీ ఉద్దేశమూ అదేనా?...ఇలా కాలయాపన చేయటం ద్వారా క్రమంగా తెలంగాణ అంశాన్ని తెర చాటుకు పంపించాలని కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించుకున్నదా?...వివిధ రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను చూస్తే ఈ అనుమానాలు కలుగుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఏ ఒక్క ప్రాంతానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా ఇతర ప్రాంతాలకు చెందిన ఎంపీలు దూరమయ్యే ప్రమాదం ఉంది కనుక నిర్ణయాన్ని వాయిదా వెయ్యడమే ఉత్తమమని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

final-tngf 
శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఈ నెల 6 తేదీన ఢిల్లీలో అఖిలపక్షానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించటంలోనే కేంద్ర ప్రభుత్వ తాత్సారవైఖరి తేలిపోతున్నదని తెలంగాణకు పూర్తి మద్దతు పలుకుతున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ లాంటి పార్టీలు స్పష్టం చేస్తున్నా యి. గత ఏడాది జనవరి ఐదున కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఇలాగే అఖిలపక్షాన్ని పిలిపించారు. ఒక్కో పార్టీ నుంచి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు వెళ్ళి తమ ప్రాంతాలకు అనుగుణంగా అభిప్రాయాలు చెప్పటం, ఏకాభిప్రాయం ఏ పార్టీలోనూ లేదన్న సాకు చూపిన కేంద్రం శ్రీకృష్ణ కమిటీని వేసి బంతిని ఆ కోర్టులోకి నెట్టటం జరిగింది. ఇప్పుడూ అలాగే ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను పిలిచి, ఏ పార్టీకీ ఏకాభిప్రాయం లేదన్న సాకు చూపి తెలంగాణ అంశాన్ని అటకెక్కించటమే కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తున్నదని కాంగ్రెస్‌ మినహా మిగిలిన పార్టీలన్నీ అంటున్నాయి.

అసలు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఉద్దేశమూ అదేనని టీఆర్‌ఎస్‌ సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. కమిటీ నివేదిక నాలుక గీచుకోవటానికి తప్ప దేనికీ పనికి రాదని టీఆర్‌ఎస్‌ మొదటినుంచీ చెబుతున్నది. అయితే నివేదిక ఇవ్వలేదనే చెడ్డపేరు రాకుండా ఉండటం కోసం భారీ నివేదిక సమర్పించింది. ఇక బీజేపీ అసలు కమిటీనే గుర్తించేది లేదు పొమ్మన్నది. ఆ కమిటీకి చట్టబద్ధత లేదని ఎప్పుడో స్పష్టం చేసింది. ఇలా పార్టీలు తమకు నివేదిక సమర్పించనప్పుడు ఆయా పార్టీల అభిప్రాయాలు తమ కు తెలియనప్పుడు తాము పూర్తి స్థాయిలో సిఫారసులు చేయలేమని చెప్పి తప్పించుకునే ఉద్దేశం కమిటీకి ఉన్నట్టు తేలిపోతున్నదని టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు అంటున్నారు.
ఎంపీలు దూరం కాకుండా ఉండేందుకే?...
ఇక కాంగ్రెస్‌ పార్టీ ఈ నాన్చుడు తంత్రాన్ని అనుసరించటం ద్వారా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎంపీలు పార్టీకి దూరం కాకుండా ఉంచే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది. కమిటీయే కనుక కచ్చితమైన సిఫారసులు చేసి ఉంటే, అవి ఏదో ఒక ప్రాంత ఎంపీలకు కంటగింపుగా తయారయ్యే పరిస్థితి కచ్చితంగా ఉంటుంది కాబట్టి, ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ దెబ్బ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే ఒక ప్రాంత ఎంపీలను దూరం చేసుకుని కేంద్రంలో అధికారానికి ఎసరు పెట్టుకోవటం ఎందుకన్న అభిప్రాయంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉన్నట్టు చెబుతున్నారు.

సాధ్యమైనంత ఎక్కువ కాలం కమిటీ సిఫారసులు లేదా నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా కాలాన్ని నెట్టుకురావాలన్న ఉద్దేశంతో అధినాయకత్వం ఉన్నట్టు కనిపిస్తున్నదని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కమిటీ సిఫారసులలో ఏమున్నా దాన్ని ముందుగా పార్టీలోని అన్ని ప్రాంతాల ఎంపీలకు తెలియజెప్పి, ఏమి చేస్తే ప్రయోజనం ఉంటుందో ఆలోచించుకున్న తర్వాతే నివేదికపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపాటు తనం ప్రదర్శిస్తే పుట్టి మునుగుతుందన్న ఆందోళన కాంగ్రెస్‌ అధినాయకత్వంలో ఉందని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
నివేదికపై మరో కమిటీ?
సాధ్యమైనంత ఎక్కువకాలం కాలయాపన చేసేందుకు వీలుగా ముందు మొక్కుబడిగా అఖిలపక్షాన్ని నిర్వహించి, ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదన్న సాకు చూపి మరో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయటం, నివేదికను ఆ కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పి మరి కొంత కాలం ఊపిరి పీల్చుకోవటం కాంగ్రెస్‌ అధినాయకత్వం అసలు ఉద్దేశంగా కనిపిస్తున్నదని బీజేపీ, టీఆర్‌ఎస్‌, సీపీఐ తదితర పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కమిటీ గడువును సైతం దాదాపు ఏడాది పాటు విధించటం, అప్పట్లోగా రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయో తెలిసిపోతాయి కాబట్టి అవసరం అయితే అప్పుడే నిర్ణయం తీసుకుంటే సరిపోతుందన్న అభిప్రాయంతో హై కమాండ్‌ ఉన్నట్టు ఢిల్లీలోని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అడకత్తెరలో తెలంగాణ ఎంపీలు...
అధినాయకత్వం వేస్తున్న ఈ నాన్చివేత ఎత్తుగడలు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల పరిస్థితిని అడకత్తెరలో పోకచెక్కలా మారుస్తున్నాయి. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఎంత గట్టిగా చెబుతున్నా, వారు అధినాయకత్వం ఇలాగే సాచివేత ధోరణి అనుసరిస్తే ప్రజలు తమను వీధుల్లో నిలదీసే పరిస్థితి దాపురిస్తుందని ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆందోళనతో ఉన్నారు. అఖిలపక్షం తర్వాత కేంద్రం ఏదో ఒక అభిప్రాయాన్ని చెప్పకపోతే ప్రజలు తమను నిలదీయక తప్పదని, దానికి తాము ఇవ్వాల్సిన సంజాయిషీ ఏమిటో తేల్చుకోలేకపోతున్నామని ప్రజా ప్రతినిధులు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే సీనియర్‌ నేత కె.కేశవరావు లాంటి వారు స్వరం పెంచి అవసరం అయితే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యత్వాన్ని అయినా సరే వదులుకుంటానని చెప్పటం, తెలంగాణ కోసం జైలుకు వెళ్ళటానికైనా సిద్ధం అని చెప్పటాన్ని చూస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులలో ఏ స్థాయి ఆందోళన, భయం పెనవేసుకు పోయి ఉన్నాయో అర్థం అవుతున్నదని ఇతర పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏదేమైనప్పటికీ తెలంగాణఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం అనుసరిస్తున్న నాన్చుడు వ్యూహం తెలంగాణ నేతలను మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా వ్యవహరించేలా చేస్తున్నది. చూస్తూ చూస్తూ నాయకత్వాన్ని ధిక్కరించలేకపోవటం, అలాగని మౌనంగా ఉండి ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోవటం వంటి ఇబ్బందికర పరిస్థితిలో ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
Click Here!

‘ఆరు’కు ఎసరు ?
logos 
జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివే దికపై అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు కేంద్రం ఈ నెల ఆరున ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశం సజావుగా సాగకుండా తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతున్నది. కాంగ్రెస్‌ మినహా ప్రధాన రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాకుండా పార్టీ అధినేత కేసీఆర్‌ స్వయంగా చొరవ తీసుకుంటున్నారు. పార్టీకి ఇద్దరు చొప్పున వెళ్ళటం వల్ల తేలేది ఏమీ లేదని అలాంటప్పుడు వెళ్ళి ప్రయోజనం ఏముంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన తమ పార్టీ హాజరు కావటం లేదని స్పష్టం చేశారు. స్వయంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణకు ఫోన్‌ చేసి వెళ్ళవద్దని అర్థించారు. అయితే తాము వెళ్ళి తీరుతామని, అభిప్రాయం చెబుతామని నారాయణ స్పష్టం చేసినట్టు సమాచారం. అయినా ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో మరోసారి మాట్లాడి సీపీఐని దూరం చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
బీజేపీ దూరం....
అసలు కమిటీకే చట్టబద్ధత లేనప్పుడు అఖిలపక్షానికి హాజరై ప్రయోజనం ఏమిటని బీజేపీ ముందు నుంచీ ప్రశ్నిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అఖిలపక్షానికి వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సిహెచ్‌.విద్యాసాగరరావు సైతం ఇదే డిమాండ్‌ చేశారు. సమావేశానికి కాంగ్రెస్‌, టీడీపీ దూరంగా ఉండాలని సూచించారు.
టీడీపీ డైలమా...
ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో తల బొప్పికట్టించుకున్న తాము మళ్ళీ అఖిల పక్షానికి వెళ్ళి రెండు ప్రాంతాలకూ అనుకూలంగా అభిప్రాయాలు చెప్పి వస్తే టీఆర్‌ఎస్‌కు మరో అస్త్రాన్ని అందించినట్టు అవుతుందన్న అభిప్రా యంతో తెలంగాణ ప్రాంత నేతలు కొందరు ఉన్నట్టు సమాచారం. సీమా ంధ్ర ప్రాంత నేతలు సైతం ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు తెలిసింది. వెళ్ళినా ఏ ప్రాంతం నేతలు ఆ ప్రాంతానికి అనుకూలంగా వాదనలు వినిపించటం తప్ప చేయగలిగిందేమీ లేదని, అలాంటప్పుడు సమావే శానికి వెళ్ళి తెలంగాణ లేదా సమైక్యాంధ్ర వ్యతిరేక పార్టీగా ముద్ర వేయిం చుకోవటం ఎందుకన్న అభిప్రాయాన్ని పార్టీలో పలువురు సీనియర్‌ నేతలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
కచ్చితంగా వెళ్ళేది మూడు పార్టీలే...
ఈ నేపథ్యంలో అఖిలపక్షానికి కచ్చితంగా హాజరయ్యే పార్టీలు మూడే కనిపిస్తున్నాయి. అధికార పక్షం కాబట్టి కాంగ్రెస్‌కు ఎలాగూ వెళ్ళక తప్ప దు. ఆ పార్టీ తరఫున ఇద్దరితో పాటు ముఖ్యమంత్రి హోదాలో తాను సైతం స్వయంగా హాజరవుతానని కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటిం చారు. ఈ లెక్కన కాంగ్రెస్‌ తరఫున మెజారిటీ అభిప్రాయం సమైక్యానికి అనుకూలంగానే ఉండక తప్పదు. ఇక ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణ నినాదాన్ని అటకెక్కించి సమైక్య వాదానికి కట్టుబడింది. లోక్‌సత్తా అదే అభిప్రాయంతో ఉంది. ఇక మజ్లిస్‌ తెలంగాణకు అనుకూలమూ కాదు, ప్రతికూలమూ కాదు. అయితే హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తున్నది.

ఇక సీపీఎం సైతం తన వైఖరిలో మార్పు రాకపోయినప్పటికీ, తెలంగాణలో పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. తాము హాజరైనా, కాకపోయినా ఎలాంటి ఫలితమూ ఉండనప్పుడు, ఇప్పటికే ఒకసారి పార్టీ అభిప్రాయాన్ని ఏడాది క్రితం స్పష్టం చేసినందున హాజరై ప్రయోజనం ఏమీ లేదన్న అభిప్రాయంతో నాయకత్వం ఉన్నట్టు చెబుతున్నారు. ఇన్ని ప్రతికూల అంశాల నేపథ్యంలో, ప్రధాన రాజకీయ పార్టీలలో చాలా మటుకు గైర్హాజరు అయిన పక్షంలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చేందుకు వీలు కలుగుతుందన్న అభిప్రాయంతో కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం. ఎలాగూ జాతీయ పార్టీ అయిన బీజేపీ హాజరు కానందున మిగిలిన పార్టీలను సైతం సమావేశానికి దూరంగా ఉంచితే తెలంగాణ పట్ల ప్రజాభిప్రాయం ఎంత తీవ్రంగా ఉందో కేంద్రానికి వ్యక్తం చేసినట్టు అవుతుందని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. తాము సమావేశానికి వెళ్తామని సీపీఐ చెప్పినప్పటికీ, మరో మారు ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో మంతనాలు జరిపేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

Click Here!

నివేదిక సీఎం చేతుల్లో !

పీఆర్పీ, ఎంఐఎం నేతలతో కిరణ్ చర్చలు

అఖిలపక్ష వ్యూహంపై కసరత్తు
శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏముందో సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసా? ఆ నివేదిక ప్రతి ముఖ్యమంత్రి చేతికి చేరిందా? అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సీఎం... తాను అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు!! ఈ నెల ఆరో తేదీన ఢిల్లీలో హోం మంత్రి చిదంబరం సమక్షంలో జరిగే అఖిలపక్ష సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు.

అంతేకాదు.. భవిష్యత్తులో తనతో కలిసి వస్తారని భావిస్తున్న పీఆర్పీ, ఎంఐఎం పెద్దలతో ఆదివారం సాయంత్రం వేర్వేరుగా చర్చించారు. చిరంజీవి, రామచంద్రయ్య, అసదుద్దీన్ ఒవైసీ ఈ చర్చల్లో పాల్గొన్నారు. వ్యవసాయ రంగ సమస్యలపై చర్చించినట్లు పీఆర్పీ... ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడామని ఎంఐఎం నాయకులు చెబుతున్నా, నిజానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక అంశాలపైనే వీరు ప్రధానంగా చర్చించారని తెలిసింది.

అయితే, రైతు సమస్యలపై మాట్లాడేందుకు సోమవారంనాటికి సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరామని, అనుకోకుండా ఆయన ఆదివారమే సమయం ఇవ్వడంతో చిరంజీవి, రామచంద్రయ్య వెళ్లి కలిశారని పీఆర్పీ పార్టీ వర్గాలు వివరించాయి. ఈ సమావేశానికి కొద్దిసేపటి ముందే కేసీఆర్ ఒక ప్రకటన చేస్తూ పార్టీకి ఒక్కరినే అఖిలపక్ష భేటీకి పిలవాలని, లేదంటే సమావేశాన్ని బహిష్కరిస్తామని ప్రకటించారు. ఈ అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది.

శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని వివిధ అంశాలపై ఎలాంటి వైఖరి అవలంబించాలన్న అంశంపై సీఎం వారితో చర్చించారు. ఆదివారం నాటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అఖిలపక్ష సమావేశానికి ముందే సొంత పార్టీలోని తెలంగాణ నేతల్లో కూడా భిన్నస్వరాలు వినిపించడంతో తన వైఖరి ఏంటో బయట పడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు.