Friday, September 10, 2010

గండిపేట నీళ్లు తాగి బలిసిన సీమాంధ్రులకు మర్యాద తెలియదంటున్న మధుయాష్కి

తెలంగాణావాదులను రాజకీయ నిరుద్యోగులు అని సీమాంధ్ర నేతలు తేలికగా మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎం.పి. మధు యాష్కి ఆక్షేపించారు. గండిపేట నీళ్లు తాగి సీమాంధ్ర నేతలు బలిసి ఇలా మాట్లాడుతున్నారని, సీమాంధ్ర నాయకులు ఇలాగే మాట్లాడితే ఇక ప్రజలు బట్టలూడదీసి కొడతారని ఆయన హెచ్చరించారు.

సీమాంధ్ర నాయకులకు మర్యాద లేదని, అందుకే వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎమార్ ప్రాపర్టీస్ దగ్గరనుంచి ఏ భూకుంభకోణం చూసినా అందులో ఉండేది సీమాంధ్ర రాజకీయ నాయకుల హస్తమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీమాంధ్ర ఎం.పి.ల ఆస్తులు ఎంత పెరిగినయ్యో చూడండి, ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఈ ఎం.పి.లు ఎలా డబ్బు దండుకుంటున్నారో చూడాలని ఆయన కోరారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణాలో టోల్ గేట్‌లు పెట్టి మరీ తెలంగాణా డబ్బు దోచుకుపోతున్నారని ఆయన విమర్శించారు. కావూరి సాంబశివరావు, లగడపాటి అందరూ దోచుకుంటున్నవారేనని, ఎవరు ఏ పార్టీకి చెందినవారు అనేది కాదని, అన్ని పార్టీల సీమాంధ్ర నాయకులూ తెలంగాణాను దోచుకుంటున్నారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

No comments: